విజయ్ దేవరకొండ గతంలో ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో తెలిసిందే. మీడియా ఇంటర్వ్యూల్లో తన సినిమాల గురించి ఒక రేంజిలో మాట్లాడేవాడు. ముఖ్యంగా ‘లైగర్’ మూవీ గురించి విజయ్ మాటలు కోటలు దాటిపోయాయి. ఈ సినిమా కలెక్షన్ విషయంలో తన కౌంట్ రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని విజయ్ అన్న మాటలు.. రిలీజ్ తర్వాత ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయాయి.
గతంలోనూ కొన్ని డిజాస్టర్ మూవీస్ గురించి విజయ్ గొప్పలు పోవడం.. తర్వాత అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించడం జరిగాయి. అప్పుడు నెటిజన్లు కొంచెం లైట్ తీసుకున్నారు కానీ.. లైగర్ టైంలో మాత్రం ట్రోలింగ్ ఒక రేంజిలో జరిగింది. ఆ ప్రభావం విజయ్ మీద కూడా గట్టిగానే పడినట్లుంది. ‘లైగర్’ ఫలితం తర్వాత ఇకపై రిలీజ్ ముంగిట తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించాడు.
‘లైగర్కు ముందు, తర్వాత నా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నా. విడుదలకు ముందే సినిమా ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. ఆ రోజు నుంచి అదే ఫాలో అవుతున్నా. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష’ అని విజయ్ వెల్లడించాడు.
ఇక తన కొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ గురించి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్కు కూడా బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ చెప్పాడు. ఈ సినిమా కథ వినగానే తనకు తన తండ్రే గుర్తుకొచ్చాడని.. తమ కుటుంబంలో ఆయన స్టార్ అని.. కుటుంబ బాధ్యతను మీద వేసుకుని కష్టపడే వాళ్ల గురించే ఈ సినిమా అని విజయ్ చెప్పాడు. కథ వినగానే తన తండ్రి గుర్తుకు రావడం వల్లే తనే అడిగి మరీ ఈ సినిమాలో లీడ్ రోల్కు తన తండ్రి పేరు పెట్టించినట్లు విజయ్ వెల్లడించాడు.
This post was last modified on April 2, 2024 3:27 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…