ఇప్పుడు తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్లో ‘జై హనుమాన్’ ఒకటి. ఈ సంక్రాంతికి ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ‘హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ సినిమా రేంజికి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అన్నది అసామాన్యమైన విషయం.
సూపర్ హీరో అంటే హాలీవుడ్ సినిమాల వైపే చూడాల్సిన పని లేదని.. మన పురాణాల్లోనే హనుమంతుడి లాంటి అద్భుతమైన పాత్రలు ఉన్నాయని.. వాటిని సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని ఈ సినిమా రుజువు చేసింది. ‘హనుమాన్’ చూసిన ప్రతి ఒక్కరూ దీని సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వేరే దర్శకుల్లాగా ఎక్కువ టైం తీసుకోకుండా ‘జై హనుమాన్’ పనులను వెంటనే మొదలుపెట్టేశాడు ప్రశాంత్ వర్మ. స్క్రిప్టు రెడీ చేసి ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ ఉగాదికి ‘జై హనుమాన్’ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ దిశగా ఇప్పటికే హింట్ ఇచ్చిన ప్రశాంత్.. తాజాగా ఒక చిన్న వీడియో షేర్ చేశాడు. దానికి ‘అంజనాద్రి 2.0’ అని క్యాప్షన్ జోడించాడు.
‘హనుమాన్’లో చూపించిన అంజనాద్రి’తో పోలిస్తే ఇది ఇంకా బ్యూటిఫుల్గా, గ్రాండ్గా అనిపిస్తోంది. ‘జై హనుమాన్’ కథ ప్రధానంగా ఇక్కడే సాగబోతోందన్న సంకేతాలు ఇచ్చాడు ప్రశాంత్. పరిమిత బడ్జెట్లోనే అద్భుతమైన ఔట్ పుట్ చూపించిన ప్రశాంత్.. ఈసారి భారీ బడ్జెట్లో మరింత గ్రాండియర్గా విజువల్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.
This post was last modified on April 1, 2024 1:46 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…