Allu Arjun
ఒక పట్టాన ఏ సినిమానూ ఓకే చేయని హీరోగా అల్లు అర్జున్కు పేరుంది. ఒకసారి ఒక సినిమా మీదే ఫోకస్ చేసే బన్నీ.. కొత్త కథలు విన్నా వెంటనే ఓకే చేయడు. చాలామంది దర్శకులు తనతో కొన్ని నెలలు కథా చర్చలు జరిపి.. ఆ తర్వాత సైడ్ అయిపోయిన వాళ్లే.
అందుకే బన్నీ ఓ సినిమాను లాక్ చేసినట్లు వార్త వచ్చినా జనం అంత సులువుగా నమ్మరు. ‘పుష్ప’ తర్వాత బన్నీ చేసే సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్తో సినిమా ఓకే అయినా.. అది వెంటనే సెట్స్ మీదికి వెళ్లట్లేదు. మధ్యలో బన్నీ వేరే సినిమా చేస్తాడని అంటున్నారు.
ఆ అవకాశం ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పుడు బన్నీని ఓ సినిమాకు లాక్ చేసినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.
బన్నీతో తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా చేస్తాడని ఎప్పట్నుంచో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ సినిమా ఓకే అయినట్లు సమాచారం. సన్ పిక్చర్స్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించబోతోందట. ఈ సినిమాకు బన్నీ ఏకంగా రూ.120 కోట్ల పారితోషకం పుచ్చుకోబోతున్నాడట.
‘పుష్ఫ’తో బన్నీ ఇమేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ పెరిగిపోయాయి. అతడికి వంద కోట్లు ఇచ్చినా తక్కువేం కాదని అంటున్నారు ట్రేడ్ పండిట్లు. సన్ పిక్చర్స్ అంకతుమించి ఆఫర్ చేసి బన్నీని సినిమాకు లాక్ చేసిందట.
అట్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే తీస్తాడు కానీ.. అతడికి ఇప్పటిదాకా అపజయమే లేదు. చివరగా ‘జవాన్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అట్లీ. ఈసారి బన్నీతోనూ పక్కా కమర్షియల్ మూవీనే ప్లాన్ చేస్తున్నాడట ఈ తమిళ దర్శకుడు.
This post was last modified on March 13, 2024 4:19 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…