పెద్ద హీరో ఉంటే చాలు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓటిటితో రికవరీ చేసుకుని హ్యాపీగా ఉందామనుకుంటే ఆ రోజులు పోయేలా ఉన్నాయి. దానికి రెండు ఉదాహరణల గురించి ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ జరుగుతోంది. వాటిలో మొదటిది దక్షిణాదిలోనే అత్యంత క్రేజ్ ఉన్న స్టార్ ది. ముందు క్యామియో అని చెప్పి తర్వాత నిడివి పెంచి ప్రేక్షకులకు తలనొప్పి వచ్చే రేంజ్ లో డిజాస్టర్ ఇచ్చారు. షూటింగ్ టైంలో ఇరవై నిమిషాల ఫుటేజ్ పోవడంతో హడావిడిగా ఎడిటింగ్ చేసి థియేటర్లకు వదిలి నిర్మాతకు నష్టం మిగిల్చారు. ఇది ఈ వారం ఒక ఇంటర్నేషనల్ ఓటిటిలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.
కానీ మాకు చెప్పిన అవుట్ ఫుట్ ఇవ్వని కారణంగా ముందు చెప్పిన రేట్ ఇవ్వలేమని సదరు ఓటిటి తెగేసి చెప్పడంతో డిజిటల్ రిలీజ్ ఆగిపోయింది. రీ షూట్ చేసి ఇవ్వండి లేదా ఇక్కడితో మర్చిపోండని అనడంతో నిర్మాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారని టాక్. మరొకటి బాలీవుడ్ మూవీ. గత ఏడాది దసరాకు రిలీజ్ చేసిన ఈ సూపర్ హీరో మూవీలో క్రేజీ క్యాస్టింగ్ ఉంది. మొదటి రోజే దారుణమైన టాక్ తో పావు వంతు పెట్టుబడి కూడా వెనక్కు తేలేదు. ఎంత పబ్లిసిటీ చేసినా, వివిధ భాషల్లో డబ్బింగులు సిద్ధం చేసినా ఆడియన్స్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
ఏ మాత్రం క్వాలిటీ లేని సినిమాని మాకిస్తారాని ముందు అగ్రిమెంట్ చేసుకున్న 70 కోట్లను ఇవ్వడానికి ఓటిటి కంపెనీ నిరాకరించడంతో ప్రొడ్యూసర్ లీగల్ నోటీసులు పంపాడట. కోర్టుకు వెళ్లినా సరే వెనక్కు తగ్గేది లేదని పరస్పరం న్యాయస్థానంలో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇక్కడ చెప్పిన రెండు సినిమాలు ఒకే అంతర్జాతీయ ఓటిటి కొనుక్కుంది. పాలసీ విషయంలో చాలా కఠినంగా వ్యవరిస్తుందని పేరున్న ఈ సంస్థ దెబ్బకు అగ్ర నిర్మాతలు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయారట. ఇకపై ఇలాంటి సమస్యలు రాకూడదని అనుకుంటే నాణ్యత విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే.
This post was last modified on March 23, 2024 6:47 pm
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…