మెగా కుర్రాడు వరుణ్ తేజ్కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి విజయాలతో ఒకప్పుడు మంచి ఊపు మీద కనించాడతను. కానీ గత రెండేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఉన్నంతలో ‘ఎఫ్-3’ కొంచెం బెటర్.
సోలో హీరోగా చేసిన గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఒక్కసారిగా కరిగిపోయిన భావన కలుగుతోంది. తన కొత్త చిత్రాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేస్తున్న సమయంలోనే వరుణ్ ‘మట్కా’ పేరుతో ఓ భారీ చిత్రం చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆది నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.
డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తింటున్న సమయంలో ఈ సినిమా ఓకే అయింది. బడ్జెట్ దాదాపు 60 కోట్లు అనుకున్నారు. ఐతే డిజిటల్ హక్కుల ధరలు బాగా తగ్గిపోవడంతో 20 కోట్లు తగ్గించి 40 కోట్లలో తీయాలనుకున్నారు. ఈలోపు వరుణ్కు రెండు డిజాస్టర్లు పడ్డాయి. దీంతో 40 కోట్లతో కూడా సినిమా వర్కవుట్ అవుతుందా అన్న సందేహాలు కలిగాయి. ఇంతలో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన వైరా ఎంటర్టైన్మెంట్స్లో ఒక భాగస్వామి దూరం అయ్యారు. మోహన్ చెరుకూరి ఒక్కరే మిగిలారు. ఆయన ఒక్కరే ఇంత రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన మరో భాగస్వామి కోసం చూస్తున్నారు.
వరుణ్ మార్కెట్ దెబ్బ తినడం, దర్శకుడు కరుణ్ కుమార్ కమర్షియల్గా వర్కవుటయ్యే సినిమా తీయగలడా అనే విషయంలో సందేహాలుండడం, నిర్మాణ పరంగా ఉన్న ఇబ్బందులు.. ఇవన్నీ కలిసి ‘మట్కా’ మీద నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. మరి ఈ అడ్డంకులన్నీ దాటి సినిమా ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
This post was last modified on April 1, 2024 5:43 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…