మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కెరీర్లో చాలా వరకు ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేసింది. ఆమె లుక్స్ పద్ధతిగా ఉండేవి. కొంచెం గ్లామరస్గా కనిపించేది కానీ.. ఎక్స్పోజింగ్ చేయడం, ఇంటిమేట్ సీన్లు-లిప్ లాక్స్ లాంటి వాటికి అస్సలు వెళ్లేది కాదు. మాతృభాష మలయాళంలోనే కాదు.. అత్యధిక చిత్రాల్లో నటించిన తెలుగులోనూ ఆమె అదే బాటలో సాగింది.
అలాంటి అమ్మాయి ‘టిల్లు స్క్వేర్’కు వచ్చేసరికి ఒక్కసారిగా షాకుల మీద షాకులు ఇచ్చేసింది. లిప్ లాక్స్, క్లీవేజ్ షోలు, ఇంటిమేట్ సీన్లు.. అబ్బో మొత్తంగా అనుపమకు ఈ సినిమా ఒక మేకోవర్ అని చెప్పొచ్చు. ఉన్నట్లుండి ఇంత బోల్డ్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘టిల్లు స్క్వేర్’ నుంచి కొత్త పాట రిలీజైన సందర్భంగా టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దీని గురించే మీడియా వాళ్లు పదే పదే ప్రశ్నలు వేశారు.
దీంతో ఒకింత అసహనానికి గురైన అనుపమ.. ఒకే రకం క్యారెక్టర్లు చేసి చేసి బోర్ కొట్టేసిందని చెప్పింది. బోల్డ్ క్యారెక్టర్ చేయడం గురించి అడిగిన ఓ విలేకరిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు బిరియానీ తింటారా, ఇష్టమా.. మరి ప్రతి రోజూ అదే తింటారా? అప్పుడప్పుడూ తింటారు అంతే కదా.. అలాగే ఎప్పుడూ ఒకే రకం ఫుడ్ తిననట్లే.. ఒకే రకం పాత్రలు కూడా చేయకూడదు.. అప్పుడు మనకు మనమే బోర్ కొట్టేస్తాం”.. అని అనుపమ అంది.
‘టిల్లు స్క్వేర్’లో తాను చేసిన లిల్లీ లాంటి క్యారెక్టర్ను వదులుకుంటే తాను స్టుపిడ్ అయ్యేదాన్నని.. ఏ కమర్షియల్ సినిమాలో కూడా ఇంత మంచి హీరోయిన్ క్యారెక్టర్ ఉండదని.. ఈ విషయం తాను రాసిస్తానని అనుపమ చెప్పింది. ఇంతలో మైక్ అందుకున్న హీరో కమ్ రైటర్ సిద్ధు జొన్నలగడ్డ.. “మేడం బిగినర్స్ మిస్టేక్ చేసే ఛాన్సే లేదు. నేను చేస్తానేమో కానీ తను చేయదు. పర్ఫెక్ట్ ప్లానింగ్తో రంగంలోకి దిగింది” అనడంతో అనుపమ గొల్లుమని నవ్వింది.
This post was last modified on March 19, 2024 10:34 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…