మెగా కుర్రాడు వరుణ్ తేజ్కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి విజయాలతో ఒకప్పుడు మంచి ఊపు మీద కనించాడతను. కానీ గత రెండేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఉన్నంతలో ‘ఎఫ్-3’ కొంచెం బెటర్.
సోలో హీరోగా చేసిన గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఒక్కసారిగా కరిగిపోయిన భావన కలుగుతోంది. తన కొత్త చిత్రాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేస్తున్న సమయంలోనే వరుణ్ ‘మట్కా’ పేరుతో ఓ భారీ చిత్రం చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆది నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.
డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తింటున్న సమయంలో ఈ సినిమా ఓకే అయింది. బడ్జెట్ దాదాపు 60 కోట్లు అనుకున్నారు. ఐతే డిజిటల్ హక్కుల ధరలు బాగా తగ్గిపోవడంతో 20 కోట్లు తగ్గించి 40 కోట్లలో తీయాలనుకున్నారు. ఈలోపు వరుణ్కు రెండు డిజాస్టర్లు పడ్డాయి. దీంతో 40 కోట్లతో కూడా సినిమా వర్కవుట్ అవుతుందా అన్న సందేహాలు కలిగాయి. ఇంతలో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన వైరా ఎంటర్టైన్మెంట్స్లో ఒక భాగస్వామి దూరం అయ్యారు. మోహన్ చెరుకూరి ఒక్కరే మిగిలారు. ఆయన ఒక్కరే ఇంత రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన మరో భాగస్వామి కోసం చూస్తున్నారు.
వరుణ్ మార్కెట్ దెబ్బ తినడం, దర్శకుడు కరుణ్ కుమార్ కమర్షియల్గా వర్కవుటయ్యే సినిమా తీయగలడా అనే విషయంలో సందేహాలుండడం, నిర్మాణ పరంగా ఉన్న ఇబ్బందులు.. ఇవన్నీ కలిసి ‘మట్కా’ మీద నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. మరి ఈ అడ్డంకులన్నీ దాటి సినిమా ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
This post was last modified on April 1, 2024 5:43 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…