కృష్ణంరాజు గారి వారసుడిగా ప్రభాస్ స్థాయి ప్యాన్ ఇండియాని మించి ఎదగడం చూస్తూనే ఉన్నాం. ఫలితాలతో సంబంధం లేకుండా ఆకాశమే హద్దుగా తన సినిమాల బిజినెస్ అంతకంతా పెరుగుతూ పోతోంది తప్పించి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఇంకో హీరో రాలేదు. తాజాగా విరాట్ రాజ్ ని తీసుకొస్తున్నారు. గౌడ్ సాబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ లాంచ్ ఇవాళ గ్రాండ్ గా జరిగింది. గెస్టులుగా పిలిచిన అతిథుల లిస్టు పెద్దగా ఉంది కానీ సుకుమార్ హాజరు మాత్రమే కనిపించింది. విరాట్ చూసేందుకు ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు.
డాన్స్ మాస్టర్ గణేష్ దీని ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. లారెన్స్ రాఘవేంద్ర, ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుని మెగా ఫోన్ చేపట్టాడు. విరాట్ రాజ్ ని ప్రభాస్ కజిన్ గా చెబుతున్నారు కానీ ఏ వరస, ఎలా బంధుత్వం లింక్ కుదిరిందనేది మాత్రం బయటికి చెప్పడం లేదు. కజిన్ పదాన్నే వాడుతున్నారు. 2011లోనూ ప్రభాస్ రిలేటివ్ కుర్రాడు లాంచ్ అవుతాడని తెగ ప్రచారం చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ విరాట్ రాజ్ కు అలాంటి సమస్య రాకపోవచ్చు. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకుని షూటింగ్ కు వెళ్ళబోతున్నారు.
ఇదంతా ఒకే కానీ ప్రభాస్ ది రాజా సాబ్ చేస్తున్నాడు కాబట్టి అదే సౌండ్ వచ్చేలా గౌడ్ సాబ్ టైటిల్ పెట్టినట్టు ఉందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయినా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా సరైన కంటెంట్ తో వచ్చి, మల్టీ టాలెంట్స్ తో ఆకట్టుకుంటేనే ఇక్కడ భవిష్యత్తు ఉందనే సంగతి విరాట్ కు తెలియంది కాదు. అంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ లే సరైన హిట్లు లేక ఓపెనింగ్స్ దగ్గరే దెబ్బ తింటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. సో డార్లింగ్ బ్రాండ్ తో నెట్టుకురావడం డెబ్యూకి కొంత పని చేయొచ్చేమో కానీ మాట్లాడాల్సింది మాత్రం హిట్లే.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…