‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ ముంగిట తీరిక లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఐతే ఓ ఇంటర్వ్యూలో కొత్త దర్శకులతో పని చేయనంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ వివాదాస్పదం అయింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది కొత్త దర్శకుడైన తరుణ్ భాస్కర్. ఆపై ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ కెరీర్ను గొప్ప మలుపు తిప్పింది కూడా డెబ్యూ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ. మరో కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా ‘ట్యాక్సీవాలా’తో విజయ్కి మంచి విజయాన్నందించాడు.
అలాంటిది ఇప్పుడు తాను కొత్త దర్శకులతో పని చేయనని.. వాళ్లు బడ్జెట్, ఇతర విషయాలను హ్యాండిల్ చేయలేరని.. ఒక్క సినిమాకైనా పని చేసి ఉండాలని విజయ్ చెప్పడం లాజికల్గా అనిపించలేదు. అందులోనూ పూరి జగన్నాథ్ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడితో ‘లైగర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చాక విజయ్ ఈ మాట అనడం మరింత విడ్డూరంగా అనిపించింది. దీంతో విజయ్ వ్యాఖ్యల మీద నిన్నట్నుంచి ట్రోలింగ్ నడుస్తోంది.
తాజాగా మీడియాను కలిసిన సందర్భంగా మరోసారి దీని గురించి చర్చ జరిగింది. కొత్త దర్శకులతో పని చేయరని ఎందుకన్నారు అంటూ మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ.. ‘‘కొత్త దర్శకులను నేను బ్లాక్ చేస్తే కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇస్తారు? తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి లాంటి వాళ్లు నాలాంటి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి పెద్ద స్థాయికి వెళ్లారు. అలాగే కొత్త దర్శకులు కూడా పేరున్న హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో సినిమాలు తీయాలి. కొత్త నటులకు బ్రేక్ ఇవ్వాలి. అలాంటి వాళ్లను నేను బ్లాక్ చేస్తే కొత్త నటులకు ఇంకెవరు అవకాశమిస్తారు’’ అని ప్రశ్నించాడు. కానీ కొత్త దర్శకులందరూ కొత్త వాళ్లతో.. స్టార్ డైరెక్టర్లు స్టార్ నటులతో చేస్తుంటే ఎలా వర్కవుట్ అవుతుంది.. అప్పుడు చిన్న నటులతో పెద్ద డైరెక్టర్లు.. కొత్త దర్శకులతో స్టార్ నటులు సినిమాలే చేయకూడదా.. ఇదేం లాజిక్ అంటూ విజయ్పై మరో రౌండ్ ట్రోలింగ్ నడుస్తోంది.
This post was last modified on April 1, 2024 5:43 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…