Movie News

చైతు అరవింద్ ప్రస్తావన సబబేనా

అసలు సందర్భమే లేకుండా నాగ చైతన్య, అల్లు అరవింద్ సోషల్ మీడియాలో టాపిక్ గా మారడానికి ది ఫ్యామిలీ స్టార్ కారణం కావడం అనూహ్యమనే చెప్పాలి. సినిమా ఫలితం ఎటు వెళ్తోందో తెలిశాక అత్యంత అదృష్టవంతులు వీళ్ళేనంటూ అభిమానులు రకరకాల మీమ్స్, వీడియోలు ఎడిట్ చేసి పెట్టడం నిన్నటి నుంచే జరుగుతోంది. దీనికి కారణాలు అధిక శాతం జనాలకు తెలిసినప్పటికీ కొన్ని లోతైన కోణాలు చూద్దాం. సర్కారు వారి పాట కన్నా ముందు దర్శకుడు పరశురామ్ చైతుకి ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ పనులు మెల్లగా మొదలు పెట్టారు .

ఈలోగా మహేష్ బాబు కాల్ రావడంతో నాగచైతన్యది పెండింగ్ పెట్టక తప్పని పరిస్థితుల్లో పరశురామ్ అటు వెళ్ళిపోయాడు. ఇంతా చేసి బ్లాక్ బస్టర్ అందుకోలేకపోవడం వేరే సంగతి. అల్లు అరవింద్ కు ఒక కమిట్ మెంట్ ఇచ్చిన ఇదే పరశురామ్ దాన్ని విజయ్ దేవరకొండ కాంబోలోనే చేయాల్సి ఉందని గట్టి ప్రచారమే జరిగింది. ఈలోగా అనూహ్య పరిణామాలు జరిగి నిర్మాత దిల్ రాజు పేరు మీద ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పటికే అరవింద్ అడ్వాన్స్ పరశురామ్ దగ్గర ఉందని వినికిడి. దీంతో ఆయన హర్ట్ కావడం, సీరియస్ గా ప్రెస్ మీట్ పెట్టాలనుకోవడం వాస్తవమే.

వ్యవహారం రచ్చకెక్కుతోందని అంతదాకా వెళ్లకుండా సన్నిహితులు ఆపేశారు. కట్ చేస్తే ది ఫ్యామిలీ స్టార్ వచ్చేసింది. యావరేజ్ అనిపించుకున్నా పండగ సెలవుల వల్ల హిట్ వైపు వెళ్లే అవకాశం దక్కేది. కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ అలా లేవు. సో నాగ చైతన్య, అల్లు అరవింద్ లక్కీగా తప్పించుకున్నది ఇదేనని ఫ్యాన్స్ వైపు వినిపిస్తున్న మాట. ఇవన్నీ నిజాలని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు కానీ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న రకరకాల చర్చలను విశ్లేషిస్తే తేలే మ్యాటర్ ఇదే. దీని సంగతేమో కానీ చైతు, అరవింద్ మాత్రం తండేల్ కోసం చేతులు కలిపి బాగా కష్టపడుతున్నారు.

This post was last modified on April 6, 2024 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

43 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago