Movie News

ప్రేమలు….బాక్సాఫీసుకు స్లో పాయిజన్

విడుదలైన మొదటి రెండు రోజులు చాలా నెమ్మదిగా ఉన్న ప్రేమలు తర్వాత ఒక్కసారిగా ఊపందుకుని బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపించడం వసూళ్లలో స్పష్టమైపోయింది. గామి, భీమాలతో పోటీ కారణంగా మొదటి వారం ఆశించిన స్థాయిలో నెంబర్లు నమోదు చేయకపోవడంతో హిట్టవుతుందా లేదానే అనుమానం ట్రేడ్ లో వచ్చింది. అయితే బిజినెస్ తక్కువకు చేయడం, రాజమౌళి గెస్టుగా ఈవెంట్ జరపడం, మహేష్ బాబు ట్వీట్ ఇవన్నీ తర్వాతి రోజుల్లో సానుకూల అంశాలుగా పని చేశాయి. క్రమంగా కలెక్షన్లు పెరిగి భారీ లాభాల వైపు పరుగులు పెడుతోంది.

మొత్తం పది రోజులకు గాను తెలుగు ప్రేమలు పది కోట్ల గ్రాస్ కి దగ్గరగా వెళ్లిందని ట్రేడ్ టాక్. నిన్న మొన్న బుక్ మై షోలో కొత్త రిలీజుల కంటే దీనికే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం గమనార్హం. యావరేజ్ గా పదివేలకు పైగానే టికెట్లు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఈవెనింగ్ షో, మ్యాట్నీలు హౌస్ ఫుల్స్ నమోదు కావడం విశేషం. అటు మలయాళంలోనూ మళ్ళీ పికప్ చూపించడం అనూహ్య పరిణామం. గామి ఫైనల్ రన్ కు దగ్గరల్ ఉండగా మాస్ నే నమ్ముకున్న భీమాకు సరిపడా స్క్రీన్లు అందుబాటులో ఉంచినా అవి టికెట్ల రూపంలో భారీగా బదిలీ కావడం లేదు.

ఈ లెక్కన ప్రేమలుని వచ్చిన లాభాల కోణంలో చూసుకుంటే బ్లాక్ బస్టర్ ముద్ర పడటం ఖాయంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం రిలీజైన తమిళంలోనూ రెస్పాన్స్ బాగుందని చెన్నై రిపోర్ట్. మొత్తం అన్ని భాషలకు కలిపి ఇప్పటిదాకా 115 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రేమలు తక్కువ బడ్జెట్ తో రూపొంది ఇండస్ట్రీ హిట్స్ సాధించిన టాప్ 10 సినిమాల్లో చోటు దక్కించుకునే దిశగా పరుగులు పెడుతోంది. దీని దెబ్బకే మమిత బైజు తెలుగు యువతకు కూడా ఫెవరెట్ గా మారిపోయింది. ఎంతగా అంటే మొన్నో యుట్యూబర్ ఏకంగా స్టేజి మీదే ఆమెకు కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేంత.

This post was last modified on March 18, 2024 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago