సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగ రాజ్ ఒకరు. కథ కంటే కథనం, స్టైలిష్ మేకింగ్ తో అభిమానులని ఆకట్టుకునే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రిప్ట్ మీద పని చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ పూర్తి కాగానే తలైవర్ సెట్లోకి అడుగు పెడతారు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నారు. మాస్టర్, లియో తర్వాత విజయ్ తో ఇంకో సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్న లోకేష్ కు అది సాధ్యపడే సూచనలు లేనట్టేనని చెన్నై టాక్. దీని స్థానంలో రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ లాక్ చేసినట్టు వినికిడి.
అధికారికంగా ప్రకటించలేదు కానీ కెవిఎన్ ప్రొడక్షన్స్ కోసం ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవాళ లోకేష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ సదరు సంస్థ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. అయితే అందులో హీరో ప్రస్తావన, ఇతర సాంకేతిక వివరాలు ఏమీ లేవు. ఈ రెండు అంశాలను లింక్ చేసుకుని చూస్తే హీరో డార్లింగేనని అనిపిస్తోంది. కాకపోతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే లోకేష్ రజని ప్రాజెక్టు పూర్తి చేసే లోపు 2025 వేసవి వచ్చేస్తుంది. ఆ ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాననుకుంటున్నారు. ఇటు ప్రభాస్ కూడా బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఏడి అవ్వగానే ది రాజా డీలక్స్ ఫినిష్ చేయాలి.
ఇంకోవైపు సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వంని సమ్మర్ లో మొదలుపెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ప్రభాస్, లోకేష్ కనగరాజ్ చేతులు కలపాలంటే కనీసం ఏడాదిన్నర ఎదురు చూడాలి. పైగా ఇంకోవైపు డార్లింగ్ కోసం హను రాఘవపూడి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టేశాడు. బడ్జెట్ ఎంత ఉన్నా సరే వేగానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభాస్ రాబోయే మూడేళ్ళలో కనీసం అయిదు రిలీజులు ఉండేలా చూసుకుంటున్నాడు. సో లోకేష్ కాంబినేషన్ గురించి వచ్చిన వార్త నిజమవ్వాలనే కోరుకుందాం. ఇతని టాలీవుడ్ ఎంట్రీకి ఇంత కన్నా బెస్ట్ ఆప్షన్ అతనికి ఏముంటుంది.
This post was last modified on March 14, 2024 1:18 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…