ఇటీవలే ప్రేమలు సినిమాని మహేష్ బాబు చూశాడు. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి తన స్వంత ఏఎంబి మల్టీప్లెక్సులో ఎంజాయ్ చేశాడు. అక్కడితో ఆగలేదు. ప్రత్యేకంగా ట్వీట్ వేసి మరీ ప్రశంసలు కురిపించాడు. దీన్ని భూతద్ధంలో చూస్తున్న వాళ్ళు లేకపోలేదు. అదే రోజు విడుదలైన గామిని ఎందుకు ఇదే స్థాయిలో ప్రమోట్ చేయలేదన్నది కొందరు మూవీ లవర్స్ ప్రశ్న. ఇది కొంత వరకు సబబే కానీ మహేష్ బాబు టాలీవుడ్ మొత్తానికి బ్రాండ్ అంబాసడర్ కాదు. వ్యక్తిగా తనకు ఇష్టమైన నచ్చిన పనులు చేసే స్వాతంత్రం ఉండకుండా ఎక్కడికి పోతుంది. సినిమా ఛాయస్ లో అయినా సరే.
అలాంటప్పుడు ప్రేమలుకి సపోర్ట్ చేశాడు కాబట్టి గామికి కూడా చేయాలంటే ఎలా. ఇక్కడో లాజిక్ మిస్ కాకూడదు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న వేళ ఎస్ఎస్ కార్తికేయ ప్రేమలు హక్కులు కొని తెలుగులో రిలీజ్ చేశాడు. ఆ చనువుతో చూసి ఫీడ్ బ్యాక్ ఇమ్మని అడిగి ఉంటాడు. అందులో తప్పేం లేదు. మహేష్ చేసింది కూడా అదే. గతంలో మేం ఫేమస్ కి ఇలా చేసినప్పుడు చిన్న పాటి రచ్చ జరిగింది. ఛాయ్ బిస్కెట్ వాళ్ళతో ఉన్న అనుబంధం దృష్ట్యా దానికీ ట్వీట్లు పెట్టాడు. ఇలా స్టార్ హీరోల ప్రతి చర్య వెనుక ఖచ్చితమైన కారణం ఉంటుంది.
నిజంగానే ప్రేమలు బాగుంది. ఇది ఆడియన్స్ ఫీడ్ బ్యాక్. అలా అని గామి బాలేదని కాదుగా అర్థం. అలా అయితే మూడు రోజులకు ఇరవై కోట్ల గ్రాస్ ఎలా వసూలు చేస్తుంది. ఎంత హడావిడి చేసినా ప్రేమలు ఇంకా పది కోట్ల మార్కు కాదు కదా ఇంకా సగం కూడా అందుకోలేదు ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. ఈ వీకెండ్ లో ఊపందుకునేలా ఉంది. మళయాలం డబ్బింగ్ కాబట్టి మన జనాలు కనెక్ట్ అయ్యేందుకు టైం పడుతోంది. మహేష్ బాబు, రాజమౌళిలు ప్రత్యేకంగా చెప్పాక వసూళ్లు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా కాలంలో ఇలాంటివి అలవాటైపోయాయి కాబట్టి మాములేనని వదిలేయాల్సిందే.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…