Movie News

ఇంట్రో సీనే ఇంత అరాచకంగా ఉంటుందా

నిన్న ప్రకటించిన రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ కాంబో ప్యాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో ఇంకా యూనిట్ కే తెలియదు. బుచ్చిబాబుతో చేస్తున్న ఆర్సి 16 మీద దీని ప్లానింగ్ ఆధారపడి ఉంది. అయితే జానర్ కు సంబంధించి యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది తప్ప రంగస్థలం తరహాలో పల్లెటూరి నేపథ్యంలో ఉండదని నిన్న మా సైట్ ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప 1 జరుగుతున్న టైంలోనే దీని కథను సిద్ధం చేసుకున్న సుకుమార్ ఇంట్రో ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఓ సందర్భంగా రాజమౌళికి పూసగుచ్చినట్టు వివరించాడు. ఈ సంఘటన జక్కన్న గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  

ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో ఎస్ఎస్ కార్తికేయ కూడా దీన్ని విన్నాడు. ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఎప్పడూ చూడనంత గొప్పగా ఓపెనింగ్ సీన్ ఉంటుందని, చూస్తూ చూస్తూ కుర్చీల అంచులకు వచ్చేయడం ఖాయమని తండ్రి కొడుకులు ఇద్దరూ ఊరించడం చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం మాములుగా లేదు. వినడానికే ఇంత ఎలివేషన్ అనిపిస్తే ఇక స్క్రీన్ మీద జరిగే అరాచకం మాటలకు అందదేమోని అంచనాలు పెంచేసుకుంటున్నారు. సుక్కు టేకింగ్ కి జక్కన్న ముందు నుంచి అభిమానే. జగడం లాంటి ఫ్లాప్ మూవీలో తనకు నచ్చిన విషయాల గురించి చెబుతారు రాజమౌళి.

ఈ లెక్కన చరణ్ సుకుమార్ కలయిక మాములుగా ఉండేలా లేదు. గేమ్ ఛేంజర్ విడుదలకు ఎంత టైం ఉన్నా వేసవి నుంచి బుచ్చిబాబు షూటింగ్ మొదలైపోతుంది. జాన్వీ కపూర్ డేట్లు కూడా దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకున్నారట. విలన్ గా సంజయ్ దత్ తో పాటు కన్నడ తమిళం నుంచి క్రేజీ క్యాస్టింగ్ తెచ్చుకునే పనులు ఊపందుకున్నట్టు తెలిసింది. చరణ్ మేకోవర్ కు కనీసం రెండు నెలలు టైం పట్టొచ్చని తెలిసింది. పుష్ప 2 ది రూల్ కనక బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు ఆర్సి 17కొచ్చే క్రేజ్ ప్యాన్ ఇండియాకు మించే ఉంటుంది. సమ్మర్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని సుకుమార్ దీని పని మీద ఉంటారు. 

This post was last modified on March 26, 2024 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago