Movie News

2025 సంక్రాంతి : పెరుగుతున్న పోటీ పుంజులు

టాలీవుడ్ బంగారు బాతులా భావించే సంక్రాంతి సీజన్ కోసం మన హీరోలు, నిర్మాతలు ఎంతగా టార్గెట్ చేసుకుంటారో కొత్తగా చెప్పడానికేం లేదు కానీ క్రమంగా దాన్ని నెలల ముందే రిజర్వ్ చేసుకునే ట్రెండ్ మాత్రం క్రమంగా ఊపందుకుంటోంది. ఇంకా తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికీ 2025 జనవరి మీద కర్చీఫ్ లు వేసే సంఖ్య పెరుగుతూ పోతోంది. చిరంజీవి విశ్వంభర మొదటగా అధికారిక ప్రకటన చేసుకుని సేఫ్ గేమ్ ఆడింది. పండక్కు నాలుగు రోజుల ముందే వస్తామని పదో తేదీని అఫీషియల్ గా లాక్ చేసుకున్నారు. దానికి అనుగుణంగానే వేగంగా షూటింగ్ చేస్తున్నారు.

ఇవాళ రవితేజ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే ఎంటర్ టైనర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ త్వరలోనే చిత్రీకరణకు వెళ్లబోతున్నారు. ప్రీ లుక్ పోస్టర్ లోనే సంక్రాంతి అని చెప్పేశారు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం చేతులు కలుపుతున్న వెంకటేష్ అనిల్ రావిపూడిల సినిమా కూడా పండక్కు రావడం ఖాయం. శతమానం భవతి నెక్స్ట్ పేజీని వదులుతానని చెప్పిన నిర్మాత దిల్ రాజు దాని స్థానంలో వెంకీ మూవీని రిలీజ్ చేస్తారు. ఈ మాట నేరుగా కాకపోయినా చూచాయగా పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు.

నా సామిరంగ సక్సెస్ తర్వాత నాగార్జున మరోసారి పండగనే కోరుకుంటున్నారు. సెట్స్ మీదున్న రెండు సినిమాల్లో ఏది వస్తుందో తెలియదు కానీ ఏదో ఒకటి రావడమైతే రావడమైతే కన్ఫర్మే. యువి క్రియేషన్స్ విశ్వంభర నిర్మాతలు కాబట్టి ప్రభాస్ ది రాజా డీలక్స్ ఈ పోటీలో దిగడం అనుమానమే. ఇంకెవరెవరు వస్తారో రోజులు గడిచే కొద్దీ తెలుస్తుంది. అయినా ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన అందరూ మాట మీద ఉంటారన్న గ్యారెంటీ లేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎవరు ఉంటారో ఎవరు తప్పుకుంటారో ఇప్పుడే చెప్పలేం కానీ బోలెడు మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి.

This post was last modified on April 10, 2024 11:33 am

Share
Show comments

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

9 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

3 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

4 hours ago