సలార్ లో ప్రభాస్ ఫ్రెండ్ వరదరాజ మన్నార్ గా మెప్పించిన పృథ్విరాజ్ సుకుమారన్ దాని వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరివాడయ్యాడు. అందుకే ఆయన నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితంని ఈ నెల మార్చి 28న భారీ ఎత్తున ఏపీ, తెలంగాణలోనూ విడుదల చేయబోతున్నారు. పంపిణి బాధ్యతలు మైత్రి తీసుకోవడంతో బయ్యర్ల చేయూత బలంగా ఉండబోతోంది. పోటీగా ఉన్న టిల్లు స్క్వేర్ ని కాచుకోవడం అంత సులభం కాదు. యూత్ లో దానికున్న క్రేజ్ చాలానే ఉంది. పైగా వెరైటీ ప్రమోషన్ల ఆల్రెడీ ఉన్న బజ్ ని అమాంతం పెంచే పనిలో ఉంది టీమ్.
ఆడు జీవితం సర్వైవల్ థ్రిల్లర్. చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. స్క్రీన్ మొత్తం పృథ్విరాజే అధిక శాతం కనిపిస్తాడు. ఎడారిలో నెలల తరబడి చిక్కిన మనిషి ఎలా బ్రతికి బట్టకట్టాడనే పాయింట్ మీద రూపొందించారు. టిల్లు స్క్వేర్ ఒకపక్క కాంపిటీషన్ అనుకుంటే ఇంకోవైపు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మీద పిల్లలు వెయిట్ చేస్తున్నారు. సో సలార్ విలన్ కు సవాల్ ఎదురు కావడం ఖాయం. కానీ పృథ్విరాజ్ నమ్మకం మాములుగా లేదు. అదే పనిగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో పలు విశేషాలు పంచుకున్నాడు.
సలార్ లో రాజులా కనిపిస్తే ఇందులో బానిస పాత్ర చేశానని, రోజుల తరబడి ఆహరంలో కఠిన ఆంక్షలు పాటించి బరువు పెరగడం, తగ్గడం చేశానని చెప్పుకొచ్చాడు. మలయాళం డబ్బింగులు బాగుంటే ఆదరణ దక్కుతుందని ఇటీవలే ప్రేమలు నిరూపించింది. అదే తరహాలో ఆడు జీవితం కూడా హిట్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. మలయాళం తెలుగులో సమాంతరంగా థియేటర్లలో రిలీజవుతున్న పృథ్విరాజ్ మొదటి సినిమా ఇదేనని చెప్పొచ్చు. ఒకప్పుడు రామ్ చరణ్ సరసన నాయక్ లాంటి సినిమాలు చేసిన అమలా పాల్ ఆడు జీవితంలో మెయిన్ లీడ్ చేయడం విశేషం.
This post was last modified on March 23, 2024 8:26 am
తెలంగాణలోని ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ప్రతిపక్షం బీఆర్ఎస్కు దక్కింది. దీనికి సంబంధించి పార్టీ అదినేత, మాజీ…
డెవిల్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ చేసిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇటీవలే ఫస్ట్…
దర్శకుడు పూరి జగన్నాథ్ రెండు వరస డిజాస్టర్ల తర్వాత కంబ్యాక్ కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్…
రాజకీయ అధినేతల మాటలు ఒకలా.. చేతలు మరోలా ఉండటం సహజం. మాట్లాడే సిద్ధాంతాలు.. విలువల్ని చేతల్లో చేసి చూపిస్తారనుకుంటే తప్పులో…
ఏపీ కూటమి పార్టీలు మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను పంచేసుకున్నాయి. ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు…
నిన్న ఇండియా న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతున్నా సరే దానికి ధీటుగా ట్రెండింగ్ లోకి వచ్చిన టాపిక్…