Movie News

లాల్ సలాం.. 21 రోజుల ఫుటేజ్ పోయిందట

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ఆయన తనయురాలు ఐశ్వర్య రూపొందించిన ‘లాల్ సలాం’ రజినీ కెరీర్లోనే కాక.. కోలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మామూలుగా సూపర్ స్టార్ తొలి రోజు వచ్చే వసూళ్ల కంటే కూడా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు తక్కువ. తమిళనాట కేవలం రూ.18 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది ‘లాల్ సలాం’. తెలుగులో అయితే రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి.

ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే సూపర్ స్టార్ అభిమానులకు నీరసం వచ్చేసింది. సినిమా అంతకంటే పేలవంగా అనిపించింది. రజినీ 45 నిమిషాలు కనిపించినా, తన వంతుగా బాగా పెర్ఫామ్ చేసినా సినిమాను కాపాడలేకపోయారు. ఐతే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనుకున్న రజినీనే మైనస్ అయ్యారంటూ స్వయంగా ఐశ్వర్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చర్చనీయాంశం అయింది.

రజినీ కోసం కథలో మార్పులు చేర్పులు చేయడం.. ఎడిటింగ్ కూడా ఎలా పడితే అలా చేయడంతో కథ కంగాళీగా తయారైందని.. అందుకే సినిమా ప్రేక్షకులకు రుచించలేదని.. రజినీ పాత్రా సంతృప్తి పరచక, కథ కూడా సరిగ్గా కుదరక ‘లాల్ సలాం’ ఫ్లాప్ అయిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వివాదాస్పదం కూడా అయింది. ఈ విషయం స్క్రిప్టు రాస్తున్నపుడు, సినిమా తీస్తున్నపుడు తెలియలేదా.. సరిగా సినిమా తీయడం రాక ఇలాంటి సాకులు చెబుతారా అంటూ ఐశ్వర్యను రజినీ ఫ్యాన్సే విమర్శించారు.

కాగా ఇప్పుడు సినిమా పరాజయానికి కొత్త కారణం చెప్పింది ఐశ్వర్య. ఈ సినిమాకు సంబంధించి 21 రోజుల ఫుటేజ్ మిస్సయిందని.. దాని వల్ల కథా గమనం దెబ్బ తిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఐశ్వర్య మీద మరింత విమర్శలు తప్పలేదు. ఫుటేజ్ మిస్సయితే.. మళ్లీ ఆ సన్నివేశాలు తీయాలి కానీ, అలాగే ప్రేక్షకుల మీదికి ఎలా వదిలేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమా పరాజయాన్ని అంగీకరించి ముందుకు సాగకుండా.. ఇలా రోజుకో సాకు చెప్పడం ద్వారా ఐశ్వర్య ప్రేక్షకుల్లో మరింత పలుచన అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago