దేవర విషయంలో జరుగుతున్న జాప్యం అభిమానులను ఎంత కలవరపెడుతుందో జూనియర్ ఎన్టీఆర్ కి తెలియంది కాదు. పరిస్థితులు అనుకూలించి ఉంటే ఏప్రిల్ 5 రిలీజై ఈ పాటికి థియేటర్లలో రచ్చ జరిగి ఉండాల్సింది. ఇది నిర్మాణంలో ఉన్నంత కాలం తారక్ బయట పబ్లిక్ ఈవెంట్లకు వచ్చిన దాఖలాలు తక్కువ. అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం హాజరయ్యాడు కానీ మరీ జోష్ తో కనిపించిన సందర్భాలు వేళ్ళ మీద లెక్క బెట్టొచ్చు. దీనికి భిన్నంగా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు వచ్చిన జూనియర్ మంచి హుషారుగా కనిపించడమే కాదు దేవరకు సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చేశాడు.
వాటిలో మొదటిది కాలర్ ఎగరేయడం. కొంచెమే అతిగా అనిపించినా పర్వాలేదు, నమ్మకంగా చెబుతున్నా దేవర చూశాక నాలాగే చొక్కాలు వేసుకుని దేవర చూసినవాళ్లు గర్వంగా కాలర్ ని పైకెత్తడం ఖాయమని నొక్కి చెప్పడం ఆడిటోరియంని చప్పట్లతో హోరెత్తించింది. అంతే కాదు తన సినిమా నేపథ్యం భయం చుట్టూ ఉంటుందని, దాన్ని ఎలా ఎదురుకోవాలనే పాయింట్ ని చూపిస్తుందని డైలాగు రూపంలో చెప్పడంతో ఈసారి విజిల్స్ మోతెక్కిపోయాయి. మాటల్లో హుషారు తొణికిసలాడుతూ ఉండగా తారక్ చేసిన ప్రసంగం కాసేపు ఇది టిల్లు స్క్వేర్ వేడుకేనా అనిపించేలా చేసింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కోరుకున్నదే జరిగింది. త్రివిక్రమ్ ని ఉద్దేశించి అత్తారింటికి దారేది డైలాగుని వాడుకుని తారక్ తన అభిమానాన్ని చాటడం ఆకట్టుకుంది. అరవింద సమేత వీర రాఘవ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పి మళ్ళీ పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచాడు. గతంలో అల వైకుంఠపురములో తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబోలో ప్రకటించిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాని స్థానంలోనే గుంటూరు కారం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ చేశాక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. అందరూ కోరుకునేది అదే.
This post was last modified on April 9, 2024 3:52 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…