పెద్ద సినిమాల నుంచి ఏవైనా విశేషాలు పంచుకోవాలంటే.. ఏదైనా పండుగో లేదంటే హీరో పుట్టిన రోజునో సందర్భంగా ఎంచుకుంటారు. వేరే సమయాల్లో, అభిమానుల్లో ఏ అంచనాలు, ఆకాంక్షలు లేనపుడు కొత్త విశేషాలు పంచుకోరు. అందులోనూ షూటింగ్ ఆగిపోయిన సినిమా నుంచి ఎవ్వరూ ఊహించని టైంలో గ్లింప్స్ లాంటిదేదైనా రిలీజ్ చేస్తున్నారంటే షాక్ అవ్వక తప్పదు.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అలాంటి షాకే ఇవ్వబోతోందట. ఈ మూవీ నుంచి అతి త్వరలో ఓ టీజర్ లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. అది చిన్న డైలాగ్ టీజర్ అని అంటున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైతం చెప్పకనే చెప్పేసింది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రం ఉస్తాద్.. అంటూ ఆ సంస్థ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.
ఐతే సమయం సందర్భం లేకుండా.. అభిమానుల నుంచి ఎలాంటి డిమాండ్ లేనపుడు ఈ టీజర్ వదలడం ఏంటి అని ఆశ్చర్యం కలగడం ఖాయం. ఈ సినిమా షూట్ కొన్ని నెలల కిందటే ఆగిపోయింది. పవన్ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ. మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో, ఈ సినిమా షూట్లో పాల్గొంటాడో కూడా క్లారిటీ లేదు.
ఐతే ఈ నెల 19న ముంబయిలో అమేజాన్ సంస్థ నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీం పాల్గొనబోతోందట. అక్కడ ప్రదర్శించేందుకు సినిమా నుంచి ఒక స్పెషల్ టీజర్ రెడీ చేశారట. అదే అభిమానుల కోసం ముందు లాంచ్ చేయబోతున్నారట. ఈ సడెన్ సర్ప్రైజ్ పవన్ ఫ్యాన్స్ను ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా…
అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు…
ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం జూలై 9 విడుదలని మొన్నటి దాకా టీమ్…
ఎన్ని వందల కోట్లు పెట్టి తీస్తున్నా తన సినిమా కథ ఎవరికీ తెలియకూడదనే ఆత్రం రాజమౌళికి ఉండదు. టైటిల్ లీక్…
పెద్ది థియేటర్ రన్ ఈ సండేతో ముగిసినట్టే. నాలుగో వారంలో ఓ మోస్తరుగా ఆడుతోంది కానీ వీక్ డేస్ లో…
ఫిలిం సెలబ్రెటీల లగ్జరీస్ మీద ఎప్పుడూ అభిమానుల దృష్టి ఉంటుంది. వాళ్ల నివాసాలు.. వాళ్లు వాడే కార్లు.. ఇలా ప్రతి…