మొన్నటిదాకా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే విపరీతంగా నెమ్మదించేసింది. చేతి దాకా వచ్చిన గుంటూరు కారం కొంత షూటింగ్ అయ్యాక మిస్ కాగా, సాయి దుర్గ తేజ్ తో మొదటిసారి జోడి కట్టాలనుకున్న గాంజా శంకర్ ఉంటుందో లేదో తెలియని అయోమయం నెలకొంది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న బుట్టబొమ్మ త్వరలో నాగ చైతన్యతో నటించవచ్చని ఫిలిం నగర్ టాక్. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న కార్తీక్ దండు త్వరలో చైతుతో ఒక మూవీ ప్లాన్ చేసుకున్న సంగతి ఆల్రెడీ లీకయ్యింది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి.
నాగ చైతన్య, పూజా హెగ్డేలు తెరను పంచుకోవడం ఇది మొదటిసారి కాదు. 2014 ఒక లైలా కోసంలో తెరమీద ప్రేమించుకున్నారు. అప్పటికి ఇద్దరికీ స్టార్ స్టేటస్ లేదు. ముకుంద ఫ్లాప్ కన్నా ముందు పూజాకు వచ్చిన ఆఫర్ ఇది. అయితే సినిమా ఆశించిన విజయం అందుకోకపోవడంతో గుర్తింపు రాలేదు. కట్ చేస్తే ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని డీజే దువ్వాడ జగన్నాథంతో మొదటి బ్రేక్ దక్కించుకుంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్ళీ దశాబ్దం తర్వాత కాంబో రిపీట్ కావడం అంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు.
ప్రస్తుతానికి అఫీషియల్ కాలేదు కాబట్టి ప్రచారంలో ఉన్న వార్తగానే చూడాలి. తండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్న చైతు అది పూర్తయ్యేవరకు వేరే ప్రాజెక్టు మొదలుపెట్టే మూడ్ లో లేడు. అక్టోబర్ లో విడుదల చేయాలని గీత ఆర్ట్స్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రీకరణ వేగమందుకుంది. దర్శకుడు చందూ మొండేటి నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో స్పీడ్ పెంచాడు. ఈలోగా కార్తీక్ దండుతో సినిమా గురించి అనౌన్స్ మెంట్ రావొచ్చేమో కానీ షూట్ మాత్రం వేసవి తర్వాత ఉంటుంది. చూడాలి మరి ఒక లైలా కోసం పెయిర్ మరోసారి స్క్రీన్ మీద కనిపిస్తారో లేదో.
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…