బిగ్ బాస్ గత మూడు సీజన్లలో జరగనిది ఈసారి జరిగింది. మొదటి వారంలో హౌస్నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లు లేడీసే అయ్యేవాళ్లు. మొదటి సీజన్లో జ్యోతి, రెండవ సీజన్లో సంజన, మూడవ సీజన్లో హేమ ముందుగా ఎలిమినేట్ కాగా నాలుగవ సీజన్ ఆ ఆనవాయితీకి బ్రేక్ వేసి ఒక పురుష కంటెస్టెంట్ని బయటకు పంపారు. అసలే లేడీస్ డామినేషన్ ఎక్కువగా వున్న ఈ సీజన్లో మరీ మగాళ్లు తగ్గిపోకుండా వెంటనే కమెడియన్ కుమార్ సాయిని ఇంట్లోకి పంపించేసారనుకోండి. లాస్ట్ త్రీ సీజన్స్లో ఆడవాళ్లు ముందుగా ఎలిమినేట్ అయి, ఫైనల్గా మగాళ్లే బిగ్బాస్ టైటిల్ గెలుచుకున్నారు.
శివబాలాజీ, కౌశల్, రాహుల్… ఇలా ఎప్పుడూ మగాళ్లకే పట్టం కడుతూ వచ్చారు. ఈసారి మొదటి వారం సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతుందనే నమ్మకం బలపడింది. నిజంగానే ఈసారి దేవి, దివి లాంటి కంటెస్టెంట్స్ టఫ్గా కనిపిస్తున్నారు. అయితే ముందుకెళ్లే కొద్దీ వీళ్లు ఎలా తట్టుకుని నిలబడతారనేది చూడాలి. ఎందుకంటే మగాళ్లలో నోయల్, అభిజీత్, సోహైల్ టైటిల్ గెలవగల సమర్ధులలానే అనిపిస్తున్నారు.
మొదటి వారంలో ఫాన్ ఫాలోయింగ్ పరంగా దివి లీడింగ్లో వుంటే, హౌస్మేట్స్ మెప్పు పొందే విషయంలో టీవీ 9 న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి మార్కులన్నీ కొట్టేసింది. ఆమె గురించి అరియానా, సూర్యకిరణ్ చెప్పిన మంచి మాటలతో సోషల్ మీడియా కూడా ఏకీభవిస్తోంది.
This post was last modified on September 14, 2020 8:40 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…