ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మ్యాన్ గా రాబోతున్నాడు. టైటిల్ తో మొదలుపెట్టి పాటల దాకా దీని మీద ముందు నుంచి కుటుంబ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గీత గోవిందం రూపంలో కెరీర్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ తో రౌడీ హీరో చేతులు కలపడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న ఈ లవ్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు గోపి సుందర్ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. హైప్ పెంచే బాధ్యత కూడా దీని మీదే ఉంది మరి.
మధ్యతరగతికి చెందిన గోవర్ధన్(విజయ్ దేవరకొండ) చక్కగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు, అక్క, బామ్మ, అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటాడు. పై పోర్షన్ లో కొత్తగా చేరిన అమ్మాయి(మృణాల్ ఠాకూర్) మీద తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. పరిచయం ప్రేమగా మారి ఒక్కటయ్యే సమయంలో ఆమె మనుషుల(జగపతి బాబు – అచ్యుత్ కుమార్) వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటాడు. ఒకవైపు ప్రేమ పెళ్లి, ఇంకోవైపు శత్రువులతో రాజీలేని యుద్ధం. చివరికి ఈ పద్మవ్యూహం నుంచి గోవర్ధన్ ఎలా బయటపడ్డాడనేది స్టోరీ.
కథను పెద్దగా దాచకుండా మెయిన్ పాయింట్ ని రివీల్ చేయడంలోనే టీమ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.విజయ్ దేవరకొండ టైమింగ్ డిఫరెంట్ గా ఉండగా మృణాల్ ఠాకూర్ తో కెమిస్ట్రీ ఫ్రెష్ గా అనిపిస్తోంది. రోహిణి హట్టంగడి, వాసుకి, హరీష్ ఉత్తమన్ తో పాటు చిన్న పిల్లల గ్యాంగ్ పెద్దదే కనిపిస్తోంది. బీజీఎమ్ కూల్ గా సాగింది. 2 గంటల 30 సెకండ్లలో మ్యాటరేంటో చెప్పేశారు కాబట్టి ఇంకో వారం రోజుల్లో రిలీజ్ కోసం ఎదురు చూసేలా ప్రేక్షకులను సిద్ధం చేశారు. ఖుషిలో మిస్ అయిన ఎంటర్ టైన్మెంట్ ఫ్యామిలీ స్టార్ లో బాగా కుదిరినట్టుంది. జనాలకు కనెక్ట్ అయితే సూపర్ హిట్టు పడ్డట్టే.
This post was last modified on March 28, 2024 5:19 pm
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…