మలయాళం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ సగర్వంగా 200 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేసింది. స్టార్ హీరోలు లేకుండా కంటెంట్ నమ్ముకుని కేవలం పది కోట్ల లోపే బడ్జెట్ తో తీసి ఇంత పెద్ద మైలురాయి చేరుకున్న తొలి సినిమాగా ఇది దక్కించుకుంటున్న ప్రశంసలు మాములుగా లేవు. ఈ ఫీట్ ని గతంలో 2018, పులిమురుగన్ లాంటివి అందుకున్నప్పటికీ వాటిలో మోహన్ లాల్, టోవినో థామస్ లాంటి నోటెడ్ ఆర్టిస్టులున్నారు. కానీ మంజుమ్మెల్ బాయ్స్ లో దాదాపు అన్నీ కొత్త ముఖాలే. ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేనివి. అయినా గొప్ప విజయం సాధించింది.
తెలుగు ఆడియన్స్ దీని డబ్బింగ్ వెర్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందు మార్చి 22 అన్నారు కానీ ఆ సూచనలు గత వారం నుంచే కనిపించడం లేదు. పోనీ వచ్చే వారం అనుకుంటే టిల్లు స్క్వేర్ లాంటి బలమైన పోటీ ఉంది. పైగా కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాతో ముప్పు ఉంది. ఆపై వారం ఫ్యామిలీ స్టార్ కోసం కుటుంబ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వీలైనంత త్వరగా మంజుమ్మెల్ డబ్బింగ్ తీసుకుని రావాల్సి ఉంది. హనుమాన్ నిర్మాత, మైత్రి కలిసి పంపిణి చేస్తున్నారనే టాక్ వచ్చింది కానీ ఆ దిశగా వేగంగా అడుగులు పడలేదు. రిలీజ్ ఎప్పుడో కన్ఫర్మ్ చేయలేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం డబ్బింగ్, సెన్సార్ ఇంకా పెండింగ్ ఉండటం వల్ల జాప్యం జరుగుతోందని తెలిసింది. ప్రేమలు ఇదే తరహాలో కొంచెం లేట్ చేయడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. కానీ అపోజిషన్ వీక్ అయిపోవడంతో మెల్లగా పుంజుకుని పది కోట్ల గ్రాస్ ని లాగేసింది. ఒకవేళ పోటీ తీవ్రంగా ఉంటే ఇంత ఫీట్ సులభంగా వచ్చేది కాదు. కానీ మంజుమ్మెల్ బాయ్స్ కు ఆ సానుకూలత లేదు. ఒకవేళ వేరే ఏదైనా తేదీ అనుకుంటే దాన్ని ప్రకటిస్తే సరిపోతుంది. లేదంటే ఓటిటిలో వచ్చాక చూద్దాంలే అని జనాలు అనుకుంటే మాత్రం ఒరిజినల్ ఫలితం రిపీట్ కాకపోయే ప్రమాదముంది
This post was last modified on March 19, 2024 4:17 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…