ఇటీవలే ప్రేమలు సినిమాని మహేష్ బాబు చూశాడు. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి తన స్వంత ఏఎంబి మల్టీప్లెక్సులో ఎంజాయ్ చేశాడు. అక్కడితో ఆగలేదు. ప్రత్యేకంగా ట్వీట్ వేసి మరీ ప్రశంసలు కురిపించాడు. దీన్ని భూతద్ధంలో చూస్తున్న వాళ్ళు లేకపోలేదు. అదే రోజు విడుదలైన గామిని ఎందుకు ఇదే స్థాయిలో ప్రమోట్ చేయలేదన్నది కొందరు మూవీ లవర్స్ ప్రశ్న. ఇది కొంత వరకు సబబే కానీ మహేష్ బాబు టాలీవుడ్ మొత్తానికి బ్రాండ్ అంబాసడర్ కాదు. వ్యక్తిగా తనకు ఇష్టమైన నచ్చిన పనులు చేసే స్వాతంత్రం ఉండకుండా ఎక్కడికి పోతుంది. సినిమా ఛాయస్ లో అయినా సరే.
అలాంటప్పుడు ప్రేమలుకి సపోర్ట్ చేశాడు కాబట్టి గామికి కూడా చేయాలంటే ఎలా. ఇక్కడో లాజిక్ మిస్ కాకూడదు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న వేళ ఎస్ఎస్ కార్తికేయ ప్రేమలు హక్కులు కొని తెలుగులో రిలీజ్ చేశాడు. ఆ చనువుతో చూసి ఫీడ్ బ్యాక్ ఇమ్మని అడిగి ఉంటాడు. అందులో తప్పేం లేదు. మహేష్ చేసింది కూడా అదే. గతంలో మేం ఫేమస్ కి ఇలా చేసినప్పుడు చిన్న పాటి రచ్చ జరిగింది. ఛాయ్ బిస్కెట్ వాళ్ళతో ఉన్న అనుబంధం దృష్ట్యా దానికీ ట్వీట్లు పెట్టాడు. ఇలా స్టార్ హీరోల ప్రతి చర్య వెనుక ఖచ్చితమైన కారణం ఉంటుంది.
నిజంగానే ప్రేమలు బాగుంది. ఇది ఆడియన్స్ ఫీడ్ బ్యాక్. అలా అని గామి బాలేదని కాదుగా అర్థం. అలా అయితే మూడు రోజులకు ఇరవై కోట్ల గ్రాస్ ఎలా వసూలు చేస్తుంది. ఎంత హడావిడి చేసినా ప్రేమలు ఇంకా పది కోట్ల మార్కు కాదు కదా ఇంకా సగం కూడా అందుకోలేదు ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. ఈ వీకెండ్ లో ఊపందుకునేలా ఉంది. మళయాలం డబ్బింగ్ కాబట్టి మన జనాలు కనెక్ట్ అయ్యేందుకు టైం పడుతోంది. మహేష్ బాబు, రాజమౌళిలు ప్రత్యేకంగా చెప్పాక వసూళ్లు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా కాలంలో ఇలాంటివి అలవాటైపోయాయి కాబట్టి మాములేనని వదిలేయాల్సిందే.
This post was last modified on March 13, 2024 10:06 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…