తెలుగు వెర్షన్ మీద ప్రత్యేక శ్రద్ధతో రోజుల తరబడి హైదరాబాద్ లోనే ఉండి ప్రమోషన్లు చేసిన పృథ్విరాజ్ సుకుమారన్ కొత్త సినిమా ది గోట్ లైఫ్ ఆడు జీవితం నిన్న థియేటర్లలో విడుదలయ్యింది. 16 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు మీద పని చేయడమే కాక కథ డిమాండ్ మేరకు తన శరీరాన్ని బరువు పెంచి తగ్గించడం ద్వారా ఎంతో శ్రమను తీసుకున్న పృథ్విరాజ్ దీన్ని తన కలల రూపంగా చెప్పుకున్నారు. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి గల్ఫ్ లో పడిన కష్టాలను నవలగా తీసుకొస్తే ఆ పుస్తకం అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. దాని ఆధారంగా గోట్ లైఫ్ రూపొందింది. మరి మన ప్రేక్షకులకు మెప్పించేలా ఉందా.
నజీబ్ (పృథ్విరాజ్ సుకుమారన్) జీవనోపాధికి చేస్తున్న వృత్తి సరిపోక కుటుంబం, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం ముప్పై వేలు అప్పు చేసి తెలిసిన బ్రోకర్ ద్వారా గల్ఫ్ దేశానికి వెళ్తాడు. అక్కడ కిడ్నాప్ కు గురై ఒక ముఠా చేతికి చిక్కుతాడు. గొర్రెలు కాసే కఠినమైన పనిని నజీబ్ కు పురమాయిస్తారు. తప్పించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరికిపోయి దెబ్బలు తింటాడు. ఇలా అలవాటు పడుతున్న క్రమంలో హకీమ్(గోకుల్)తో కలిసి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఇది అనుకున్నంత సులభంగా ఉండదు. ఎన్నో ప్రమాదాలు దాటుకున్నాక చివరికీ ఏమైందనేది తెరమీద చూడాలి.
దర్శకుడు బ్లేస్సి సహజత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంతో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. కంటెంట్ మీద అవగాహనతో ముందుగానే ప్రిపేరయ్యి చూస్తే పృథ్విరాజ్ నటన, ఎడారి వాతావరణం, ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం కట్టి పడేస్తాయి. అలా కాకుండా మూడు గంటల నిడివిలో ఎంటర్ టైన్మెంట్ లేదా కమర్షియల్ అంశాలు కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. ప్రయత్నలోపం లేకుండా అంతర్జాతీయ అవార్డులు సైతం దక్కించుకునే స్థాయిలో హీరో, డైరెక్టర్ పనితనం కనిపిస్తుంది కానీ సగటు వినోదం లేదా మాస్ ఎలిమెంట్స్ కోరుకునే ప్రేక్షకులకు ఈ గోట్ లైఫ్ కొరుకుడుపడదు.
This post was last modified on March 29, 2024 11:15 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…