న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి చేతులు కలిపారు. ఇది గతంలోనే లీకైన న్యూస్ అయినప్పటికీ ఇవాళ ప్రీ లుక్ రూపంలో అధికారిక ముద్ర వేశారు. విప్లవం ప్రారంభం కాకముందే హింస సరైన దారిని ఎంచుకుందనే క్యాప్షన్ తో ఆసక్తి రేపేలా పోస్టర్ వదిలారు. ఈ మధ్య ప్రచారం జరిగినట్టు ఇది దసరా 2 కాదని ఆఫ్ ది రికార్డు యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. శ్రీకాంత్ పూర్తిగా కొత్త కథను రాసుకున్నాడని, కాకపోతే దసరాని మించిన మోతాదులో హింస ఉంటుందని, నానికి ఇచ్చే ఎలివేషన్లు కూడా అదే స్థాయిలో మెప్పిస్తాయని అంటున్నారు.
ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు కానీ నాని మొదటిసారి మాస్ లీడర్ గా ఇందులో దర్శనమివ్వబోతున్నాడు. నేపధ్యం 80, 90ల నాటిదే ఉంటుందని సమాచారం. దసరా తర్వాత పెరిగిన కమర్షియల్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు నాని పరుగులు పెట్టలేదు. దానికి పూర్తి భిన్నమైన హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ డ్రామాని ఎంచుకుని సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు చేస్తున్న సరిపోదా శనివారంలో ఊహించని సబ్జెక్టుతో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో రాబోతున్నాడు. సుజిత్ తో అనౌన్స్ చేసిన ప్యాన్ ఇండియా మూవీలో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ ఉండబోతోంది. సో సాఫ్ట్ పాత్రలకు బ్రేక్ ఇచ్చినట్టే.
వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసుకున్న నాని శ్రీకాంత్ ఓదెల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరంలోనే జరగనుంది. సరిపోదా శనివారం జూలైలో అయిపోతుంది. ఆ తర్వాత ఆగస్ట్ రిలీజ్ వరకు ప్రమోషన్లలో నాని బిజీ అవుతాడు. సుజిత్ అటుపక్క పవన్ కళ్యాణ్ ఓజి ఫినిష్ చేసుకుని రాగానే న్యాచురల్ స్టార్ కు కెమెరా యాక్షన్ చెప్పేస్తాడు. ఇది డిసెంబర్ లేదా జనవరిలోపు కంప్లీట్ చేయాలని టార్గెట్. అక్కడి నుంచి శ్రీకాంత్ ఓదెలకు నాని అందుబాటులోకి వచ్చేస్తాడు. మొత్తానికి నాని ప్లానింగ్ చూస్తుంటే మాస్ అండ్ యాక్షన్ వైపు టర్నింగ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మంచిదేగా.
This post was last modified on March 30, 2024 9:24 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…