మంచి కాన్సెప్ట్తో సినిమా తీయాలని తపన పడే యువ దర్శకులను ప్రోత్సహించడానికి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తలో చేయి వేయడం.. పెట్టుబడి పెట్టడం.. ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే. ఇలా క్రౌడ్ ఫండింగ్తో తీసిన సినిమాలు కొన్ని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఐతే ఇలాంటి సినిమాలు కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయి పెట్టుబడిదారులకు లాభాలు అందించిన ఉదంతాలు మాత్రం పెద్దగా కనిపించవు.
ఐతే ఇప్పుడు ‘గామి’ మూవీ ఈ ట్రెండ్ను బ్రేక్ చేసింది. విద్యాధర్ కగిత అనే కొత్త దర్శకుడు.. యంగ్ హీరో విశ్వక్సేన్ కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తనతో మొదలుపెట్టిన సినిమా ఇది. చాందిని చౌదరి హీరోయిన్. అతడి విజన్ నచ్చి సోషల్ మీడియా క్యాంపైనింగ్లో చాలామంది చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఐతే చిన్న సినిమా అయినా సరే.. రాజీ లేకుండా ఒక పెద్ద సినిమా రేంజ్ ఔట్ పుట్ తీసుకురాగలిగింది టీం.
ఆరేళ్లు కష్టపడి సినిమాను పూర్తి చేశాక యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ అండతో విడుదలైన ‘గామి’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంది. సినిమాలో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నా.. అక్కడక్కడా లాజిక్స్ మిస్సయినా.. ఓవరాల్గా ఓ మంచి ప్రయత్నంగా గుర్తింపు తెచ్చుకుంది ‘గామి’. సినిమాను మంచి లాభాలకు అమ్మడమే కాదు.. బయ్యర్లందరినీ సేఫ్ జోన్లోకి తీసుకురాగలిగింది ‘గామి’ టీం. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ముగిసింది. ‘గామి’కి వచ్చిన లాభాలను ఇప్పుడు చిన్న చిన్న పెట్టుబడిదారులకు పంచే ప్రయత్నంలో పడింది టీం.
మొదట్నుంచి సినిమా కోసం డబ్బలు ఇచ్చిన వాళ్లందరి లిస్ట్ తీసి.. వారికి లాభాలతో కలిపి ఇన్వెస్ట్మెంట్ వెనక్కి ఇవ్వబోతున్నట్లు మెయిల్ పంపారు. త్వరలోనే సెటిల్మెంట్ జరగబోతోంది. మున్ముందు క్రౌడ్ ఫండింగ్తో తీసే సినిమాలకు ‘గామి’ సక్సెస్ ఒక మంచి ప్రోత్సాహంలా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 19, 2024 4:20 pm
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…