తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న కొత్త సినిమా అంటే.. టిల్లు స్క్వేర్యే. రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్ అయిన డీజే టిల్లుకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. డీజే టిల్లు తర్వాత అవకాశాలు వెల్లువెత్తినా ఏవీ ఒప్పుకోకుండా టిల్లు పాత్రతో మరోసారి అల్లరి చేయడం మీదే ఫోకస్ పెట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. అతను బాగా టైం తీసుకుని చేసిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలూగించేలాగే కనిపిస్తోంది.
దీని పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా క్రేజీగా అనిపించాయి. ఇంకో పది రోజుల్లోనే టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలీజ్ ముంగిట మరో ట్రైలర్ కూడా వదలాలని చూస్తోంది చిత్ర బృందం. కాగా.. ఈ సినిమా క్రూకు సంబంధించి చివరి దశలో ఓ కీలక మార్పు జరిగినట్లు సమాచారం.
డీజే టిల్లుకు బ్యాగ్రౌండ్ స్కోర్తో అదరగొట్టిన తమన్.. సీక్వెల్ నుంచి తప్పుకున్నాడట. ముందు తమన్కే నేపథ్య సంగీత బాధ్యతలు అప్పగించారు కానీ.. ఇప్పుడు అతను ఆ పని చేయట్లేదని సమాచారం. బలగం, మ్యాడ్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న భీమ్స్ సిసిరోలియో టిల్లు స్క్వేర్కు స్కోర్ అందిస్తున్నాడట. మరి తమన్కు ఖాళీ లేక ఈ సినిమా నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ బాద్యతల నుంచి తప్పుకున్నాడా లేక వేరే కారణమేదైనా ఉందా అన్నది తెలియదు.
భీమ్స్ శైలికి తగ్గ సినిమానే కావడంతో అతను కూడా మంచి బీజీఎంయే ఇస్తాడని ఆశించవచ్చు. ఈ చిత్రానికి పాటల కంపోజింగ్ రామ్ మిరియాల, అచ్చు రాజమణి చేశారు. అవి ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కింది.
This post was last modified on March 19, 2024 7:19 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…