ఇప్పుడు తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్లో ‘జై హనుమాన్’ ఒకటి. ఈ సంక్రాంతికి ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ‘హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ సినిమా రేంజికి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అన్నది అసామాన్యమైన విషయం.
సూపర్ హీరో అంటే హాలీవుడ్ సినిమాల వైపే చూడాల్సిన పని లేదని.. మన పురాణాల్లోనే హనుమంతుడి లాంటి అద్భుతమైన పాత్రలు ఉన్నాయని.. వాటిని సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని ఈ సినిమా రుజువు చేసింది. ‘హనుమాన్’ చూసిన ప్రతి ఒక్కరూ దీని సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వేరే దర్శకుల్లాగా ఎక్కువ టైం తీసుకోకుండా ‘జై హనుమాన్’ పనులను వెంటనే మొదలుపెట్టేశాడు ప్రశాంత్ వర్మ. స్క్రిప్టు రెడీ చేసి ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ ఉగాదికి ‘జై హనుమాన్’ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ దిశగా ఇప్పటికే హింట్ ఇచ్చిన ప్రశాంత్.. తాజాగా ఒక చిన్న వీడియో షేర్ చేశాడు. దానికి ‘అంజనాద్రి 2.0’ అని క్యాప్షన్ జోడించాడు.
‘హనుమాన్’లో చూపించిన అంజనాద్రి’తో పోలిస్తే ఇది ఇంకా బ్యూటిఫుల్గా, గ్రాండ్గా అనిపిస్తోంది. ‘జై హనుమాన్’ కథ ప్రధానంగా ఇక్కడే సాగబోతోందన్న సంకేతాలు ఇచ్చాడు ప్రశాంత్. పరిమిత బడ్జెట్లోనే అద్భుతమైన ఔట్ పుట్ చూపించిన ప్రశాంత్.. ఈసారి భారీ బడ్జెట్లో మరింత గ్రాండియర్గా విజువల్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.
This post was last modified on April 1, 2024 1:46 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…