Movie News

సంగీత ద‌ర్శ‌కుడికి నిర్మాత చుర‌క‌లు

త‌మిళ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌కు తెలుగు మార్కెట్ నుంచి వ‌చ్చే క‌లెక్ష‌న్లు కావాలి కానీ.. ఇక్క‌డికి వ‌చ్చి త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకునే తీరిక మాత్రం ఉండ‌ద‌ని త‌ర‌చుగా విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. సూర్య‌, కార్తి లాంటి వాళ్లు కొంద‌రు మాత్ర‌మే ఈ విష‌యంలో శ్ర‌ద్ధ చూపిస్తుంటారు. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌లో చాలామంది త‌మ సినిమాల తెలుగు వెర్ష‌న్ల ప్రమోష‌న్ల‌ను అంత‌గా ప‌ట్టించుకోరు.

ఈ నేప‌థ్యంలో త‌మిళ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ కుమార్‌కు టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అద‌ను చూసి మంచి పంచ్ వేశాడు. జీవీ ప్ర‌కాష్ న‌టుడిగా కూడా ఫుల్ బిజీ అన్న సంగ‌తి తెలిసిందే. అత‌డి సినిమాలు కొన్ని తెలుగులోనూ రిలీజ‌య్యాయి.

ఇప్పుడు డియ‌ర్ పేరుతో జీవీ చేసిన ఓ సినిమా తెలుగులోనూ ఈ నెల 12న విడుద‌ల కాబోతోంది. ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు అతిథుల్లో ఒక‌రుగా వ‌చ్చిన నాగ‌వంశీ.. జీవీ త‌మ సంస్థ‌లో రెండు సినిమాల‌కు ప‌ని చేశాడ‌ని.. కానీ ఆ సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌రు కాలేద‌ని.. కానీ తాము మాత్రం అత‌డి సినిమా తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌య్యామ‌ని చుర‌క అంటించాడు.

దీంతో జీవీ న‌వ్వేస్తూ.. తాను సితార సంస్థ‌లో ప్ర‌స్తుతం సంగీతం అందిస్తున్న ల‌క్కీ భాస్క‌ర్‌కు సంబంధించి ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కూ త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతాన‌ని అన్నాడు. ఈ వేడుక‌లో ల‌క్కీ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి సైతం పాల్గొన్నాడు. అత‌ను తీసిన స‌ర్‌తో పాటు ఆదికేశ‌వ చిత్రాల‌కు సితార సంస్థ‌లో ప‌ని చేశాడు జీవీ.

This post was last modified on April 8, 2024 11:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago