పెద్ద హీరో ఉంటే చాలు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓటిటితో రికవరీ చేసుకుని హ్యాపీగా ఉందామనుకుంటే ఆ రోజులు పోయేలా ఉన్నాయి. దానికి రెండు ఉదాహరణల గురించి ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ జరుగుతోంది. వాటిలో మొదటిది దక్షిణాదిలోనే అత్యంత క్రేజ్ ఉన్న స్టార్ ది. ముందు క్యామియో అని చెప్పి తర్వాత నిడివి పెంచి ప్రేక్షకులకు తలనొప్పి వచ్చే రేంజ్ లో డిజాస్టర్ ఇచ్చారు. షూటింగ్ టైంలో ఇరవై నిమిషాల ఫుటేజ్ పోవడంతో హడావిడిగా ఎడిటింగ్ చేసి థియేటర్లకు వదిలి నిర్మాతకు నష్టం మిగిల్చారు. ఇది ఈ వారం ఒక ఇంటర్నేషనల్ ఓటిటిలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.
కానీ మాకు చెప్పిన అవుట్ ఫుట్ ఇవ్వని కారణంగా ముందు చెప్పిన రేట్ ఇవ్వలేమని సదరు ఓటిటి తెగేసి చెప్పడంతో డిజిటల్ రిలీజ్ ఆగిపోయింది. రీ షూట్ చేసి ఇవ్వండి లేదా ఇక్కడితో మర్చిపోండని అనడంతో నిర్మాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారని టాక్. మరొకటి బాలీవుడ్ మూవీ. గత ఏడాది దసరాకు రిలీజ్ చేసిన ఈ సూపర్ హీరో మూవీలో క్రేజీ క్యాస్టింగ్ ఉంది. మొదటి రోజే దారుణమైన టాక్ తో పావు వంతు పెట్టుబడి కూడా వెనక్కు తేలేదు. ఎంత పబ్లిసిటీ చేసినా, వివిధ భాషల్లో డబ్బింగులు సిద్ధం చేసినా ఆడియన్స్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
ఏ మాత్రం క్వాలిటీ లేని సినిమాని మాకిస్తారాని ముందు అగ్రిమెంట్ చేసుకున్న 70 కోట్లను ఇవ్వడానికి ఓటిటి కంపెనీ నిరాకరించడంతో ప్రొడ్యూసర్ లీగల్ నోటీసులు పంపాడట. కోర్టుకు వెళ్లినా సరే వెనక్కు తగ్గేది లేదని పరస్పరం న్యాయస్థానంలో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇక్కడ చెప్పిన రెండు సినిమాలు ఒకే అంతర్జాతీయ ఓటిటి కొనుక్కుంది. పాలసీ విషయంలో చాలా కఠినంగా వ్యవరిస్తుందని పేరున్న ఈ సంస్థ దెబ్బకు అగ్ర నిర్మాతలు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయారట. ఇకపై ఇలాంటి సమస్యలు రాకూడదని అనుకుంటే నాణ్యత విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే.
This post was last modified on March 23, 2024 6:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…