విజయ్ దేవరకొండ గతంలో ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో తెలిసిందే. మీడియా ఇంటర్వ్యూల్లో తన సినిమాల గురించి ఒక రేంజిలో మాట్లాడేవాడు. ముఖ్యంగా ‘లైగర్’ మూవీ గురించి విజయ్ మాటలు కోటలు దాటిపోయాయి. ఈ సినిమా కలెక్షన్ విషయంలో తన కౌంట్ రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందని విజయ్ అన్న మాటలు.. రిలీజ్ తర్వాత ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయాయి.
గతంలోనూ కొన్ని డిజాస్టర్ మూవీస్ గురించి విజయ్ గొప్పలు పోవడం.. తర్వాత అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించడం జరిగాయి. అప్పుడు నెటిజన్లు కొంచెం లైట్ తీసుకున్నారు కానీ.. లైగర్ టైంలో మాత్రం ట్రోలింగ్ ఒక రేంజిలో జరిగింది. ఆ ప్రభావం విజయ్ మీద కూడా గట్టిగానే పడినట్లుంది. ‘లైగర్’ ఫలితం తర్వాత ఇకపై రిలీజ్ ముంగిట తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించాడు.
‘లైగర్కు ముందు, తర్వాత నా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నా. విడుదలకు ముందే సినిమా ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. ఆ రోజు నుంచి అదే ఫాలో అవుతున్నా. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష’ అని విజయ్ వెల్లడించాడు.
ఇక తన కొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ గురించి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్కు కూడా బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ చెప్పాడు. ఈ సినిమా కథ వినగానే తనకు తన తండ్రే గుర్తుకొచ్చాడని.. తమ కుటుంబంలో ఆయన స్టార్ అని.. కుటుంబ బాధ్యతను మీద వేసుకుని కష్టపడే వాళ్ల గురించే ఈ సినిమా అని విజయ్ చెప్పాడు. కథ వినగానే తన తండ్రి గుర్తుకు రావడం వల్లే తనే అడిగి మరీ ఈ సినిమాలో లీడ్ రోల్కు తన తండ్రి పేరు పెట్టించినట్లు విజయ్ వెల్లడించాడు.
This post was last modified on April 2, 2024 3:27 pm
సినిమాల్లో పాత్రలను కొంతమంది నిజ జీవితంలో కూడా ఎంతో ఓన్ చేసుకుంటారు. తెరపై వారికి అన్యాయం జరిగితే నిజంగానే వారికేదో నష్టం…
పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై…
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…
రేపు విడుదల కాబోతున్న పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే…
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే డీలిమిటేషన్, అదేసమయంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే 2023నాటి నారీ…