Trends

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించిన భారత్, కివీస్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇషాన్ కిషన్ కేవలం 43 బంతుల్లోనే 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి సెంచరీతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 63 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 42 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అభిషేక్ శర్మ (30), సంజు శామ్సన్ (6) పరుగులు చేయగా, చివర్లో శివం దూబే సిక్సర్‌తో ముగించాడు.

272 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు చేసి భారత్‌ను భయపెట్టాడు. అతనికి తోడుగా రచిన్ రవీంద్ర (30) రాణించినా విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. చివర్లో సోధి (33)తో కాస్త మెరిశాడు. కానీ అప్పటికే కివీస్ నుంచి మ్యాచ్ చేజారింది.

కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం న్యూజిలాండ్ కొంపముంచింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 51 పరుగులిచ్చి 5 వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి మరియు రింకూ సింగ్ తలా ఒక వికెట్ సాధించారు.

ముఖ్యంగా 19.4వ ఓవర్‌లో రింకూ సింగ్ ఇష్ సోధిని అవుట్ చేసి మ్యాచ్‌ను ముగించడంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయంతో టీమిండియా 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుని, రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు తాము సిద్ధమని ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపింది. ఇషాన్ కిషన్ సెంచరీతో ఫామ్‌లోకి రావడం, అర్ష్‌దీప్ సింగ్ వికెట్ల వేట సాగించడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

This post was last modified on January 31, 2026 11:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Team India

Recent Posts

వెంకటేష్ బాకీ తమన్ తీర్చాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…

1 hour ago

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

4 hours ago

“తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా”

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…

4 hours ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

4 hours ago

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక…

6 hours ago

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా,…

8 hours ago