బిగ్ బాస్ గత మూడు సీజన్లలో జరగనిది ఈసారి జరిగింది. మొదటి వారంలో హౌస్నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లు లేడీసే అయ్యేవాళ్లు. మొదటి సీజన్లో జ్యోతి, రెండవ సీజన్లో సంజన, మూడవ సీజన్లో హేమ ముందుగా ఎలిమినేట్ కాగా నాలుగవ సీజన్ ఆ ఆనవాయితీకి బ్రేక్ వేసి ఒక పురుష కంటెస్టెంట్ని బయటకు పంపారు. అసలే లేడీస్ డామినేషన్ ఎక్కువగా వున్న ఈ సీజన్లో మరీ మగాళ్లు తగ్గిపోకుండా వెంటనే కమెడియన్ కుమార్ సాయిని ఇంట్లోకి పంపించేసారనుకోండి. లాస్ట్ త్రీ సీజన్స్లో ఆడవాళ్లు ముందుగా ఎలిమినేట్ అయి, ఫైనల్గా మగాళ్లే బిగ్బాస్ టైటిల్ గెలుచుకున్నారు.
శివబాలాజీ, కౌశల్, రాహుల్… ఇలా ఎప్పుడూ మగాళ్లకే పట్టం కడుతూ వచ్చారు. ఈసారి మొదటి వారం సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతుందనే నమ్మకం బలపడింది. నిజంగానే ఈసారి దేవి, దివి లాంటి కంటెస్టెంట్స్ టఫ్గా కనిపిస్తున్నారు. అయితే ముందుకెళ్లే కొద్దీ వీళ్లు ఎలా తట్టుకుని నిలబడతారనేది చూడాలి. ఎందుకంటే మగాళ్లలో నోయల్, అభిజీత్, సోహైల్ టైటిల్ గెలవగల సమర్ధులలానే అనిపిస్తున్నారు.
మొదటి వారంలో ఫాన్ ఫాలోయింగ్ పరంగా దివి లీడింగ్లో వుంటే, హౌస్మేట్స్ మెప్పు పొందే విషయంలో టీవీ 9 న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి మార్కులన్నీ కొట్టేసింది. ఆమె గురించి అరియానా, సూర్యకిరణ్ చెప్పిన మంచి మాటలతో సోషల్ మీడియా కూడా ఏకీభవిస్తోంది.
This post was last modified on September 14, 2020 8:40 pm
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…
రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…
ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…