Movie News

గోపీచంద్ ను రక్షించడానికి పీపుల్స్ మీడియా

యాక్షన్ హీరో గోపీచంద్ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అతను చూడలేదు. గౌతమ్ నంద, సీటీమార్ లాంటి సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. మిగతావన్నీ డిజాస్టర్లే. లేటెస్ట్‌గా ‘భీమా’తో మరో డిజాస్టర్‌ను అతను ఖాతాలో వేసుకున్నాడు. గోపీచంద్‌కు ఇది ఎన్నో ఫ్లాప్ అని లెక్కబెట్టుకోవడం కూడా అభిమానులు మానేశారు. ఇప్పుడతడి ఆశలన్నీ శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా మీదే ఉన్నాయి.

ఈ మూవీ మొదలై చాలా రోజులైంది. కానీ మొదలైనపుడు కొంత హడావుడి చేశారు. తర్వాత సౌండ్ లేదు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ పరంగా ఏవో ఇబ్బందులు తలెత్తాయని.. షూటింగ్ ఆగిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు.

కట్ చేస్తే ఈ రోజు గోపీచంద్ ఉగాది సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసి.. ఏప్రిల్ 11న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్ మీద పీపుల్స్ మీడియా బేనర్ లోగో.. టీజీ విశ్వప్రసాద్ పేరు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ముందు ఇద్దరు కొత్త నిర్మాతలు కలిసి ‘చిత్రాలయం’ బేనర్ మీద ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఐతే బడ్జెట్ సమస్యల దృష్ట్యా అందులో ఒకరు తప్పుకున్నారు. దీంతో ఈ చిత్రాన్ని టేకోవర్ చేసే ప్రొడ్యూసర్ కోసం చూశారు.

ప్రస్తుతం టాలీవుడ్లో పదుల సంఖ్యలో సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్న విశ్వప్రసాద్ ముందుకు వచ్చారు. ఆయన ఈ చిత్రంలో భాగస్వామిగా మారారు. ఈ రకంగా గోపీచంద్‌కు ఆయన చేస్తున్నది పెద్ద సాయమే. ఆగిపోయేలా ఉన్న సినిమాను టేకోవర్ చేయడం చిన్న విషయం కాదు. మరి ఏప్రిల్ 11న ఫస్ట్ గ్లింప్స్‌తో గోపీ-వైట్ల జోడీ ఏమేర మెప్పిస్తుందో చూడాలి.

This post was last modified on April 9, 2024 6:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వృషకర్మ… జాక్ పాట్ కొట్టిందమ్మా

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…

42 minutes ago

అంతు చిక్కని ప్రభాస్ ఆలోచనలు

టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…

2 hours ago

యుద్ధం ప్రభావం బాక్సాఫీసు మీద ఉంటుందా

ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…

3 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఇప్పట్లో ముగింపు లేదా?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…

4 hours ago

నోరు జారిన నటకిరీటి… మరో కొత్త వివాదం

అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…

4 hours ago

బ్లాక్ బస్టర్ మిత్రులకు బ్రేక్

బన్నీ వాసు, వంశీ నందిపాటి.. ఈ మధ్య టాలీవుడ్‌లో లక్కీ ప్రొడ్యూసర్స్‌గా పేరు తెచ్చుకున్న జంట. ఇద్దరూ ఇంతకుముందు వేర్వేరుగా…

4 hours ago