ఇప్పుడు తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్లో ‘జై హనుమాన్’ ఒకటి. ఈ సంక్రాంతికి ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ‘హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ సినిమా రేంజికి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అన్నది అసామాన్యమైన విషయం.
సూపర్ హీరో అంటే హాలీవుడ్ సినిమాల వైపే చూడాల్సిన పని లేదని.. మన పురాణాల్లోనే హనుమంతుడి లాంటి అద్భుతమైన పాత్రలు ఉన్నాయని.. వాటిని సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని ఈ సినిమా రుజువు చేసింది. ‘హనుమాన్’ చూసిన ప్రతి ఒక్కరూ దీని సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వేరే దర్శకుల్లాగా ఎక్కువ టైం తీసుకోకుండా ‘జై హనుమాన్’ పనులను వెంటనే మొదలుపెట్టేశాడు ప్రశాంత్ వర్మ. స్క్రిప్టు రెడీ చేసి ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ ఉగాదికి ‘జై హనుమాన్’ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ దిశగా ఇప్పటికే హింట్ ఇచ్చిన ప్రశాంత్.. తాజాగా ఒక చిన్న వీడియో షేర్ చేశాడు. దానికి ‘అంజనాద్రి 2.0’ అని క్యాప్షన్ జోడించాడు.
‘హనుమాన్’లో చూపించిన అంజనాద్రి’తో పోలిస్తే ఇది ఇంకా బ్యూటిఫుల్గా, గ్రాండ్గా అనిపిస్తోంది. ‘జై హనుమాన్’ కథ ప్రధానంగా ఇక్కడే సాగబోతోందన్న సంకేతాలు ఇచ్చాడు ప్రశాంత్. పరిమిత బడ్జెట్లోనే అద్భుతమైన ఔట్ పుట్ చూపించిన ప్రశాంత్.. ఈసారి భారీ బడ్జెట్లో మరింత గ్రాండియర్గా విజువల్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.
This post was last modified on April 1, 2024 1:46 pm
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…