మీరా మిథున్.. కొన్ని నెలలుగా కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్న పేరు. సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేయడం, ‘బిగ్ బాస్’ మూడో సీజన్లో పార్టిసిపెంట్గా వెళ్లడం ద్వారా ఈమె లైమ్ లై్లోకి వచ్చింది. ఐతే అలా వచ్చిన పాపులారిటీ కంటే.. కోలీవుడ్ సెలబ్రెటీల మీద ఆమె సంచలన ఆరోపణల ద్వారానే ఆమెకు మీడియాలో వచ్చిన కవరేజీతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. దాదాపుగా మన శ్రీరెడ్డి తరహాలో ఆమె కోలీవుడ్ బడా బాబులను టార్గెట్ చేస్తూ వచ్చింది. సూర్య, జ్యోతిక, విజయ్, కమల్ హాసన్, విశాల్.. ఇంకా చాలామందిని ఆమె టార్గెట్ చేసింది. రకరకాల ఆరోపణలు చేసింది. ఐతే ఈ ఆరోపణలు అంత సహేతుంగా అనిపించకపోవడం, వార్తల్లో నిలవడం కోసమే ఆమె పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నట్లు కనిపించడంతో ఒక దశ దాటాక అందరూ ఆమెను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు.
నెమ్మదిగా మీడియా కూడా ఆమెను తేలిగ్గా తీసుకుంది. ఇలాంటి సమయంలో మళ్లీ మీరా మిథున్ వార్తల్లోకి వచ్చింది. తాను చనిపోయినట్లుగా తన ట్విట్టర్ అకౌంట్లోనే ఆమె పోస్ట్ పెట్టడం ద్వారా సంచలనం రేపింది. ‘‘మీరా మిథున్ మృతి చెందింది. పోస్టు మార్టం జరుగుతోంది. విచారణ మొదలైంది. రెస్ట్ ఇన్ పీస్’’ అని ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఫాలోవర్లలో అలజడి మొదలైంది. కొందరు ఈ పోస్ట్ అటెన్షన్ కోసం పెట్టిందే అయి ఉంటుందని లైట్ తీసుకున్నారు. ఇంకొందరు మీరాకు ఏమైందని ఆరా తీశారు. ఇంకా దీనిపై మీరా నుంచి స్పందన లేదు. బహుశా తన ట్విట్టర్ అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని అంటుందా.. లేక ఇంకేమైనా వివరణ ఇస్తుందా అన్నది చూడాలి. కొంత కాలంగా మీరా వ్యవహారం చూస్తే ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఆమెకు చికిత్స అవసరమని మానసిక నిపుణులు అంటున్నారు.
This post was last modified on September 12, 2020 6:39 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…