అసలు సందర్భమే లేకుండా నాగ చైతన్య, అల్లు అరవింద్ సోషల్ మీడియాలో టాపిక్ గా మారడానికి ది ఫ్యామిలీ స్టార్ కారణం కావడం అనూహ్యమనే చెప్పాలి. సినిమా ఫలితం ఎటు వెళ్తోందో తెలిశాక అత్యంత అదృష్టవంతులు వీళ్ళేనంటూ అభిమానులు రకరకాల మీమ్స్, వీడియోలు ఎడిట్ చేసి పెట్టడం నిన్నటి నుంచే జరుగుతోంది. దీనికి కారణాలు అధిక శాతం జనాలకు తెలిసినప్పటికీ కొన్ని లోతైన కోణాలు చూద్దాం. సర్కారు వారి పాట కన్నా ముందు దర్శకుడు పరశురామ్ చైతుకి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ పనులు మెల్లగా మొదలు పెట్టారు .
ఈలోగా మహేష్ బాబు కాల్ రావడంతో నాగచైతన్యది పెండింగ్ పెట్టక తప్పని పరిస్థితుల్లో పరశురామ్ అటు వెళ్ళిపోయాడు. ఇంతా చేసి బ్లాక్ బస్టర్ అందుకోలేకపోవడం వేరే సంగతి. అల్లు అరవింద్ కు ఒక కమిట్ మెంట్ ఇచ్చిన ఇదే పరశురామ్ దాన్ని విజయ్ దేవరకొండ కాంబోలోనే చేయాల్సి ఉందని గట్టి ప్రచారమే జరిగింది. ఈలోగా అనూహ్య పరిణామాలు జరిగి నిర్మాత దిల్ రాజు పేరు మీద ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పటికే అరవింద్ అడ్వాన్స్ పరశురామ్ దగ్గర ఉందని వినికిడి. దీంతో ఆయన హర్ట్ కావడం, సీరియస్ గా ప్రెస్ మీట్ పెట్టాలనుకోవడం వాస్తవమే.
వ్యవహారం రచ్చకెక్కుతోందని అంతదాకా వెళ్లకుండా సన్నిహితులు ఆపేశారు. కట్ చేస్తే ది ఫ్యామిలీ స్టార్ వచ్చేసింది. యావరేజ్ అనిపించుకున్నా పండగ సెలవుల వల్ల హిట్ వైపు వెళ్లే అవకాశం దక్కేది. కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ అలా లేవు. సో నాగ చైతన్య, అల్లు అరవింద్ లక్కీగా తప్పించుకున్నది ఇదేనని ఫ్యాన్స్ వైపు వినిపిస్తున్న మాట. ఇవన్నీ నిజాలని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు కానీ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న రకరకాల చర్చలను విశ్లేషిస్తే తేలే మ్యాటర్ ఇదే. దీని సంగతేమో కానీ చైతు, అరవింద్ మాత్రం తండేల్ కోసం చేతులు కలిపి బాగా కష్టపడుతున్నారు.
This post was last modified on April 6, 2024 6:16 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…