కొన్ని నెలల క్రితం ప్రకటించి అసలు షూటింగ్ జరుగుతుందో లేదోననే తరహాలో మౌనం పాటించిన ప్రతినిథి 2 ఇవాళ హఠాత్తుగా టీజర్ రూపంలో వచ్చి ఆశ్చర్యపరిచాడు. సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలైన ప్రతినిథి నారా రోహిత్ కు నటన పరంగానే కాకుండా కమర్షియల్ గానూ మంచి విజయం అందించింది. దానికి కొనసాగింపు కాకపోయినా దాని ఛాయలు కనిపించేలా సీక్వెల్ ని రూపొందించడం ఒక విశేషమైతే దర్శకుడిగా ప్రముఖ యాంకర్ టీవీ5 మూర్తి దీని ద్వారానే డెబ్యూ చేయడం మరో ఆకర్షణ. ఊహించని క్వాలిటీ, కంటెంట్ తో ఒకరకంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ అజెండా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో వ్యక్తిగత ఉద్దేశాలు ఎక్కువగా ఉండటంతో జనం ఆదరించడం లేదు. భారీ బడ్జెట్ లో తీసిన థియేట్రికల్ మూవీ అయినా ఓటిటిలో వచ్చిన చిన్న చిత్రమైనా ఒకే ఫలితం వస్తోంది. కానీ ప్రతినిథి 2 ఆ కోవలోకి రావడం లేదు. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ, ఓటు విలువను తెలియజేస్తూ, సినిమాటిక్ ఫార్మాట్ లో రూపొందించినట్టు కనిపిస్తోంది. అయిదు లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే అభివృద్ధి జరగాలని ఒక మంత్రి చెబితే అసలు అభివృద్ధి ఎక్కడుందని జర్నలిస్టు ప్రశ్నించడం బాగుంది.
ఏప్రిల్ లో విడుదల కాబోతున్న ప్రతినిధి 2లో నారా రోహిత్ మునుపటి లుక్ లో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా జిస్సు సేన్ గుప్తా, అజయ్ ఘోష్ తదితరుల సీనియర్ క్యాస్టింగ్ పెద్డదే కనిపిస్తోంది. హీరోయిన్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించినట్టు లేరు. పూర్తిగా కల్పిత కథ కాబట్టి సెన్సార్ ఇబ్బందులు వచ్చే అవకాశాలు తక్కువే. బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న నారా రోహిత్ ప్రతినిథి 2 మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. పాత్రికేయంలో సుదీర్ఘ అనుభవమున్న మూర్తి క్లిష్టమైన కంటెంట్ ని ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి.
This post was last modified on March 29, 2024 3:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…