వచ్చే వారం విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు క్రమంగా ఎగబాకుతున్నాయి. యూత్ లో దీని మీదున్న క్రేజ్ దృష్ట్యా భారీ రిలీజ్ దక్కబోతోంది. నిన్న రిలీజైన ఓం భీమ్ బుష్ కు కామెడీ లవర్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్ల రూపంలో కనిపించడం లేదు. ఒకవేళ వీకెండ్ రెండు రోజుల ఏదైనా అనూహ్యమైన పికప్ ఉంటే హిట్ క్యాటగిరీలోకి చేరిపోతుంది. టిల్లు మీద ఉన్న హైప్ ని దృష్టి పెట్టుకుంటే శ్రీవిష్ణు టీమ్ వీలైనంత వసూళ్లు మొదటి వారంలోనే తెచ్చుకుంటే ఈజీగా సేఫ్ అయిపోవచ్చు.
ట్రేడ్ టాక్ ప్రకారం టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ ముప్పై నుంచి ముప్పై అయిదు కోట్ల మధ్యలో జరిగిందట. సిద్దు జొన్నలగడ్డ మార్కెట్ కి ఇది భారీ మొత్తమే కానీ టిల్లు బ్రాండ్ కున్న వేల్యూ వల్ల డిస్ట్రిబ్యూటర్లు రిస్క్ కి రెడీ అవుతున్నారట. పైగా ఫిబ్రవరి నుంచి జనాలను తండోపతండాలుగా థియేటర్లకు తీసుకొచ్చిన సినిమా ఒక్కటి రాలేదు. డీసెంట్ హిట్లున్నాయి తప్ప బ్లాక్ బస్టర్లు పడలేదు. చివరిది హనుమాన్ మాత్రమే. మళ్ళీ అంత కెపాసిటీ టిల్లు స్క్వేర్ చూపిస్తుందని టాక్. మెయిన్ స్క్రీన్లకు నాలుగు వారాల అగ్రిమెంట్ చేసుకోమని నిర్మాత చెప్పడమే దీనికి నిదర్శనమట.
పాజిటివ్ టాక్ వస్తే మాత్రం టిల్లు స్క్వేర్ కి తిరుగు ఉండదు. వారం గ్యాప్ లోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తున్నప్పటికీ పూర్తిగా ప్రభావం చెందే అవకాశం ఉండకపోవచ్చు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ క్రైమ్ థ్రిల్లర్ లో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఇన్ సైడ్ రిపోర్ట్. యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న టిల్లు స్క్వేర్ నిడివి కూడా రెండుంపావు గంటలలోపే ఉందట. లెన్త్ ఎంతనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. హాలీవుడ్ మూవీ గాడ్జిలా వర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్, పృథ్విరాజ్ ఆడు జీవితం మాత్రమే పోటీలో ఉన్నాయి. చూడాలి టిల్లు ఏం చేయబోతున్నాడో
This post was last modified on March 23, 2024 11:52 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…