మన చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటే మన ప్రైవేట్ లైఫ్ ఇంటర్నెట్లో పెట్టేసినట్టే అంటూ వుంటారు. మనం ఎక్కడెక్కడ తిరిగిందీ, ఎవరితో ఎంత సేపు మాట్లాడినదీ, ఎవరికి ఏ మెసేజ్ పంపించినదీ… మొత్తం ఫోన్ మెమరీలో నిక్షిప్తమై వుంటుంది. దానిని డిలీట్ చేసేసాం కాబట్టి ఎవరికీ కనిపించదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే డేటా రిట్రీవల్ పక్రియలో గతమంతా మళ్లీ తవ్వి తీసేయగలరు. సుషాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తిని విచారించగా వారికి ఆ కేసు పరంగా ఏమీ దొరకలేదు. కానీ ఆమె ఫోన్లో డ్రగ్ డీలర్స్తో ముచ్చట్లు, తమతో పని చేసే వారికీ, తనకూ మధ్య డ్రగ్స్ గురించిన చాట్ మెసేజ్లు బయటపడ్డాయి. దీంతో ఆమె అరెస్ట్ అయిపోయింది.
ఇప్పుడు తన ద్వారా మరింత మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. రియా ఉదంతంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. తమ స్మార్ట్ ఫోన్ కానీ పోలీసుల చేతికి చిక్కితే ఇక తమ పని శంకరగిరి మాన్యాలే అనే భయం పట్టుకుంది. అందుకే ఫోన్ని రీస్టోర్ చేయడం కాకుండా పూర్తిగా మాయం చేసేసి, అసలు తమ గతాన్ని తవ్వి తీసే అవకాశం లేకుండా చేసేందుకు చాలా మంది డిజిటల్ క్లీనప్ మీద పడ్డారట. ఇకపై ఫోన్లలో సందేశాలు పంపించే విషయంలో చాలా అప్రమత్తంగా వుంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రియా దొరికిపోయి మిగతావాళ్లకు లైఫ్ లైన్ ఇచ్చినట్టయింది. ఆ కృతజ్ఞతతోనే ఏమో ఆమె జైల్ నుంచి వచ్చాక తనతో సినిమాలు చేస్తామని చిలక పలుకులు పలుకుతున్నారు కొందరు.
This post was last modified on September 12, 2020 10:34 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…