సిద్ధు జొన్నలగడ్డ.. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ ఈ యువ కథానాయకుడే. ‘డీజే టిల్లు’తో రెండేళ్ల కిందట సెన్సేషన్ క్రియేట్ చేసి.. ఇప్పుడు దాని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో మరింతగా ప్రకంపనలు రేపుతున్నాడీ యువ కథానాయకుడు. ఎన్నో ఏళ్ల పాటు పడ్డ కష్టానికి అతను ఇప్పుడు ఫలితం అందుకుంటున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల కోసం లైన్లో నిలబడ్డ నటుడతను. ఇప్పుడు అతడి డేట్ల కోసం నిర్మాతలు క్యూలో ఉన్నారు.
ఐతే ‘డీజే టిల్లు’తోనే అవకాశాలు వెల్లువెత్తినా.. ఏది పడితే అది ఓకే చేయలేదు సిద్ధు. ‘బుట్టబొమ్మ’ సహా కొన్ని చిత్రాలకు ఓకే అని మళ్లీ వెనక్కి తగ్గాడు. వచ్చిన ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ను వృథా చేసుకోకుండా తన కెరీర్కు ఉపయోగపడే సినిమాలే చేయాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ‘టిల్లు స్క్వేర్’ మీద ఫోకస్ పెంచి.. ఆ తర్వాత నీరజ కోన, బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలను ఓకే చేశాడు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నాడట సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమా ఏది అన్నది చెప్పలేదు కానీ.. చిరు సినిమాను వదులుకోవాల్సి వచ్చిన విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అందుకు కాారణం వెల్లడిస్తూ.. ‘‘నేను, చిరంజీవి గారు కలిసి ఒక సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మేము ఎప్పుడైనా కలిస్తే ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. చిరంజీవిగారు ఒక సూపర్ హ్యుమన్. తెలుగు ఇండస్ట్రీ అంటే మొదటగా గుర్తుకొచ్చేది ఆయన పేరే. మా చిన్నప్పడు చిరంజీవిగారు, బాలకృష్ణ గారు ఆకాశంలో తారల్లా కనిపించేవారు. అలాంటి తారలతో కలిసి నటించే అవకాశం వస్తే అది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలి. అవుటాఫ్ వరల్డ్ అయ్యుండాలి. నా పిల్లలకు ‘‘నేను చిరంజీవిగారితో పనిచేశాను’’ అని గర్వంగా చెప్పుకోవాలి. అది నా జీవితంలో ఒక మైల్స్టోన్గా మిగిలిపోతుంది. దేవుడి దయ ఉంటే ఏదో ఒక రోజు నాకు ఆ అవకాశం వస్తుంది. ఎవరో ఒక డైరక్టర్ ఒక కథ చెప్పి, అది ఆయనకు నచ్చి, ఆయన అంగీకరించే రోజు వస్తుంది. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా’’ అని సిద్ధు అన్నాడు.
This post was last modified on April 1, 2024 1:54 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…