పెద్ద సినిమాల నుంచి ఏవైనా విశేషాలు పంచుకోవాలంటే.. ఏదైనా పండుగో లేదంటే హీరో పుట్టిన రోజునో సందర్భంగా ఎంచుకుంటారు. వేరే సమయాల్లో, అభిమానుల్లో ఏ అంచనాలు, ఆకాంక్షలు లేనపుడు కొత్త విశేషాలు పంచుకోరు. అందులోనూ షూటింగ్ ఆగిపోయిన సినిమా నుంచి ఎవ్వరూ ఊహించని టైంలో గ్లింప్స్ లాంటిదేదైనా రిలీజ్ చేస్తున్నారంటే షాక్ అవ్వక తప్పదు.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అలాంటి షాకే ఇవ్వబోతోందట. ఈ మూవీ నుంచి అతి త్వరలో ఓ టీజర్ లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. అది చిన్న డైలాగ్ టీజర్ అని అంటున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైతం చెప్పకనే చెప్పేసింది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రం ఉస్తాద్.. అంటూ ఆ సంస్థ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.
ఐతే సమయం సందర్భం లేకుండా.. అభిమానుల నుంచి ఎలాంటి డిమాండ్ లేనపుడు ఈ టీజర్ వదలడం ఏంటి అని ఆశ్చర్యం కలగడం ఖాయం. ఈ సినిమా షూట్ కొన్ని నెలల కిందటే ఆగిపోయింది. పవన్ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ. మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో, ఈ సినిమా షూట్లో పాల్గొంటాడో కూడా క్లారిటీ లేదు.
ఐతే ఈ నెల 19న ముంబయిలో అమేజాన్ సంస్థ నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీం పాల్గొనబోతోందట. అక్కడ ప్రదర్శించేందుకు సినిమా నుంచి ఒక స్పెషల్ టీజర్ రెడీ చేశారట. అదే అభిమానుల కోసం ముందు లాంచ్ చేయబోతున్నారట. ఈ సడెన్ సర్ప్రైజ్ పవన్ ఫ్యాన్స్ను ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on March 17, 2024 6:50 am
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…