ఇంకో ఇరవై రెండు రోజుల్లో విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా టీజర్, రెండు లిరికల్ వీడియోలు వచ్చాయి. మంచి బజ్ పెంచాయి. కుటుంబ ప్రేక్షకులకు సమ్మర్ ఛాయస్ గా ఉంటుందనే నమ్మకాన్ని బయ్యర్లలో కలిగించాయి. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఈ ప్రమోషనల్ కంటెంట్ లో లాజిక్స్ వెతుకుతున్న నెటిజెన్లు తమ ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు. నిన్న రిలీజ్ చేసిన కళ్యాణి వచ్చా పాటలో ఒక మధ్య తరగతి యువకుడు అంత ఖరీదైన పెళ్లి ఎలా చేసుకుంటాడని క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా పాయింటే.
ఒకవేళ సినిమాలో డ్రీమ్ సాంగ్ అయ్యుండొచ్చనే కామెంట్ ఫ్యాన్స్ వైపు నుంచి వినిపిస్తోంది. మాములుగా కల్లో డ్యూయెట్లు వేసుకుంటారు కానీ పెళ్లి పాటలు కాదనేది ఇంకో వాదన. ఎవరిది నిజమో ఏప్రిల్ 5 తేలుతుంది. మరొకరు టీజర్ లో చూపించిన ఒక సీన్లో విజయ్ దేవరకొండ దోస పెనం మీద పేపర్ లాంటిది తీస్తూ ఎదురుగా ఉన్న అభినయ ప్లేట్ లో వేస్తాడు. స్లో మోషన్ లో చూస్తే అది స్పష్టంగా కాగితమని అర్థమైపోతుంది. ట్విట్టర్ లో ఒక వ్యక్తి దీని గురించి ప్రశ్నిస్తే ఏకంగా ఎస్విసి అఫీషియల్ హ్యాండిల్ నుంచి కాస్త ఓపిక పట్టమని సమాధానం రావడం కొసమెరుపు.
సో ఫ్యామిలీ స్టార్ ఆన్ లైన్లో బాగానే టార్గెట్ అవుతున్నాడు. విజయ్ కు దీని మీద చాలా ఆశలున్నాయి. ఖుషి మీద బోలెడు నమ్మకం పెట్టుకుంటే వసూళ్లు బాగానే వచ్చాయి కానీ బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకోలేదు. కాకపోతే లైగర్ గాయాన్ని తగ్గించింది. గీత గోవిందం లాంటి అల్టిమేట్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో పరశురామ్ మీద నిర్మాత దిల్ రాజు భారీ పెట్టుబడి పెట్టేశారు. లక్కీ గర్ల్ మృణాల్ ఠాకూర్ తో పాటు రష్మిక మందన్న చిన్న క్యామియో చేసిన ఈ ఎంటర్ టైనర్ లో గోపి సుందర్ సంగీతం మరో అట్రాక్షన్ గా నిలవనుంది. వారం ముందు వచ్చే టిల్లు స్క్వేర్ తప్ప ఎలాంటి పోటీ లేదు.
This post was last modified on March 13, 2024 12:11 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…