‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ ముంగిట తీరిక లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఐతే ఓ ఇంటర్వ్యూలో కొత్త దర్శకులతో పని చేయనంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ వివాదాస్పదం అయింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది కొత్త దర్శకుడైన తరుణ్ భాస్కర్. ఆపై ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ కెరీర్ను గొప్ప మలుపు తిప్పింది కూడా డెబ్యూ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ. మరో కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా ‘ట్యాక్సీవాలా’తో విజయ్కి మంచి విజయాన్నందించాడు.
అలాంటిది ఇప్పుడు తాను కొత్త దర్శకులతో పని చేయనని.. వాళ్లు బడ్జెట్, ఇతర విషయాలను హ్యాండిల్ చేయలేరని.. ఒక్క సినిమాకైనా పని చేసి ఉండాలని విజయ్ చెప్పడం లాజికల్గా అనిపించలేదు. అందులోనూ పూరి జగన్నాథ్ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడితో ‘లైగర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చాక విజయ్ ఈ మాట అనడం మరింత విడ్డూరంగా అనిపించింది. దీంతో విజయ్ వ్యాఖ్యల మీద నిన్నట్నుంచి ట్రోలింగ్ నడుస్తోంది.
తాజాగా మీడియాను కలిసిన సందర్భంగా మరోసారి దీని గురించి చర్చ జరిగింది. కొత్త దర్శకులతో పని చేయరని ఎందుకన్నారు అంటూ మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ.. ‘‘కొత్త దర్శకులను నేను బ్లాక్ చేస్తే కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇస్తారు? తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి లాంటి వాళ్లు నాలాంటి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి పెద్ద స్థాయికి వెళ్లారు. అలాగే కొత్త దర్శకులు కూడా పేరున్న హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో సినిమాలు తీయాలి. కొత్త నటులకు బ్రేక్ ఇవ్వాలి. అలాంటి వాళ్లను నేను బ్లాక్ చేస్తే కొత్త నటులకు ఇంకెవరు అవకాశమిస్తారు’’ అని ప్రశ్నించాడు. కానీ కొత్త దర్శకులందరూ కొత్త వాళ్లతో.. స్టార్ డైరెక్టర్లు స్టార్ నటులతో చేస్తుంటే ఎలా వర్కవుట్ అవుతుంది.. అప్పుడు చిన్న నటులతో పెద్ద డైరెక్టర్లు.. కొత్త దర్శకులతో స్టార్ నటులు సినిమాలే చేయకూడదా.. ఇదేం లాజిక్ అంటూ విజయ్పై మరో రౌండ్ ట్రోలింగ్ నడుస్తోంది.
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…
మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…
ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు…
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…