పెద్ద సినిమాల నుంచి ఏవైనా విశేషాలు పంచుకోవాలంటే.. ఏదైనా పండుగో లేదంటే హీరో పుట్టిన రోజునో సందర్భంగా ఎంచుకుంటారు. వేరే సమయాల్లో, అభిమానుల్లో ఏ అంచనాలు, ఆకాంక్షలు లేనపుడు కొత్త విశేషాలు పంచుకోరు. అందులోనూ షూటింగ్ ఆగిపోయిన సినిమా నుంచి ఎవ్వరూ ఊహించని టైంలో గ్లింప్స్ లాంటిదేదైనా రిలీజ్ చేస్తున్నారంటే షాక్ అవ్వక తప్పదు.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అలాంటి షాకే ఇవ్వబోతోందట. ఈ మూవీ నుంచి అతి త్వరలో ఓ టీజర్ లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. అది చిన్న డైలాగ్ టీజర్ అని అంటున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైతం చెప్పకనే చెప్పేసింది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రం ఉస్తాద్.. అంటూ ఆ సంస్థ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.
ఐతే సమయం సందర్భం లేకుండా.. అభిమానుల నుంచి ఎలాంటి డిమాండ్ లేనపుడు ఈ టీజర్ వదలడం ఏంటి అని ఆశ్చర్యం కలగడం ఖాయం. ఈ సినిమా షూట్ కొన్ని నెలల కిందటే ఆగిపోయింది. పవన్ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ. మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో, ఈ సినిమా షూట్లో పాల్గొంటాడో కూడా క్లారిటీ లేదు.
ఐతే ఈ నెల 19న ముంబయిలో అమేజాన్ సంస్థ నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీం పాల్గొనబోతోందట. అక్కడ ప్రదర్శించేందుకు సినిమా నుంచి ఒక స్పెషల్ టీజర్ రెడీ చేశారట. అదే అభిమానుల కోసం ముందు లాంచ్ చేయబోతున్నారట. ఈ సడెన్ సర్ప్రైజ్ పవన్ ఫ్యాన్స్ను ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…