గోపీసుందర్.. తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న మలయాళ మ్యూజిక్ డైరెక్టర్. నిన్ను కోరి, మజిలీ, గీత గోవిందం లాంటి చిత్రాల్లో గోపీసుందర్ పాటలను అంత సులువుగా మరిచిపోలేం. హృద్యమైన ప్రేమకథలకు వీనుల విందైన పాటలు అందించడంలో తన ప్రత్యేకతే వేరు. మలయాళంలో కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసినా.. తెలుగు సినిమాల్లో ఉండే రీచ్ వల్ల తనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తన సినిమాల్లో పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా మంచి ఫీల్తో సాగుతుంది.
ఐతే కొత్త తరహా పాటలు, నేపథ్య సంగీతం ఇస్తాడని పేరున్న గోపీసుందర్.. ‘ఫ్యామిలీ స్టార్’ విషయంలో మాత్రం ఎన్నడూ లేనంత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాటల విషయంలో మొదలైన నెగెటివిటీ.. సినిమాలో నేపథ్య సంగీతం విన్నాక ఇంకా పెరిగిపోయింది.
‘ఫ్యామిలీ స్టార్’లో కళ్యాణి వచ్చా వచ్చా, మధురము కదా పాటలు వినసొంపుగా ఉన్నప్పటికీ.. వాటికి కాపీ మరకలు అంటాయి. ‘ఒక్కడు’ సినిమాలోని ‘అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా..’ పాట ట్యూన్కు చాలా దగ్గరగా ‘కళ్యాణి’ పాట అనిపిస్తే.. మధురము కదా అంటూ సాగే మరో పాట ‘దిల్ సే’ మూవీలోని ‘జియా చలే’ సాంగ్కు కాపీలా అనిపించింది. దీంతో అతను ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇప్పుడు సినిమాను థియేటర్లలో చూసిన వాళ్లందరూ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గోపీని తిట్టిపోస్తున్నారు. సన్నివేశాలతో సంబంధం లేకుండా నాన్ సింక్లో సాగిన బీజీఎం ప్రేక్షకులకు పిచ్చెక్కించేసింది. రవిబాబుతో ఫైట్ సీన్లో అయితే సంస్కృత శ్లోకాలతో నడిచే బీజీఎం అయితే భరించలేని విధంగా తయారైంది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఎక్కడా కూడా బీజీఎం సింక్లో సాగలేదు. మిగతా సినిమాలో కూడా చాలా చోట్ల స్కోర్ తేడా కొట్టింది. దీంతో గోపీసుందర్ లాంటి మంచి సంగీత దర్శకుడికి ఏమైందని సంగీత ప్రియులు చర్చించుకుంటున్నారు.
This post was last modified on April 6, 2024 10:46 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…