దేవర విషయంలో జరుగుతున్న జాప్యం అభిమానులను ఎంత కలవరపెడుతుందో జూనియర్ ఎన్టీఆర్ కి తెలియంది కాదు. పరిస్థితులు అనుకూలించి ఉంటే ఏప్రిల్ 5 రిలీజై ఈ పాటికి థియేటర్లలో రచ్చ జరిగి ఉండాల్సింది. ఇది నిర్మాణంలో ఉన్నంత కాలం తారక్ బయట పబ్లిక్ ఈవెంట్లకు వచ్చిన దాఖలాలు తక్కువ. అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం హాజరయ్యాడు కానీ మరీ జోష్ తో కనిపించిన సందర్భాలు వేళ్ళ మీద లెక్క బెట్టొచ్చు. దీనికి భిన్నంగా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు వచ్చిన జూనియర్ మంచి హుషారుగా కనిపించడమే కాదు దేవరకు సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చేశాడు.
వాటిలో మొదటిది కాలర్ ఎగరేయడం. కొంచెమే అతిగా అనిపించినా పర్వాలేదు, నమ్మకంగా చెబుతున్నా దేవర చూశాక నాలాగే చొక్కాలు వేసుకుని దేవర చూసినవాళ్లు గర్వంగా కాలర్ ని పైకెత్తడం ఖాయమని నొక్కి చెప్పడం ఆడిటోరియంని చప్పట్లతో హోరెత్తించింది. అంతే కాదు తన సినిమా నేపథ్యం భయం చుట్టూ ఉంటుందని, దాన్ని ఎలా ఎదురుకోవాలనే పాయింట్ ని చూపిస్తుందని డైలాగు రూపంలో చెప్పడంతో ఈసారి విజిల్స్ మోతెక్కిపోయాయి. మాటల్లో హుషారు తొణికిసలాడుతూ ఉండగా తారక్ చేసిన ప్రసంగం కాసేపు ఇది టిల్లు స్క్వేర్ వేడుకేనా అనిపించేలా చేసింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కోరుకున్నదే జరిగింది. త్రివిక్రమ్ ని ఉద్దేశించి అత్తారింటికి దారేది డైలాగుని వాడుకుని తారక్ తన అభిమానాన్ని చాటడం ఆకట్టుకుంది. అరవింద సమేత వీర రాఘవ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పి మళ్ళీ పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచాడు. గతంలో అల వైకుంఠపురములో తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబోలో ప్రకటించిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాని స్థానంలోనే గుంటూరు కారం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ చేశాక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. అందరూ కోరుకునేది అదే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…