దేవర విషయంలో జరుగుతున్న జాప్యం అభిమానులను ఎంత కలవరపెడుతుందో జూనియర్ ఎన్టీఆర్ కి తెలియంది కాదు. పరిస్థితులు అనుకూలించి ఉంటే ఏప్రిల్ 5 రిలీజై ఈ పాటికి థియేటర్లలో రచ్చ జరిగి ఉండాల్సింది. ఇది నిర్మాణంలో ఉన్నంత కాలం తారక్ బయట పబ్లిక్ ఈవెంట్లకు వచ్చిన దాఖలాలు తక్కువ. అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం హాజరయ్యాడు కానీ మరీ జోష్ తో కనిపించిన సందర్భాలు వేళ్ళ మీద లెక్క బెట్టొచ్చు. దీనికి భిన్నంగా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు వచ్చిన జూనియర్ మంచి హుషారుగా కనిపించడమే కాదు దేవరకు సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చేశాడు.
వాటిలో మొదటిది కాలర్ ఎగరేయడం. కొంచెమే అతిగా అనిపించినా పర్వాలేదు, నమ్మకంగా చెబుతున్నా దేవర చూశాక నాలాగే చొక్కాలు వేసుకుని దేవర చూసినవాళ్లు గర్వంగా కాలర్ ని పైకెత్తడం ఖాయమని నొక్కి చెప్పడం ఆడిటోరియంని చప్పట్లతో హోరెత్తించింది. అంతే కాదు తన సినిమా నేపథ్యం భయం చుట్టూ ఉంటుందని, దాన్ని ఎలా ఎదురుకోవాలనే పాయింట్ ని చూపిస్తుందని డైలాగు రూపంలో చెప్పడంతో ఈసారి విజిల్స్ మోతెక్కిపోయాయి. మాటల్లో హుషారు తొణికిసలాడుతూ ఉండగా తారక్ చేసిన ప్రసంగం కాసేపు ఇది టిల్లు స్క్వేర్ వేడుకేనా అనిపించేలా చేసింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కోరుకున్నదే జరిగింది. త్రివిక్రమ్ ని ఉద్దేశించి అత్తారింటికి దారేది డైలాగుని వాడుకుని తారక్ తన అభిమానాన్ని చాటడం ఆకట్టుకుంది. అరవింద సమేత వీర రాఘవ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పి మళ్ళీ పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచాడు. గతంలో అల వైకుంఠపురములో తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబోలో ప్రకటించిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాని స్థానంలోనే గుంటూరు కారం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ చేశాక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. అందరూ కోరుకునేది అదే.
This post was last modified on April 9, 2024 3:52 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…