వేసవి సీజన్ వస్తోందంటే పెద్ద పెద్ద సినిమాలు వస్తాయని ఆశలు పెట్టుకుంటారు సినీ అభిమానులు. కానీ కొన్నేళ్లుగా టాలీవుడ్ సమ్మర్ సీజన్లో ఆశించిన స్థాయిలో కళ ఉండట్లేదు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 చిత్రాలు సందడి చేసిన 2022 వేసవిని మినహాయిస్తే.. గత నాలుగేళ్లలో హడావుడి కనిపించలేదు.
గత ఏడాది దసరా, విరూపాక్ష లాంటి మిడ్ రేంజ్ సినిమాలే హవా సాగించాయి. ఆ వేసవిలో బిగ్గెస్ట్ హిట్గా ‘విరూపాక్ష’నే నిలిచింది. మరి ఈ వేసవిలో బిగ్గెస్ట్ మూవీ ఏదవుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈసారి కూడా పెద్ద సినిమాలు ఏవీ వేసవి బరిలో లేనట్లే. ‘దేవర’ ఆల్రెడీ వాయిదా పడింది. ‘కల్కి’ వాయిదా పడటం లాంఛనమే అని భావిస్తున్నారు. రేసులో మిగిలినవన్నీ మిడ్ రేంజ్ మూవీసే. వీటిలో సమ్మర్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలవగలా సత్తా ఉన్న మూవీగా ‘టిల్లు స్క్వేర్’నే భావిస్తున్నారు.
ఈ వేసవిలో ఫ్యామిలీ స్టార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఓం భీం బుష్ లాంటి మిడ్ రేంజ్ క్రేజీ మూవీస్ వస్తున్నాయి. కానీ వాటిని మించి ‘టిల్లు స్క్వేర్’కు హైప్ ఉంది. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘డీజే టిల్లు’ సెన్సేషనల్ హిట్ అయింది. రిలీజ్ తర్వాత రోజులు గడిచేకొద్దీ దాని క్రేజ్ పెరిగింది.
ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో ఆ సినిమా పాటలు, డైలాగులు వైరల్ అయ్యాయి. దీంతో ‘టిల్లు స్క్వేర్’ మీద అంచనాలు పెరిగిపోయాయి. సినిమా చాలా ఆలస్యం అయినా సరే హైప్ పెరిగిందే తప్ప తగ్గలేదు. రిలీజ్ దగ్గర పడేసరికి క్రేజ్ ఇంకా పెరుగుతోంది.
ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలోనే వస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే కలెక్షన్లు ఒక రేంజిలో ఉంటాయనడంలో సందేహం లేదు. మిడ్ రేంజ్ మూవీస్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్చి 29న ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 21, 2024 6:36 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…