మీరా మిథున్.. కొన్ని నెలలుగా కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్న పేరు. సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేయడం, ‘బిగ్ బాస్’ మూడో సీజన్లో పార్టిసిపెంట్గా వెళ్లడం ద్వారా ఈమె లైమ్ లై్లోకి వచ్చింది. ఐతే అలా వచ్చిన పాపులారిటీ కంటే.. కోలీవుడ్ సెలబ్రెటీల మీద ఆమె సంచలన ఆరోపణల ద్వారానే ఆమెకు మీడియాలో వచ్చిన కవరేజీతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. దాదాపుగా మన శ్రీరెడ్డి తరహాలో ఆమె కోలీవుడ్ బడా బాబులను టార్గెట్ చేస్తూ వచ్చింది. సూర్య, జ్యోతిక, విజయ్, కమల్ హాసన్, విశాల్.. ఇంకా చాలామందిని ఆమె టార్గెట్ చేసింది. రకరకాల ఆరోపణలు చేసింది. ఐతే ఈ ఆరోపణలు అంత సహేతుంగా అనిపించకపోవడం, వార్తల్లో నిలవడం కోసమే ఆమె పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నట్లు కనిపించడంతో ఒక దశ దాటాక అందరూ ఆమెను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు.
నెమ్మదిగా మీడియా కూడా ఆమెను తేలిగ్గా తీసుకుంది. ఇలాంటి సమయంలో మళ్లీ మీరా మిథున్ వార్తల్లోకి వచ్చింది. తాను చనిపోయినట్లుగా తన ట్విట్టర్ అకౌంట్లోనే ఆమె పోస్ట్ పెట్టడం ద్వారా సంచలనం రేపింది. ‘‘మీరా మిథున్ మృతి చెందింది. పోస్టు మార్టం జరుగుతోంది. విచారణ మొదలైంది. రెస్ట్ ఇన్ పీస్’’ అని ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఫాలోవర్లలో అలజడి మొదలైంది. కొందరు ఈ పోస్ట్ అటెన్షన్ కోసం పెట్టిందే అయి ఉంటుందని లైట్ తీసుకున్నారు. ఇంకొందరు మీరాకు ఏమైందని ఆరా తీశారు. ఇంకా దీనిపై మీరా నుంచి స్పందన లేదు. బహుశా తన ట్విట్టర్ అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని అంటుందా.. లేక ఇంకేమైనా వివరణ ఇస్తుందా అన్నది చూడాలి. కొంత కాలంగా మీరా వ్యవహారం చూస్తే ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఆమెకు చికిత్స అవసరమని మానసిక నిపుణులు అంటున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…