మన చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే మన ప్రైవేట్ లైఫ్ ఇంటర్నెట్లో పెట్టేసినట్టే అంటూ వుంటారు. మనం ఎక్కడెక్కడ తిరిగిందీ, ఎవరితో ఎంత సేపు మాట్లాడినదీ, ఎవరికి ఏ మెసేజ్ పంపించినదీ… మొత్తం ఫోన్ మెమరీలో నిక్షిప్తమై వుంటుంది. దానిని డిలీట్ చేసేసాం కాబట్టి ఎవరికీ కనిపించదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే డేటా రిట్రీవల్ పక్రియలో గతమంతా మళ్లీ తవ్వి తీసేయగలరు. సుషాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తిని విచారించగా వారికి ఆ కేసు పరంగా ఏమీ దొరకలేదు. కానీ ఆమె ఫోన్లో డ్రగ్ డీలర్స్తో ముచ్చట్లు, తమతో పని చేసే వారికీ, తనకూ మధ్య డ్రగ్స్ గురించిన చాట్ మెసేజ్లు బయటపడ్డాయి. దీంతో ఆమె అరెస్ట్ అయిపోయింది.
ఇప్పుడు తన ద్వారా మరింత మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. రియా ఉదంతంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. తమ స్మార్ట్ ఫోన్ కానీ పోలీసుల చేతికి చిక్కితే ఇక తమ పని శంకరగిరి మాన్యాలే అనే భయం పట్టుకుంది. అందుకే ఫోన్ని రీస్టోర్ చేయడం కాకుండా పూర్తిగా మాయం చేసేసి, అసలు తమ గతాన్ని తవ్వి తీసే అవకాశం లేకుండా చేసేందుకు చాలా మంది డిజిటల్ క్లీనప్ మీద పడ్డారట. ఇకపై ఫోన్లలో సందేశాలు పంపించే విషయంలో చాలా అప్రమత్తంగా వుంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రియా దొరికిపోయి మిగతావాళ్లకు లైఫ్ లైన్ ఇచ్చినట్టయింది. ఆ కృతజ్ఞతతోనే ఏమో ఆమె జైల్ నుంచి వచ్చాక తనతో సినిమాలు చేస్తామని చిలక పలుకులు పలుకుతున్నారు కొందరు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…