సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగ రాజ్ ఒకరు. కథ కంటే కథనం, స్టైలిష్ మేకింగ్ తో అభిమానులని ఆకట్టుకునే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రిప్ట్ మీద పని చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ పూర్తి కాగానే తలైవర్ సెట్లోకి అడుగు పెడతారు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. మాస్టర్, లియో తర్వాత విజయ్ తో ఇంకో సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్న లోకేష్ కు అది సాధ్యపడే సూచనలు లేనట్టేనని చెన్నై టాక్. దీని స్థానంలో రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ లాక్ చేసినట్టు వినికిడి.
అధికారికంగా ప్రకటించలేదు కానీ కెవిఎన్ ప్రొడక్షన్స్ కోసం ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవాళ లోకేష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ సదరు సంస్థ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. అయితే అందులో హీరో ప్రస్తావన, ఇతర సాంకేతిక వివరాలు ఏమీ లేవు. ఈ రెండు అంశాలను లింక్ చేసుకుని చూస్తే హీరో డార్లింగేనని అనిపిస్తోంది. కాకపోతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే లోకేష్ రజని ప్రాజెక్టు పూర్తి చేసే లోపు 2025 వేసవి వచ్చేస్తుంది. ఆ ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాననుకుంటున్నారు. ఇటు ప్రభాస్ కూడా బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఏడి అవ్వగానే ది రాజా డీలక్స్ ఫినిష్ చేయాలి.
ఇంకోవైపు సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వంని సమ్మర్ లో మొదలుపెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ప్రభాస్, లోకేష్ కనగరాజ్ చేతులు కలపాలంటే కనీసం ఏడాదిన్నర ఎదురు చూడాలి. పైగా ఇంకోవైపు డార్లింగ్ కోసం హను రాఘవపూడి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టేశాడు. బడ్జెట్ ఎంత ఉన్నా సరే వేగానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభాస్ రాబోయే మూడేళ్ళలో కనీసం అయిదు రిలీజులు ఉండేలా చూసుకుంటున్నాడు. సో లోకేష్ కాంబినేషన్ గురించి వచ్చిన వార్త నిజమవ్వాలనే కోరుకుందాం. ఇతని టాలీవుడ్ ఎంట్రీకి ఇంత కన్నా బెస్ట్ ఆప్షన్ అతనికి ఏముంటుంది.
This post was last modified on March 14, 2024 1:18 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…