బిగ్బాస్ లేటెస్ట్ సీజన్ ఇంకా ఆరంభ దశలోనే వుంది కానీ డ్రామాకి అయితే లోటుండడం లేదు. జనాలకు బాగా తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నా కానీ వివిధ వ్యక్తిత్వాలున్న వాళ్లు హౌస్లోకి వెళ్లడంతో ఇంతవరకు గేమ్ రసపట్టుకి చేరుకోకపోయినా ఆడియన్స్కి కాలక్షేపమయితే అయిపోతోంది. ప్రతి సీజన్లానే ఈసారి కూడా బిగ్బాస్ని కాచి వడపోసిన క్యారెక్టరొకటి హౌస్లోకి వెళ్లింది.
సింగర్ కమ్ యాక్టర్ నోయెల్ షాన్ బిగ్బాస్ సీజన్లన్నీ చూసేసి అవసరమైన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ బుర్రలో ఫీడ్ చేసేసుకున్నాడు. దీంతో అక్కడ ఏమి జరిగినా, ఎవరు ఏమి మాట్లాడినా అది గేమే అనుకుంటున్నాడు. తాను అనుకోవడమే కాకుండా మిగతా వాళ్లను కూడా నమ్మించేస్తున్నాడు. ఆ కన్ఫ్యూజన్లో లాస్య, కళ్యాణి, అభిజీత్, హారిక లాంటి వాళ్లు ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిలో వెర్రి వెంగళాయ్లు అయిపోయారు.
ఇదిలా వుంటే కుర్రాళ్లకు తెగ నచ్చేసిన దివి (మహర్షి ఫేమ్) మొదటి రెండు రోజులు కామ్గా వున్నా సైలెంట్గా అన్నీ గమనిస్తున్నానని, అలాగే తనను ఎవరూ అంత ఈజీగా ఇన్ఫ్లుయన్స్ చేయలేరని చాటుకుని మరింతమంది అభిమానుల్ని సంపాదించుకుంది.
దివికి పెరుగుతోన్న ఫాన్ బేస్ చూసి బిగ్బాస్ ఎడిటర్లు ఆమెను కవర్ చేయడం మొదలు పెట్టారు. అలాగే గంగవ్వ తన పంచ్లతో, సూర్యకిరణ్ తన నిశిత దృష్టితో ఒక వర్గం వారి అభిమానాన్ని చూరగొంటున్నారు.
This post was last modified on September 12, 2020 9:49 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…