లాక్ డౌన్ పేరుతో ఆరునెలల పాటు ఇంట్లోనే వుండిపోయిన తెలుగు సినిమా తారలు ఒక్కొక్కరూ బిక్కు బిక్కుమంటూ బయటకు వస్తున్నారు. కరోనా సోకుతుందనే భయం ఏ మూలనో వున్నా కానీ ఇక పనులు మొదలు పెట్టక తప్పదని డిసైడయ్యారు. అక్కినేని కాంపౌండ్ నుంచి ముందుగా నాగార్జున బయటకు వచ్చి ‘వైల్డ్ డాగ్’ షూట్ చేస్తోంటే, నాగ చైతన్య కూడా ‘లవ్స్టోరీ’ షూటింగ్కి వెళ్లి వస్తున్నాడు. మామ, భర్త ఇద్దరూ పనిలో పడినా కానీ సమంత మాత్రం ఇంకా షూటింగ్కి వెళ్లడానికి ఇష్టపడడం లేదు.
ఈ లాక్ డౌన్ టైమ్లో డాబా మీదే కూరగాయలు పండించుకుని వండుకు తిన్న సమంత యోగా, మెడిటేషన్ లాంటివాటితో కాలక్షేపం చేసింది. ఈ లాక్ డౌన్ సమయంలో సగటు గృహిణి బాధ్యతలతో బిజీ అయిన సమంత మధ్యలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కోసం డబ్బింగ్ పూర్తి చేసేసింది. అయితే షూటింగ్కి వెళ్లడానికి మాత్రం ఆమె ఇంకా తటపటాయిస్తోంది.
ఇదిలావుంటే హీరోయిన్లు ఒక్కొక్కరుగా మళ్లీ షూటింగ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. పూజా హెగ్డే హైదరాబాద్ చేరిపోయి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ పని పూర్తి చేయాలని చూస్తోందట. అదయ్యాక ప్రభాస్తో కలిసి ‘రాధేశ్యామ్’ షూటింగ్లో పాల్గొంటుందట. మరి సమంత ఒప్పుకున్న సినిమాలను ఎప్పుడు సెట్టెక్కిస్తుందో చూడాలిక.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…