కొందరు హీరోయిన్లను చూస్తే పెద్ద రేంజికి వెళ్లే లక్షణాలు ఉన్న వారిలా కనిపిస్తారు. కానీ మంచి అవకాశాలు వచ్చినా.. కాలం కలిసి రాక ఫేడవుట్ అయిపోతుంటారు. అలాంటి హీరోయినే మీరా చోప్రా. తెలుగులో పవర్ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరో సరసన ఆమె కథానాయికగా పరిచయం అయింది.
పవన్తో ఆమె ‘బంగారం’ అనే పెద్ద సినిమా చేసిన సంగతి తెలిసిందే. కానీ అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ‘వాన’ అనే మూవీ చేస్తే అదీ నిరాశపరిచింది. ఆ తర్వాత నితిన్ సరసన ‘మారో’ అనే సినిమా చేస్తే అది చాలా ఆలస్యం అయి.. చివరికి రిలీజై డిజాస్టర్ అనిపించుకుంది. నాగార్జునతో కలిసి చేసిన ‘గ్రీకు వీరుడు’ ఫలితం కూడా తెలిసిందే. దీంతో మీరా కెరీర్ ముందుకు కదల్లేదు. తమిళంలోనూ కొన్ని పేరున్న సినిమాలే చేసినా మీరాకు కలిసి రాలేదు. హిందీలోనూ కథానాయికగా అనుకున్న స్థాయికి వెళ్లలేకపోయింది.
ఐతే సినిమాలతో పాటు కొన్ని వివాదాలతో మీరా అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇప్పుడామె పెళ్లి వార్తతో మీడియాలోకి వచ్చింది. మీరా కొంత కాలంగా డేట్ చేస్తున్న వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్ను పెళ్లి చేసుకుంది. జైపూర్లో కొందరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంది మీరా. చివరగా గత ఏడాది వచ్చిన ‘సఫేద్’ అనే హిందీ మూవీలో మెరిసింది మీరా. సినిమాలతో పాటు కొన్ని టీవీ షోలు కూడా చేసిన మీరాకు మోడలింగ్లోనూ అనుభవం ఉంది.
చివరగా తెలుగు ప్రేక్షకులు ఆమెను తలుచుకుంది ఎన్టీఆర్ అభిమానులతో సోషల్ మీడియా గొడవ వల్లే. ఓ చిట్ చాట్ సందర్భంగా ఎన్టీఆర్ గురించి చెప్పమంటే అతనెవరో తనకు తెలియదంది మీరా. దీంతో ఆమెను తారక్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె వాళ్ల మీద పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ కూడా ఇవ్వడం గమనార్హం.
This post was last modified on March 13, 2024 4:20 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…