విజయ్ దేవరకొండ గతంలో ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో తెలిసిందే. మీడియా ఇంటర్వ్యూల్లో తన సినిమాల గురించి ఒక రేంజిలో మాట్లాడేవాడు. ముఖ్యంగా ‘లైగర్’ మూవీ గురించి విజయ్ మాటలు కోటలు దాటిపోయాయి. ఈ సినిమా కలెక్షన్ విషయంలో తన కౌంట్ రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని విజయ్ అన్న మాటలు.. రిలీజ్ తర్వాత ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయాయి.
గతంలోనూ కొన్ని డిజాస్టర్ మూవీస్ గురించి విజయ్ గొప్పలు పోవడం.. తర్వాత అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించడం జరిగాయి. అప్పుడు నెటిజన్లు కొంచెం లైట్ తీసుకున్నారు కానీ.. లైగర్ టైంలో మాత్రం ట్రోలింగ్ ఒక రేంజిలో జరిగింది. ఆ ప్రభావం విజయ్ మీద కూడా గట్టిగానే పడినట్లుంది. ‘లైగర్’ ఫలితం తర్వాత ఇకపై రిలీజ్ ముంగిట తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించాడు.
‘లైగర్కు ముందు, తర్వాత నా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నా. విడుదలకు ముందే సినిమా ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. ఆ రోజు నుంచి అదే ఫాలో అవుతున్నా. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష’ అని విజయ్ వెల్లడించాడు.
ఇక తన కొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ గురించి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్కు కూడా బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ చెప్పాడు. ఈ సినిమా కథ వినగానే తనకు తన తండ్రే గుర్తుకొచ్చాడని.. తమ కుటుంబంలో ఆయన స్టార్ అని.. కుటుంబ బాధ్యతను మీద వేసుకుని కష్టపడే వాళ్ల గురించే ఈ సినిమా అని విజయ్ చెప్పాడు. కథ వినగానే తన తండ్రి గుర్తుకు రావడం వల్లే తనే అడిగి మరీ ఈ సినిమాలో లీడ్ రోల్కు తన తండ్రి పేరు పెట్టించినట్లు విజయ్ వెల్లడించాడు.
This post was last modified on April 2, 2024 3:27 pm
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…