Movie News

తాను చనిపోయానని ట్వీట్ పెట్టిన నటి

మీరా మిథున్.. కొన్ని నెలలుగా కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్న పేరు. సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేయడం, ‘బిగ్ బాస్’ మూడో సీజన్లో పార్టిసిపెంట్‌గా వెళ్లడం ద్వారా ఈమె లైమ్ లై్లోకి వచ్చింది. ఐతే అలా వచ్చిన పాపులారిటీ కంటే.. కోలీవుడ్ సెలబ్రెటీల మీద ఆమె సంచలన ఆరోపణల ద్వారానే ఆమెకు మీడియాలో వచ్చిన కవరేజీతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. దాదాపుగా మన శ్రీరెడ్డి తరహాలో ఆమె కోలీవుడ్ బడా బాబులను టార్గెట్ చేస్తూ వచ్చింది. సూర్య, జ్యోతిక, విజయ్, కమల్ హాసన్, విశాల్.. ఇంకా చాలామందిని ఆమె టార్గెట్ చేసింది. రకరకాల ఆరోపణలు చేసింది. ఐతే ఈ ఆరోపణలు అంత సహేతుంగా అనిపించకపోవడం, వార్తల్లో నిలవడం కోసమే ఆమె పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నట్లు కనిపించడంతో ఒక దశ దాటాక అందరూ ఆమెను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు.

నెమ్మదిగా మీడియా కూడా ఆమెను తేలిగ్గా తీసుకుంది. ఇలాంటి సమయంలో మళ్లీ మీరా మిథున్ వార్తల్లోకి వచ్చింది. తాను చనిపోయినట్లుగా తన ట్విట్టర్ అకౌంట్లోనే ఆమె పోస్ట్ పెట్టడం ద్వారా సంచలనం రేపింది. ‘‘మీరా మిథున్ మృతి చెందింది. పోస్టు మార్టం జరుగుతోంది. విచారణ మొదలైంది. రెస్ట్ ఇన్ పీస్’’ అని ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఫాలోవర్లలో అలజడి మొదలైంది. కొందరు ఈ పోస్ట్ అటెన్షన్ కోసం పెట్టిందే అయి ఉంటుందని లైట్ తీసుకున్నారు. ఇంకొందరు మీరాకు ఏమైందని ఆరా తీశారు. ఇంకా దీనిపై మీరా నుంచి స్పందన లేదు. బహుశా తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని అంటుందా.. లేక ఇంకేమైనా వివరణ ఇస్తుందా అన్నది చూడాలి. కొంత కాలంగా మీరా వ్యవహారం చూస్తే ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఆమెకు చికిత్స అవసరమని మానసిక నిపుణులు అంటున్నారు.

This post was last modified on September 12, 2020 6:39 am

Share
Show comments
Published by
suman
Tags: Meera Mithun

Recent Posts

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

7 minutes ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

21 minutes ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

1 hour ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

2 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

2 hours ago

జగన్ మారిపోయినట్టేనా

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…

5 hours ago