మెగా కుర్రాడు వరుణ్ తేజ్కు ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి విజయాలతో ఒకప్పుడు మంచి ఊపు మీద కనించాడతను. కానీ గత రెండేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఉన్నంతలో ‘ఎఫ్-3’ కొంచెం బెటర్.
సోలో హీరోగా చేసిన గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఒక్కసారిగా కరిగిపోయిన భావన కలుగుతోంది. తన కొత్త చిత్రాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ చేస్తున్న సమయంలోనే వరుణ్ ‘మట్కా’ పేరుతో ఓ భారీ చిత్రం చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆది నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది.
డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తింటున్న సమయంలో ఈ సినిమా ఓకే అయింది. బడ్జెట్ దాదాపు 60 కోట్లు అనుకున్నారు. ఐతే డిజిటల్ హక్కుల ధరలు బాగా తగ్గిపోవడంతో 20 కోట్లు తగ్గించి 40 కోట్లలో తీయాలనుకున్నారు. ఈలోపు వరుణ్కు రెండు డిజాస్టర్లు పడ్డాయి. దీంతో 40 కోట్లతో కూడా సినిమా వర్కవుట్ అవుతుందా అన్న సందేహాలు కలిగాయి. ఇంతలో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సిన వైరా ఎంటర్టైన్మెంట్స్లో ఒక భాగస్వామి దూరం అయ్యారు. మోహన్ చెరుకూరి ఒక్కరే మిగిలారు. ఆయన ఒక్కరే ఇంత రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన మరో భాగస్వామి కోసం చూస్తున్నారు.
వరుణ్ మార్కెట్ దెబ్బ తినడం, దర్శకుడు కరుణ్ కుమార్ కమర్షియల్గా వర్కవుటయ్యే సినిమా తీయగలడా అనే విషయంలో సందేహాలుండడం, నిర్మాణ పరంగా ఉన్న ఇబ్బందులు.. ఇవన్నీ కలిసి ‘మట్కా’ మీద నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. మరి ఈ అడ్డంకులన్నీ దాటి సినిమా ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
This post was last modified on April 1, 2024 5:43 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…