బిగ్ బాస్ గత మూడు సీజన్లలో జరగనిది ఈసారి జరిగింది. మొదటి వారంలో హౌస్నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లు లేడీసే అయ్యేవాళ్లు. మొదటి సీజన్లో జ్యోతి, రెండవ సీజన్లో సంజన, మూడవ సీజన్లో హేమ ముందుగా ఎలిమినేట్ కాగా నాలుగవ సీజన్ ఆ ఆనవాయితీకి బ్రేక్ వేసి ఒక పురుష కంటెస్టెంట్ని బయటకు పంపారు. అసలే లేడీస్ డామినేషన్ ఎక్కువగా వున్న ఈ సీజన్లో మరీ మగాళ్లు తగ్గిపోకుండా వెంటనే కమెడియన్ కుమార్ సాయిని ఇంట్లోకి పంపించేసారనుకోండి. లాస్ట్ త్రీ సీజన్స్లో ఆడవాళ్లు ముందుగా ఎలిమినేట్ అయి, ఫైనల్గా మగాళ్లే బిగ్బాస్ టైటిల్ గెలుచుకున్నారు.
శివబాలాజీ, కౌశల్, రాహుల్… ఇలా ఎప్పుడూ మగాళ్లకే పట్టం కడుతూ వచ్చారు. ఈసారి మొదటి వారం సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతుందనే నమ్మకం బలపడింది. నిజంగానే ఈసారి దేవి, దివి లాంటి కంటెస్టెంట్స్ టఫ్గా కనిపిస్తున్నారు. అయితే ముందుకెళ్లే కొద్దీ వీళ్లు ఎలా తట్టుకుని నిలబడతారనేది చూడాలి. ఎందుకంటే మగాళ్లలో నోయల్, అభిజీత్, సోహైల్ టైటిల్ గెలవగల సమర్ధులలానే అనిపిస్తున్నారు.
మొదటి వారంలో ఫాన్ ఫాలోయింగ్ పరంగా దివి లీడింగ్లో వుంటే, హౌస్మేట్స్ మెప్పు పొందే విషయంలో టీవీ 9 న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి మార్కులన్నీ కొట్టేసింది. ఆమె గురించి అరియానా, సూర్యకిరణ్ చెప్పిన మంచి మాటలతో సోషల్ మీడియా కూడా ఏకీభవిస్తోంది.
This post was last modified on September 14, 2020 8:40 pm
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…