అల్లు అరవింద్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఇంటి మనిషి. చిరును అరవింద్ పొగిడితే.. ఆయన గొప్పదనం గురించి వివరిస్తే ఒకప్పుడు అదొక సాధారణ విషయమే. కానీ ఈ మధ్య అరవింద్ తనయుడు అల్లు అర్జున్ వ్యవహార శైలి, సోషల్ మీడియా జనాల తీరు వల్ల అది కూడా చాలా ప్రత్యేకమైన విషయంగా మారిపోయింది. హీరోగా ఎదిగే క్రమంలో అల్లు అర్జున్ చిరు గురించి గొప్పగా మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ను సైతం కొనియాడేవాడు. కానీ ‘సరైనోడు’ ఈవెంట్లో చెప్పను బ్రదర్ అన్న దగ్గర్నుంచి కథ మారిపోయింది.
నెమ్మదిగా అతను మెగా గొడుగు నుంచి బయటికి వచ్చి ‘అల్లు’ బ్రాండ్ను ప్రమోట్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ మధ్య మెగా అనే పదమే వాడట్లేదు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ మెగా అభిమానుల్లోనే ఒక వర్గం అల్లు వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో చిరు గురించి అల్లు అరవింద్ గొప్పగా మాట్లాడ్డం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆహా ఓటీటీ భాగస్వామ్యంతో హైదరాబాద్ వేదికగా జరిగిన సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో చిరంజీవిని సత్కరించారు. ఇటీవలే ఆయన పద్మవిభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా చిరు మెగా ఫ్యామిలీ కోసం వేసిన బాట గురించి అరవింద్ మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ దగ్గర్నుంచి అల్లు శిరీష్ వరకు హీరోలు కావడానికి చిరునే కారణమని.. వాళ్లందరి కోసం ఆయన పెద్ద రహదారి వేశారని అరవింద్ అన్నారు. తమ కుటుంబంలోని వారికే కాక యువ నటీనటులు ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారని చిరును కొనియాడారు అరవింద్. చిరు తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా అరవింద్ మాట్లాడారు. ఆయన ప్రసంగానికి ఆహూతుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…