బిగ్ బాస్ గత మూడు సీజన్లలో జరగనిది ఈసారి జరిగింది. మొదటి వారంలో హౌస్నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లు లేడీసే అయ్యేవాళ్లు. మొదటి సీజన్లో జ్యోతి, రెండవ సీజన్లో సంజన, మూడవ సీజన్లో హేమ ముందుగా ఎలిమినేట్ కాగా నాలుగవ సీజన్ ఆ ఆనవాయితీకి బ్రేక్ వేసి ఒక పురుష కంటెస్టెంట్ని బయటకు పంపారు. అసలే లేడీస్ డామినేషన్ ఎక్కువగా వున్న ఈ సీజన్లో మరీ మగాళ్లు తగ్గిపోకుండా వెంటనే కమెడియన్ కుమార్ సాయిని ఇంట్లోకి పంపించేసారనుకోండి. లాస్ట్ త్రీ సీజన్స్లో ఆడవాళ్లు ముందుగా ఎలిమినేట్ అయి, ఫైనల్గా మగాళ్లే బిగ్బాస్ టైటిల్ గెలుచుకున్నారు.
శివబాలాజీ, కౌశల్, రాహుల్… ఇలా ఎప్పుడూ మగాళ్లకే పట్టం కడుతూ వచ్చారు. ఈసారి మొదటి వారం సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతుందనే నమ్మకం బలపడింది. నిజంగానే ఈసారి దేవి, దివి లాంటి కంటెస్టెంట్స్ టఫ్గా కనిపిస్తున్నారు. అయితే ముందుకెళ్లే కొద్దీ వీళ్లు ఎలా తట్టుకుని నిలబడతారనేది చూడాలి. ఎందుకంటే మగాళ్లలో నోయల్, అభిజీత్, సోహైల్ టైటిల్ గెలవగల సమర్ధులలానే అనిపిస్తున్నారు.
మొదటి వారంలో ఫాన్ ఫాలోయింగ్ పరంగా దివి లీడింగ్లో వుంటే, హౌస్మేట్స్ మెప్పు పొందే విషయంలో టీవీ 9 న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి మార్కులన్నీ కొట్టేసింది. ఆమె గురించి అరియానా, సూర్యకిరణ్ చెప్పిన మంచి మాటలతో సోషల్ మీడియా కూడా ఏకీభవిస్తోంది.
This post was last modified on September 14, 2020 8:40 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…