Categories: Movie News

పదేళ్ల తర్వాత ఒక లైలా కోసం జోడి ?

మొన్నటిదాకా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే విపరీతంగా నెమ్మదించేసింది. చేతి దాకా వచ్చిన గుంటూరు కారం కొంత షూటింగ్ అయ్యాక మిస్ కాగా, సాయి దుర్గ తేజ్ తో మొదటిసారి జోడి కట్టాలనుకున్న గాంజా శంకర్ ఉంటుందో లేదో తెలియని అయోమయం నెలకొంది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న బుట్టబొమ్మ త్వరలో నాగ చైతన్యతో నటించవచ్చని ఫిలిం నగర్ టాక్. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న కార్తీక్ దండు త్వరలో చైతుతో ఒక మూవీ ప్లాన్ చేసుకున్న సంగతి ఆల్రెడీ లీకయ్యింది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. 

నాగ చైతన్య, పూజా హెగ్డేలు తెరను పంచుకోవడం ఇది మొదటిసారి కాదు. 2014 ఒక లైలా కోసంలో తెరమీద ప్రేమించుకున్నారు. అప్పటికి ఇద్దరికీ స్టార్ స్టేటస్ లేదు. ముకుంద ఫ్లాప్ కన్నా ముందు పూజాకు వచ్చిన ఆఫర్ ఇది. అయితే సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో గుర్తింపు రాలేదు. కట్ చేస్తే ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని డీజే దువ్వాడ జగన్నాథంతో మొదటి బ్రేక్ దక్కించుకుంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్ళీ దశాబ్దం తర్వాత కాంబో రిపీట్ కావడం అంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. 

ప్రస్తుతానికి అఫీషియల్ కాలేదు కాబట్టి ప్రచారంలో ఉన్న వార్తగానే చూడాలి. తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్న చైతు అది పూర్తయ్యేవరకు వేరే ప్రాజెక్టు మొదలుపెట్టే మూడ్ లో లేడు. అక్టోబర్ లో విడుదల చేయాలని గీత ఆర్ట్స్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రీకరణ వేగమందుకుంది. దర్శకుడు చందూ మొండేటి నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో స్పీడ్ పెంచాడు. ఈలోగా కార్తీక్ దండుతో సినిమా గురించి అనౌన్స్ మెంట్ రావొచ్చేమో కానీ షూట్ మాత్రం వేసవి తర్వాత ఉంటుంది. చూడాలి మరి ఒక లైలా కోసం పెయిర్ మరోసారి స్క్రీన్ మీద కనిపిస్తారో లేదో. 

Share

Recent Posts

సీఎం సినిమా తడబడుతుంది

అసలే తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమా. పైగా విడుదల చాలా ఆలస్యం అయింది. మధ్యలో సినిమా ఆన్…

1 hour ago

పాత రోజుల్లోకి నారా రోహిత్

రాజకీయాలకు పేరుపడ్డ నారా కుటుంబం నుంచి ఒక నటుడు వస్తున్నాడంటే మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఏమాత్రం సక్సెస్ అవుతాడో…

2 hours ago

అఖిల్ భారతీయుడు కాదా?

భారతీయులకు విదేశీ పౌరసత్వాలు దక్కడం కొత్తేమీ కాదు. ముందు ఇండియాలోనే పుట్టి పెరిగి.. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాక…

3 hours ago

ష‌ర్మిల ఎక్క‌డున్నారు… ఫోన్ స్విచ్ఛాఫ్‌!?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? అనే విష‌యాలు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం…

3 hours ago

మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో…

5 hours ago

అన్ని దారులు `ధ‌ర్మేంద్ర` వైపే..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని రూపాల్లో ప్ర‌య‌త్నించినా.. విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే బ‌ల ప్ర‌యోగం చేయ‌డంతో ఇది తీవ్ర వివాదానికి…

7 hours ago