అల్లు అర్జున్ కెరీర్ ని గొప్ప మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ గా ఆర్య తనకే కాదు డెబ్యూ చేసిన దర్శకుడు సుకుమార్ కి, అభిమానులకు ఎంతో స్పెషల్ గా నిలిచిపోయింది. గంగోత్రిలో లుక్స్, నటన గురించి కామెంట్ చేసిన వాళ్లకు బన్నీ రెండో చిత్రంతోనే బదులు చెప్పడం చిన్న విషయం కాదు. రాబోయే మే 7 ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున రీ యూనియన్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. నిన్న లవ్ మీ సాంగ్ లాంచ్ లో ప్రకటించేశారు. ఆర్య 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనే సంగతి తెలిసిందే.
అంతగా ఆడకపోయినా బన్నీ క్యారెక్టరైజేషన్, దేవిశ్రీ ప్రసాద్ పాటలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్య 3 ప్రకటన ఏమైనా రావొచ్చనే అంచనాలు అభిమానుల్లో మొదలయ్యాయి. వాస్తవిక కోణంలో దానికి ఛాన్స్ లేదని చెప్పాలి. ఎందుకో చూద్దాం. పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ లో రిలీజయ్యాక అల్లు అర్జున్ లిస్టులో అట్లీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. వీళ్ళలో ఎవరిది ముందు ఉంటుందో ఇంకా స్పష్టత లేదు. పుష్ప 3 గురించి ప్రచారాన్ని టీమ్ కొట్టిపారేయడం లేదు కనక థర్డ్ పార్ట్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఎలా చూసుకున్నా అల్లు అర్జున్ ఇంకో నాలుగేళ్లు బిజీనే.
మరి ఆర్య 3 ఆ తర్వాత చేయాలంటే బాగా ఆలస్యమవుతుంది. ఆమాంతం పెరిగిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ముందు ఆర్య లాంటి లవర్ బాయ్ పాత్రలు బన్నీకి ఇప్పుడంతగా నప్పవు. పైగా సుకుమార్ కూడా రామ్ చరణ్ 17తో ఇంకో అయిదారు నెలల్లో బిజీ అయిపోతాడు. సో ప్రాక్టికల్ గా చూస్తే ఎక్కడ ఛాన్స్ కనిపించడం లేదు. సుక్కుతో చేయడాన్ని బన్నీ ఎప్పుడూ ఇష్టపడతాడు. దాంట్లో సందేహం లేదు. అలా అని రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ప్రేమకథకు కొనసాగింపంటే ఇద్దరూ అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోరు. మేలో ఆర్యనే గ్రాండ్ గా 4కెలో రీ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు దిల్ రాజు.
This post was last modified on March 31, 2024 12:34 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…