న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి చేతులు కలిపారు. ఇది గతంలోనే లీకైన న్యూస్ అయినప్పటికీ ఇవాళ ప్రీ లుక్ రూపంలో అధికారిక ముద్ర వేశారు. విప్లవం ప్రారంభం కాకముందే హింస సరైన దారిని ఎంచుకుందనే క్యాప్షన్ తో ఆసక్తి రేపేలా పోస్టర్ వదిలారు. ఈ మధ్య ప్రచారం జరిగినట్టు ఇది దసరా 2 కాదని ఆఫ్ ది రికార్డు యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. శ్రీకాంత్ పూర్తిగా కొత్త కథను రాసుకున్నాడని, కాకపోతే దసరాని మించిన మోతాదులో హింస ఉంటుందని, నానికి ఇచ్చే ఎలివేషన్లు కూడా అదే స్థాయిలో మెప్పిస్తాయని అంటున్నారు.
ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు కానీ నాని మొదటిసారి మాస్ లీడర్ గా ఇందులో దర్శనమివ్వబోతున్నాడు. నేపధ్యం 80, 90ల నాటిదే ఉంటుందని సమాచారం. దసరా తర్వాత పెరిగిన కమర్షియల్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు నాని పరుగులు పెట్టలేదు. దానికి పూర్తి భిన్నమైన హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ డ్రామాని ఎంచుకుని సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు చేస్తున్న సరిపోదా శనివారంలో ఊహించని సబ్జెక్టుతో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో రాబోతున్నాడు. సుజిత్ తో అనౌన్స్ చేసిన ప్యాన్ ఇండియా మూవీలో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ ఉండబోతోంది. సో సాఫ్ట్ పాత్రలకు బ్రేక్ ఇచ్చినట్టే.
వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసుకున్న నాని శ్రీకాంత్ ఓదెల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరంలోనే జరగనుంది. సరిపోదా శనివారం జూలైలో అయిపోతుంది. ఆ తర్వాత ఆగస్ట్ రిలీజ్ వరకు ప్రమోషన్లలో నాని బిజీ అవుతాడు. సుజిత్ అటుపక్క పవన్ కళ్యాణ్ ఓజి ఫినిష్ చేసుకుని రాగానే న్యాచురల్ స్టార్ కు కెమెరా యాక్షన్ చెప్పేస్తాడు. ఇది డిసెంబర్ లేదా జనవరిలోపు కంప్లీట్ చేయాలని టార్గెట్. అక్కడి నుంచి శ్రీకాంత్ ఓదెలకు నాని అందుబాటులోకి వచ్చేస్తాడు. మొత్తానికి నాని ప్లానింగ్ చూస్తుంటే మాస్ అండ్ యాక్షన్ వైపు టర్నింగ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మంచిదేగా.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…