హీరో హీరోయిన్లు తెర మీద రొమాన్స్ పండిస్తుంటే యువ ప్రేక్షకులు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సన్నివేశాల్లో నటించడం ఏమంత కష్టం కాదనిపిస్తుంది. తక్కువ కష్టంతో ఎక్కువ పేరొస్తుందని హీరోయిన్లు ఆ తరహా సీన్లలో నటిస్తారని భావిస్తారు. కానీ మిగతా అన్ని సీన్ల కంటే రొమాంటిక్ సీన్లు చేయడమే చాలా కష్టం అన్నది గ్లామర్ హీరోయిన్లుగా పేరుబడ్డ చాలామంది చెప్పేమాట.
తన తొలి సినిమా ‘చిత్రం’లో ఒక రేంజిలో ఇంటిమేట్ సీన్లు చేయడమే కాక.. ఆ తర్వాత కూడా ఎక్కువగా గ్లామర్ క్యారెక్టర్లే చేసిన రీమాసేన్ సైతం తర్వాత తాను రొమాంటిక్ సీన్లు చేస్తుంటే నరకంగా అనిపించేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇక కెరీర్లో చాలా వరకు ట్రెడిషనల్ రోల్సే చేసి.. ఇప్పుడు కొత్తగా గ్లామర్ రూట్లోకి అడుగు పెట్టిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. రొమాంటిక్ సీన్లు చేయడంలో ఉన్న కష్టం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
‘టిల్లు స్వ్వేర్’ మూవీ కోసం అనుపమ కెరీర్లో ఇంతవరకు ఎప్పుడూ కనిపించనంత గ్లామరస్గా కనిపించడం.. ఇంటిమేట్ సీన్లు చేుయడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఐతే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన అనుభవం గురించి అనుపమ మాట్లాడుతూ.. ‘‘తెరపై చూసేవాళ్లకు అది మామూలుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు ఎంజాయ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
కానీ వంద మంది క్రూ ముందు రొమాన్స్ చేయడం.. అది సహజంగా ఉండేలా చూసుకోవడం అంత కష్టం కాదు. మిగతా అన్ని సీన్ల కంటే అవే చాలా కష్టం అని నా అభిప్రాయం ఇలాంటి సీన్లతో మెప్పించడం తేలిక కాదు. ‘టిల్లు స్క్వేర్’లో ఇంటిమేట్ సీన్లు చేస్తున్నపుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలి కాబట్టి ఇది చేశాను’’ అని అనుపమ చెప్పింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 26, 2024 11:59 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…