మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ సగర్వంగా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేసింది. స్టార్ హీరోలు లేకుండా కంటెంట్ నమ్ముకుని కేవలం పది కోట్ల లోపే బడ్జెట్ తో తీసి ఇంత పెద్ద మైలురాయి చేరుకున్న తొలి సినిమాగా ఇది దక్కించుకుంటున్న ప్రశంసలు మాములుగా లేవు. ఈ ఫీట్ ని గతంలో 2018, పులిమురుగన్ లాంటివి అందుకున్నప్పటికీ వాటిలో మోహన్ లాల్, టోవినో థామస్ లాంటి నోటెడ్ ఆర్టిస్టులున్నారు. కానీ మంజుమ్మెల్ బాయ్స్ లో దాదాపు అన్నీ కొత్త ముఖాలే. ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేనివి. అయినా గొప్ప విజయం సాధించింది.
తెలుగు ఆడియన్స్ దీని డబ్బింగ్ వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు మార్చి 22 అన్నారు కానీ ఆ సూచనలు గత వారం నుంచే కనిపించడం లేదు. పోనీ వచ్చే వారం అనుకుంటే టిల్లు స్క్వేర్ లాంటి బలమైన పోటీ ఉంది. పైగా కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాతో ముప్పు ఉంది. ఆపై వారం ఫ్యామిలీ స్టార్ కోసం కుటుంబ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వీలైనంత త్వరగా మంజుమ్మెల్ డబ్బింగ్ తీసుకుని రావాల్సి ఉంది. హనుమాన్ నిర్మాత, మైత్రి కలిసి పంపిణి చేస్తున్నారనే టాక్ వచ్చింది కానీ ఆ దిశగా వేగంగా అడుగులు పడలేదు. రిలీజ్ ఎప్పుడో కన్ఫర్మ్ చేయలేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం డబ్బింగ్, సెన్సార్ ఇంకా పెండింగ్ ఉండటం వల్ల జాప్యం జరుగుతోందని తెలిసింది. ప్రేమలు ఇదే తరహాలో కొంచెం లేట్ చేయడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. కానీ అపోజిషన్ వీక్ అయిపోవడంతో మెల్లగా పుంజుకుని పది కోట్ల గ్రాస్ ని లాగేసింది. ఒకవేళ పోటీ తీవ్రంగా ఉంటే ఇంత ఫీట్ సులభంగా వచ్చేది కాదు. కానీ మంజుమ్మెల్ బాయ్స్ కు ఆ సానుకూలత లేదు. ఒకవేళ వేరే ఏదైనా తేదీ అనుకుంటే దాన్ని ప్రకటిస్తే సరిపోతుంది. లేదంటే ఓటిటిలో వచ్చాక చూద్దాంలే అని జనాలు అనుకుంటే మాత్రం ఒరిజినల్ ఫలితం రిపీట్ కాకపోయే ప్రమాదముంది
This post was last modified on March 19, 2024 4:17 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…