‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ ముంగిట తీరిక లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఐతే ఓ ఇంటర్వ్యూలో కొత్త దర్శకులతో పని చేయనంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ వివాదాస్పదం అయింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది కొత్త దర్శకుడైన తరుణ్ భాస్కర్. ఆపై ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ కెరీర్ను గొప్ప మలుపు తిప్పింది కూడా డెబ్యూ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ. మరో కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కూడా ‘ట్యాక్సీవాలా’తో విజయ్కి మంచి విజయాన్నందించాడు.
అలాంటిది ఇప్పుడు తాను కొత్త దర్శకులతో పని చేయనని.. వాళ్లు బడ్జెట్, ఇతర విషయాలను హ్యాండిల్ చేయలేరని.. ఒక్క సినిమాకైనా పని చేసి ఉండాలని విజయ్ చెప్పడం లాజికల్గా అనిపించలేదు. అందులోనూ పూరి జగన్నాథ్ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడితో ‘లైగర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చాక విజయ్ ఈ మాట అనడం మరింత విడ్డూరంగా అనిపించింది. దీంతో విజయ్ వ్యాఖ్యల మీద నిన్నట్నుంచి ట్రోలింగ్ నడుస్తోంది.
తాజాగా మీడియాను కలిసిన సందర్భంగా మరోసారి దీని గురించి చర్చ జరిగింది. కొత్త దర్శకులతో పని చేయరని ఎందుకన్నారు అంటూ మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ.. ‘‘కొత్త దర్శకులను నేను బ్లాక్ చేస్తే కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇస్తారు? తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి లాంటి వాళ్లు నాలాంటి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి పెద్ద స్థాయికి వెళ్లారు. అలాగే కొత్త దర్శకులు కూడా పేరున్న హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో సినిమాలు తీయాలి. కొత్త నటులకు బ్రేక్ ఇవ్వాలి. అలాంటి వాళ్లను నేను బ్లాక్ చేస్తే కొత్త నటులకు ఇంకెవరు అవకాశమిస్తారు’’ అని ప్రశ్నించాడు. కానీ కొత్త దర్శకులందరూ కొత్త వాళ్లతో.. స్టార్ డైరెక్టర్లు స్టార్ నటులతో చేస్తుంటే ఎలా వర్కవుట్ అవుతుంది.. అప్పుడు చిన్న నటులతో పెద్ద డైరెక్టర్లు.. కొత్త దర్శకులతో స్టార్ నటులు సినిమాలే చేయకూడదా.. ఇదేం లాజిక్ అంటూ విజయ్పై మరో రౌండ్ ట్రోలింగ్ నడుస్తోంది.
This post was last modified on April 1, 2024 5:43 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…