అసలు సందర్భమే లేకుండా నాగ చైతన్య, అల్లు అరవింద్ సోషల్ మీడియాలో టాపిక్ గా మారడానికి ది ఫ్యామిలీ స్టార్ కారణం కావడం అనూహ్యమనే చెప్పాలి. సినిమా ఫలితం ఎటు వెళ్తోందో తెలిశాక అత్యంత అదృష్టవంతులు వీళ్ళేనంటూ అభిమానులు రకరకాల మీమ్స్, వీడియోలు ఎడిట్ చేసి పెట్టడం నిన్నటి నుంచే జరుగుతోంది. దీనికి కారణాలు అధిక శాతం జనాలకు తెలిసినప్పటికీ కొన్ని లోతైన కోణాలు చూద్దాం. సర్కారు వారి పాట కన్నా ముందు దర్శకుడు పరశురామ్ చైతుకి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ పనులు మెల్లగా మొదలు పెట్టారు .
ఈలోగా మహేష్ బాబు కాల్ రావడంతో నాగచైతన్యది పెండింగ్ పెట్టక తప్పని పరిస్థితుల్లో పరశురామ్ అటు వెళ్ళిపోయాడు. ఇంతా చేసి బ్లాక్ బస్టర్ అందుకోలేకపోవడం వేరే సంగతి. అల్లు అరవింద్ కు ఒక కమిట్ మెంట్ ఇచ్చిన ఇదే పరశురామ్ దాన్ని విజయ్ దేవరకొండ కాంబోలోనే చేయాల్సి ఉందని గట్టి ప్రచారమే జరిగింది. ఈలోగా అనూహ్య పరిణామాలు జరిగి నిర్మాత దిల్ రాజు పేరు మీద ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పటికే అరవింద్ అడ్వాన్స్ పరశురామ్ దగ్గర ఉందని వినికిడి. దీంతో ఆయన హర్ట్ కావడం, సీరియస్ గా ప్రెస్ మీట్ పెట్టాలనుకోవడం వాస్తవమే.
వ్యవహారం రచ్చకెక్కుతోందని అంతదాకా వెళ్లకుండా సన్నిహితులు ఆపేశారు. కట్ చేస్తే ది ఫ్యామిలీ స్టార్ వచ్చేసింది. యావరేజ్ అనిపించుకున్నా పండగ సెలవుల వల్ల హిట్ వైపు వెళ్లే అవకాశం దక్కేది. కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ అలా లేవు. సో నాగ చైతన్య, అల్లు అరవింద్ లక్కీగా తప్పించుకున్నది ఇదేనని ఫ్యాన్స్ వైపు వినిపిస్తున్న మాట. ఇవన్నీ నిజాలని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు కానీ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న రకరకాల చర్చలను విశ్లేషిస్తే తేలే మ్యాటర్ ఇదే. దీని సంగతేమో కానీ చైతు, అరవింద్ మాత్రం తండేల్ కోసం చేతులు కలిపి బాగా కష్టపడుతున్నారు.
This post was last modified on April 6, 2024 6:16 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…