ఒకప్పుడు ఆడియో లాంచ్ అంటే ఒకేసారి ఆల్బమ్ లో ఉన్న పాటలన్నీ క్యాసెట్ లేదా సిడి ద్వారా రిలీజయ్యేవి. ముప్పై నుంచి నూటా యాభై రూపాయల మధ్య ధరలో తమ అవసరానికి తగ్గట్టు శ్రోతలు వాటిని కొని వినేవాళ్ళు. ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి అన్ని సాంగ్స్ ఆస్వాదించాల్సిందే. ఫ్లాప్ అయిన సినిమాలు సైతం మ్యూజిక్ కంపెనీలకు లాభాలు తెచ్చిన దాఖలాలు బోలెడు. కానీ యూట్యూబ్ కాలంలో మొత్తం మారిపోయింది. ప్రమోషన్ల పేరుతో ఒక్కో పాటని ఒక్కో సందర్భంలో లిరికల్ వీడియో పేరుతో నెమ్మదిగా రిలీజ్ చేయడం వల్ల కొన్నింటికి అనుకున్న రీచ్ రావడం లేదు.
ఈ ట్రెండ్ వల్ల సంగీత దర్శకుల కష్టం పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని చేరడం లేదని మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పదిరోజులకో పాట కాకుండా అన్ని సాంగ్స్ ఒక ప్యాకేజీలా ఒకేసారి ఇస్తేనే మంచిదని చెప్పారు. దాన్ని నిర్మాత దిల్ రాజు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిలు అమలు పరిచారు. ఈ నెల 25 విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ ఆడియో లాంచ్ నిన్న గ్రాండ్ గా నిర్వహించారు. దశాబ్దాల తర్వాత ఒక తెలుగు సినిమాలో అన్ని పాటలు ఒకేసారి రిలీజ్ చేసిన అరుదైన సందర్భాన్ని సృష్టించారు. స్టేజి మీద లైవ్ కన్సర్ట్ కూడా చేశారు.
ఇప్పుడీ పద్ధతి వల్ల ఇప్పటికిప్పుడు అనూహ్య ఫలితాలు రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో మార్పుని చూడొచ్చు. ఎందుకంటే ఒక పాట రేపిన అసంతృప్తిని ఇంకో పాట బ్యాలన్స్ చేయడం ద్వారా ప్రేక్షకుల్లో అంచనాల పరంగా ఇబ్బందులు తలెత్తవు. అలా కాకుండా ముందు వచ్చింది ఏ మాత్రం నచ్చకపోయినా ఏకంగా దాని ప్రభావం హైప్ మీద పడుతుంది. గుంటూరు కారం టైంలో ఓ మే బేబీ గురించి జరిగిన రాద్ధాంతం గుర్తుందిగా. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ మీ ఇఫ్ యు డేర్ కి కీరవాణి, పిసి శ్రీరామ్ లాంటి ఉద్దండులు పని చేశారు. దర్శకుడిగా అరుణ్ పరిచయమవుతున్నారు.
This post was last modified on April 10, 2024 11:37 am
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మాంచి ఊపుమీదున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన…
గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల లడ్డు నాణ్యత పడిపోయిందని.. లడ్డు తయారీలో వాడిన నెయ్యలో…
కూటమి సర్కారుకు వంద రోజులు పూర్తయ్యాయి. సంతృప్తి విషయంలో కూటమి పార్టీల నాయకులు తల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా?…
దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్బ్రాండ్లు కూడా…
తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్,…