ఇప్పుడు తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్లో ‘జై హనుమాన్’ ఒకటి. ఈ సంక్రాంతికి ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ‘హనుమాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ సినిమా రేంజికి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అన్నది అసామాన్యమైన విషయం.
సూపర్ హీరో అంటే హాలీవుడ్ సినిమాల వైపే చూడాల్సిన పని లేదని.. మన పురాణాల్లోనే హనుమంతుడి లాంటి అద్భుతమైన పాత్రలు ఉన్నాయని.. వాటిని సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతాయని ఈ సినిమా రుజువు చేసింది. ‘హనుమాన్’ చూసిన ప్రతి ఒక్కరూ దీని సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వేరే దర్శకుల్లాగా ఎక్కువ టైం తీసుకోకుండా ‘జై హనుమాన్’ పనులను వెంటనే మొదలుపెట్టేశాడు ప్రశాంత్ వర్మ. స్క్రిప్టు రెడీ చేసి ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ ఉగాదికి ‘జై హనుమాన్’ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ దిశగా ఇప్పటికే హింట్ ఇచ్చిన ప్రశాంత్.. తాజాగా ఒక చిన్న వీడియో షేర్ చేశాడు. దానికి ‘అంజనాద్రి 2.0’ అని క్యాప్షన్ జోడించాడు.
‘హనుమాన్’లో చూపించిన అంజనాద్రి’తో పోలిస్తే ఇది ఇంకా బ్యూటిఫుల్గా, గ్రాండ్గా అనిపిస్తోంది. ‘జై హనుమాన్’ కథ ప్రధానంగా ఇక్కడే సాగబోతోందన్న సంకేతాలు ఇచ్చాడు ప్రశాంత్. పరిమిత బడ్జెట్లోనే అద్భుతమైన ఔట్ పుట్ చూపించిన ప్రశాంత్.. ఈసారి భారీ బడ్జెట్లో మరింత గ్రాండియర్గా విజువల్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…