విజయ్ దేవరకొండ గతంలో ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో తెలిసిందే. మీడియా ఇంటర్వ్యూల్లో తన సినిమాల గురించి ఒక రేంజిలో మాట్లాడేవాడు. ముఖ్యంగా ‘లైగర్’ మూవీ గురించి విజయ్ మాటలు కోటలు దాటిపోయాయి. ఈ సినిమా కలెక్షన్ విషయంలో తన కౌంట్ రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని విజయ్ అన్న మాటలు.. రిలీజ్ తర్వాత ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయాయి.
గతంలోనూ కొన్ని డిజాస్టర్ మూవీస్ గురించి విజయ్ గొప్పలు పోవడం.. తర్వాత అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించడం జరిగాయి. అప్పుడు నెటిజన్లు కొంచెం లైట్ తీసుకున్నారు కానీ.. లైగర్ టైంలో మాత్రం ట్రోలింగ్ ఒక రేంజిలో జరిగింది. ఆ ప్రభావం విజయ్ మీద కూడా గట్టిగానే పడినట్లుంది. ‘లైగర్’ ఫలితం తర్వాత ఇకపై రిలీజ్ ముంగిట తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించాడు.
‘లైగర్కు ముందు, తర్వాత నా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నా. విడుదలకు ముందే సినిమా ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. ఆ రోజు నుంచి అదే ఫాలో అవుతున్నా. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష’ అని విజయ్ వెల్లడించాడు.
ఇక తన కొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ గురించి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్కు కూడా బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ చెప్పాడు. ఈ సినిమా కథ వినగానే తనకు తన తండ్రే గుర్తుకొచ్చాడని.. తమ కుటుంబంలో ఆయన స్టార్ అని.. కుటుంబ బాధ్యతను మీద వేసుకుని కష్టపడే వాళ్ల గురించే ఈ సినిమా అని విజయ్ చెప్పాడు. కథ వినగానే తన తండ్రి గుర్తుకు రావడం వల్లే తనే అడిగి మరీ ఈ సినిమాలో లీడ్ రోల్కు తన తండ్రి పేరు పెట్టించినట్లు విజయ్ వెల్లడించాడు.
This post was last modified on April 2, 2024 3:27 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…