సలార్ లో ప్రభాస్ ఫ్రెండ్ వరదరాజ మన్నార్ గా మెప్పించిన పృథ్విరాజ్ సుకుమారన్ దాని వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరివాడయ్యాడు. అందుకే ఆయన నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితంని ఈ నెల మార్చి 28న భారీ ఎత్తున ఏపీ, తెలంగాణలోనూ విడుదల చేయబోతున్నారు. పంపిణి బాధ్యతలు మైత్రి తీసుకోవడంతో బయ్యర్ల చేయూత బలంగా ఉండబోతోంది. పోటీగా ఉన్న టిల్లు స్క్వేర్ ని కాచుకోవడం అంత సులభం కాదు. యూత్ లో దానికున్న క్రేజ్ చాలానే ఉంది. పైగా వెరైటీ ప్రమోషన్ల ఆల్రెడీ ఉన్న బజ్ ని అమాంతం పెంచే పనిలో ఉంది టీమ్.
ఆడు జీవితం సర్వైవల్ థ్రిల్లర్. చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. స్క్రీన్ మొత్తం పృథ్విరాజే అధిక శాతం కనిపిస్తాడు. ఎడారిలో నెలల తరబడి చిక్కిన మనిషి ఎలా బ్రతికి బట్టకట్టాడనే పాయింట్ మీద రూపొందించారు. టిల్లు స్క్వేర్ ఒకపక్క కాంపిటీషన్ అనుకుంటే ఇంకోవైపు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మీద పిల్లలు వెయిట్ చేస్తున్నారు. సో సలార్ విలన్ కు సవాల్ ఎదురు కావడం ఖాయం. కానీ పృథ్విరాజ్ నమ్మకం మాములుగా లేదు. అదే పనిగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో పలు విశేషాలు పంచుకున్నాడు.
సలార్ లో రాజులా కనిపిస్తే ఇందులో బానిస పాత్ర చేశానని, రోజుల తరబడి ఆహరంలో కఠిన ఆంక్షలు పాటించి బరువు పెరగడం, తగ్గడం చేశానని చెప్పుకొచ్చాడు. మలయాళం డబ్బింగులు బాగుంటే ఆదరణ దక్కుతుందని ఇటీవలే ప్రేమలు నిరూపించింది. అదే తరహాలో ఆడు జీవితం కూడా హిట్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. మలయాళం తెలుగులో సమాంతరంగా థియేటర్లలో రిలీజవుతున్న పృథ్విరాజ్ మొదటి సినిమా ఇదేనని చెప్పొచ్చు. ఒకప్పుడు రామ్ చరణ్ సరసన నాయక్ లాంటి సినిమాలు చేసిన అమలా పాల్ ఆడు జీవితంలో మెయిన్ లీడ్ చేయడం విశేషం.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…