సలార్ లో ప్రభాస్ ఫ్రెండ్ వరదరాజ మన్నార్ గా మెప్పించిన పృథ్విరాజ్ సుకుమారన్ దాని వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరివాడయ్యాడు. అందుకే ఆయన నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితంని ఈ నెల మార్చి 28న భారీ ఎత్తున ఏపీ, తెలంగాణలోనూ విడుదల చేయబోతున్నారు. పంపిణి బాధ్యతలు మైత్రి తీసుకోవడంతో బయ్యర్ల చేయూత బలంగా ఉండబోతోంది. పోటీగా ఉన్న టిల్లు స్క్వేర్ ని కాచుకోవడం అంత సులభం కాదు. యూత్ లో దానికున్న క్రేజ్ చాలానే ఉంది. పైగా వెరైటీ ప్రమోషన్ల ఆల్రెడీ ఉన్న బజ్ ని అమాంతం పెంచే పనిలో ఉంది టీమ్.
ఆడు జీవితం సర్వైవల్ థ్రిల్లర్. చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. స్క్రీన్ మొత్తం పృథ్విరాజే అధిక శాతం కనిపిస్తాడు. ఎడారిలో నెలల తరబడి చిక్కిన మనిషి ఎలా బ్రతికి బట్టకట్టాడనే పాయింట్ మీద రూపొందించారు. టిల్లు స్క్వేర్ ఒకపక్క కాంపిటీషన్ అనుకుంటే ఇంకోవైపు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మీద పిల్లలు వెయిట్ చేస్తున్నారు. సో సలార్ విలన్ కు సవాల్ ఎదురు కావడం ఖాయం. కానీ పృథ్విరాజ్ నమ్మకం మాములుగా లేదు. అదే పనిగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో పలు విశేషాలు పంచుకున్నాడు.
సలార్ లో రాజులా కనిపిస్తే ఇందులో బానిస పాత్ర చేశానని, రోజుల తరబడి ఆహరంలో కఠిన ఆంక్షలు పాటించి బరువు పెరగడం, తగ్గడం చేశానని చెప్పుకొచ్చాడు. మలయాళం డబ్బింగులు బాగుంటే ఆదరణ దక్కుతుందని ఇటీవలే ప్రేమలు నిరూపించింది. అదే తరహాలో ఆడు జీవితం కూడా హిట్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. మలయాళం తెలుగులో సమాంతరంగా థియేటర్లలో రిలీజవుతున్న పృథ్విరాజ్ మొదటి సినిమా ఇదేనని చెప్పొచ్చు. ఒకప్పుడు రామ్ చరణ్ సరసన నాయక్ లాంటి సినిమాలు చేసిన అమలా పాల్ ఆడు జీవితంలో మెయిన్ లీడ్ చేయడం విశేషం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…