ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ గురించి తెలుగు ప్రేక్షకులే కాదు నార్త్ నుంచి సౌత్ దాకా మూవీ లవర్స్ తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 1 ది రైజ్ దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎక్కువ విజయం సాధించడం ఒక కారణమైతే, టాలీవుడ్ కు ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ అవార్డు సాధించిన ఘనత కూడా దాని వల్లే దక్కడంతో ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. అందుకే ఇవాళ బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోయే టీజర్ మీద అందరి కళ్ళు ఉన్నాయి. వీడియో నిడివి తక్కువగానే ఉన్న పుష్పరాజ్ రియల్ మాస్ ని మరోసారి బలంగా ఆవిష్కరించారు.
కథకు సంబంధించి ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు కానీ అల్లు అర్జున్ వేసిన షాకింగ్ గెటప్ ని చూపించారు. చిత్తూరు జిల్లాలో సుప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతరలో మగాళ్లు ఆడవేషం వేసుకుని మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం దశాబ్దాల తరబడి ఉంది. పుష్పరాజ్ కూడా సిద్ధ పడతాడు. చీర, చెవి కమ్మలు, నగలు, నెత్తుటితో నుదుటి మీద బొట్టు, మొహంతో పాటు దేహమంతా అలంకారం చూస్తేనే ఒళ్ళు గగుర్పొడించేలా ఉన్నాడు. దేవత దగ్గరికి వెళ్తూ అడ్డొచ్చిన రౌడీలను తనదైన స్టైల్ లో చితకబాదుతూ వెళ్లే సీన్ అభిమానులకు గూస్ బంప్స్ అనే పదం చిన్నదే అనిపిస్తుంది.
ఆగస్ట్ 15 విడుదల తేదీని మరోసారి ధృవీకరిస్తూ పుష్ప 2 ది రూల్ టీజర్ చివర్లో క్లారిటీ ఇచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం, మిరెస్లో కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం సుకుమార్ విజన్ ని చక్కగా ఆవిష్కరించాయి. పుష్ప 1ని మించి ఎన్నో రెట్లు సీక్వెల్ ఉంటుందని టీమ్ ముందు నుంచి చెబుతున్న మాటలకు తగ్గట్టే అల్లు అర్జున్ గెటప్ ఒక అవగాహన ఇచ్చింది. టీజర్ అన్నారు కానీ ఇందులో ఇతర క్యాస్టింగ్ ని, సన్నివేశాలను ఏవీ రివీల్ చేయలేదు కాబట్టి ట్రైలర్ వచ్చే దాకా ఆగాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన పుష్ప 2 మీద వెయ్యి కోట్ల దాకా బిజినెస్ అంచనాలున్నాయి.
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…