తమిళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు తెలుగు మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్లు కావాలి కానీ.. ఇక్కడికి వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే తీరిక మాత్రం ఉండదని తరచుగా విమర్శలు వస్తుంటాయి. సూర్య, కార్తి లాంటి వాళ్లు కొందరు మాత్రమే ఈ విషయంలో శ్రద్ధ చూపిస్తుంటారు. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో చాలామంది తమ సినిమాల తెలుగు వెర్షన్ల ప్రమోషన్లను అంతగా పట్టించుకోరు.
ఈ నేపథ్యంలో తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ అదను చూసి మంచి పంచ్ వేశాడు. జీవీ ప్రకాష్ నటుడిగా కూడా ఫుల్ బిజీ అన్న సంగతి తెలిసిందే. అతడి సినిమాలు కొన్ని తెలుగులోనూ రిలీజయ్యాయి.
ఇప్పుడు డియర్ పేరుతో జీవీ చేసిన ఓ సినిమా తెలుగులోనూ ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకకు అతిథుల్లో ఒకరుగా వచ్చిన నాగవంశీ.. జీవీ తమ సంస్థలో రెండు సినిమాలకు పని చేశాడని.. కానీ ఆ సినిమాల ప్రమోషన్లకు హాజరు కాలేదని.. కానీ తాము మాత్రం అతడి సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్లకు హాజరయ్యామని చురక అంటించాడు.
దీంతో జీవీ నవ్వేస్తూ.. తాను సితార సంస్థలో ప్రస్తుతం సంగీతం అందిస్తున్న లక్కీ భాస్కర్కు సంబంధించి ప్రతి ప్రమోషనల్ ఈవెంట్కూ తప్పకుండా హాజరవుతానని అన్నాడు. ఈ వేడుకలో లక్కీ భాస్కర్ దర్శకుడు వెంకీ అట్లూరి సైతం పాల్గొన్నాడు. అతను తీసిన సర్తో పాటు ఆదికేశవ చిత్రాలకు సితార సంస్థలో పని చేశాడు జీవీ.
This post was last modified on April 8, 2024 11:43 pm
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…