ఎన్నికల సమయంలో సినిమా వాళ్ల రాజకీయ ఆసక్తులు బయటపడుతుంటాయి. కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తారు. కొందరు పార్టీల కోసం ప్రచారం చేసి పెడతారు. యాంకర్ టర్న్డ్ యాక్టర్ అనసూయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం ప్రచారం చేయడానికి రెడీ అనడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
అంత ఓపెన్గా అనసూయ ఆఫర్ ఇస్తున్న నేపథ్యంలో ఆమెతో జనసేనకు ప్రచారం చేయిస్తే బాగుంటుందన్న చర్చ జరిగింది. సోషల్ మీడియాలో జనసైనికులు చాలామంది ఆమె గురించి పాజిటివ్ కామెంట్లు చేశారు. కొందరైతే ఆమెను జనసైనికురాలిగా పేర్కొంటూ.. త్వరలో జనసేనలో చేరుతుందనే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఐతే తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా జనాలకు ఒక సందేశం పంపింది అనసూయ.
తాను జనసేన పార్టీలో చేరతానని అనలేదని ఆమె స్పష్టం చేసింది. ‘‘నేను తుమ్మినా దగ్గినా కాంట్రవర్శీ చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి అడిగితే సమాధానం ఇచ్చానంతే. నాయకుడు నచ్చి, అజెండా నచ్చితే ప్రోత్సహిస్తానని మాత్రమే చెప్పా. అంతే కానీ పార్టీలో చేరతానని చెప్పలేదు. జనసేన పార్టీ అజెండా నాకెంతో నచ్చిన విషయం మాత్రం చెప్పా’’ అని అనసూయ వివరించింది.
ఈ రోజుల్లో లైమ్ లైట్లో ఉన్న సినిమా హీరోయిన్లు ఒక పార్టీలో చేరి పూర్తి స్థాయిలో రాజకీయం చేయడం అంటే కష్టమైన వ్యవహారమే. దాని వల్ల ఎదుర్కోవాల్సిన వ్యతిరేకత చాలా ఉంటుంది. అందుకే ఎన్నికల వరకు జస్ట్ ప్రచారం వరకు అయితే ఓకే కానీ.. జనసేన లేదా ఇంకో పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని అనసూయ చెప్పకనే చెప్పింది.
This post was last modified on March 29, 2024 7:46 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…