ఇవాళ రిలీజైన టీజర్ కాని టీజర్ గురించి అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది. షాక్ ఇచ్చే లేడీ గెటప్ లో మాస్ కి కిక్ ఇచ్చే బాడీ లాంగ్వేజ్ తో ఫైట్ చేసిన తీరు గూస్ బంప్స్ ఇచ్చాయి కానీ ఈ లుక్ ని గత ఏడాది పోస్టర్ రూపంలో ఆల్రెడీ చూసిందే కావడంతో భారీ జోష్ రాలేదని ఫీలవుతున్నారు. వ్యూస్ పరంగా రికార్డులు వస్తున్నాయి, బాలీవుడ్ క్రిటిక్స్ భేషని మెచ్చుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇతర ఆర్టిస్టులు ఎవరూ లేకుండా, స్టోరీ గురించి చిన్న క్లూస్ ఇవ్వకుండా చిన్న వీడియోని ఎందుకు వదిలారంటే దాని వెనుక దర్శకుడు సుకుమార్ వ్యూహం ఉందని తెలుస్తోంది.
విడుదలకు ఇంకా నాలుగు నెలల సమయముంది. కీలకమైన కంటెంట్ ని ఇప్పుడే ప్రమోషన్ కోసం వాడేస్తే రిలీజ్ నాటికి థ్రిల్ తగ్గిపోతుంది. పైగా ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి హైప్ పరంగా అన్ని భాషల్లో ఒకే టెంపో వచ్చేలా చూసుకోవాలి. అలా జరగాలంటే నెల లేదా నెలన్నర ముందుగానే ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో కేవలం గంగమ్మ జాతర ఎపిసోడ్ లుక్ ని రివీల్ చేయడంతో ఆపేసి ఆ సస్పెన్స్ ని అలాగే కొనసాగించాలనేది సుక్కు ఆలోచన. అసలే షూటింగ్ పీక్స్ లో ఉంది. కొత్త టీజర్ ఎడిటింగ్ చూసుకునేంత టైం, తీరిక సుకుమార్ కు లేదు. అందుకే సింగల్ షాట్ వీడియో వదిలారు.
అసలైన పబ్లిసిటీని జూన్ నుంచి తప్ప అంతకన్నా ముందు ఆశించే పరిస్థితి కనిపించడం లేదు. అయినా ఎంత తక్కువ లెన్త్ ఉన్నా బిజినెస్ పరంగా ఇవాళ వచ్చిన వీడియో చాలా ఉపయోగపడేలా ఉంది. నార్త్ సర్కిల్స్ లో డిస్కషన్లు మొదలయ్యాయి. ఉత్తరాది ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపించడంతో దీని మీద ఎంతమేర పెట్టుబడి పెట్టొచ్చనే కోణంలో విశ్లేషణలు చేస్తున్నారు. ఇంకోవైపు డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అనసూయ, సునీల్, ఫహద్ ఫాసిల్ తదితరులు హైదరాబాద్ లో ఈ పని మీదే ఉన్నారు. ఎలాంటి సందేహం లేకుండా ఆగస్ట్ 15 రిలీజ్ మాత్రం పక్కానే.
This post was last modified on April 8, 2024 9:55 pm
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…