తమిళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు తెలుగు మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్లు కావాలి కానీ.. ఇక్కడికి వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే తీరిక మాత్రం ఉండదని తరచుగా విమర్శలు వస్తుంటాయి. సూర్య, కార్తి లాంటి వాళ్లు కొందరు మాత్రమే ఈ విషయంలో శ్రద్ధ చూపిస్తుంటారు. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో చాలామంది తమ సినిమాల తెలుగు వెర్షన్ల ప్రమోషన్లను అంతగా పట్టించుకోరు.
ఈ నేపథ్యంలో తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ అదను చూసి మంచి పంచ్ వేశాడు. జీవీ ప్రకాష్ నటుడిగా కూడా ఫుల్ బిజీ అన్న సంగతి తెలిసిందే. అతడి సినిమాలు కొన్ని తెలుగులోనూ రిలీజయ్యాయి.
ఇప్పుడు డియర్ పేరుతో జీవీ చేసిన ఓ సినిమా తెలుగులోనూ ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకకు అతిథుల్లో ఒకరుగా వచ్చిన నాగవంశీ.. జీవీ తమ సంస్థలో రెండు సినిమాలకు పని చేశాడని.. కానీ ఆ సినిమాల ప్రమోషన్లకు హాజరు కాలేదని.. కానీ తాము మాత్రం అతడి సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్లకు హాజరయ్యామని చురక అంటించాడు.
దీంతో జీవీ నవ్వేస్తూ.. తాను సితార సంస్థలో ప్రస్తుతం సంగీతం అందిస్తున్న లక్కీ భాస్కర్కు సంబంధించి ప్రతి ప్రమోషనల్ ఈవెంట్కూ తప్పకుండా హాజరవుతానని అన్నాడు. ఈ వేడుకలో లక్కీ భాస్కర్ దర్శకుడు వెంకీ అట్లూరి సైతం పాల్గొన్నాడు. అతను తీసిన సర్తో పాటు ఆదికేశవ చిత్రాలకు సితార సంస్థలో పని చేశాడు జీవీ.
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…