Movie News

సంగీత ద‌ర్శ‌కుడికి నిర్మాత చుర‌క‌లు

త‌మిళ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌కు తెలుగు మార్కెట్ నుంచి వ‌చ్చే క‌లెక్ష‌న్లు కావాలి కానీ.. ఇక్క‌డికి వ‌చ్చి త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకునే తీరిక మాత్రం ఉండ‌ద‌ని త‌ర‌చుగా విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. సూర్య‌, కార్తి లాంటి వాళ్లు కొంద‌రు మాత్ర‌మే ఈ విష‌యంలో శ్ర‌ద్ధ చూపిస్తుంటారు. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌లో చాలామంది త‌మ సినిమాల తెలుగు వెర్ష‌న్ల ప్రమోష‌న్ల‌ను అంత‌గా ప‌ట్టించుకోరు.

ఈ నేప‌థ్యంలో త‌మిళ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ కుమార్‌కు టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అద‌ను చూసి మంచి పంచ్ వేశాడు. జీవీ ప్ర‌కాష్ న‌టుడిగా కూడా ఫుల్ బిజీ అన్న సంగ‌తి తెలిసిందే. అత‌డి సినిమాలు కొన్ని తెలుగులోనూ రిలీజ‌య్యాయి.

ఇప్పుడు డియ‌ర్ పేరుతో జీవీ చేసిన ఓ సినిమా తెలుగులోనూ ఈ నెల 12న విడుద‌ల కాబోతోంది. ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు అతిథుల్లో ఒక‌రుగా వ‌చ్చిన నాగ‌వంశీ.. జీవీ త‌మ సంస్థ‌లో రెండు సినిమాల‌కు ప‌ని చేశాడ‌ని.. కానీ ఆ సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌రు కాలేద‌ని.. కానీ తాము మాత్రం అత‌డి సినిమా తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌య్యామ‌ని చుర‌క అంటించాడు.

దీంతో జీవీ న‌వ్వేస్తూ.. తాను సితార సంస్థ‌లో ప్ర‌స్తుతం సంగీతం అందిస్తున్న ల‌క్కీ భాస్క‌ర్‌కు సంబంధించి ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కూ త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతాన‌ని అన్నాడు. ఈ వేడుక‌లో ల‌క్కీ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి సైతం పాల్గొన్నాడు. అత‌ను తీసిన స‌ర్‌తో పాటు ఆదికేశ‌వ చిత్రాల‌కు సితార సంస్థ‌లో ప‌ని చేశాడు జీవీ.

This post was last modified on April 8, 2024 11:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

4 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago