స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ క్రేజీ మూవీ టిల్లు స్క్వేర్ విడుదల ఎంతో దూరంలో లేదు. ఈ రోజు మినహాయిస్తే కేవలం 18 రోజులు మాత్రమే బ్యాలన్స్. మార్చి 29 రిలీజ్ ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. ఎలాంటి మార్పు ఉండబోవడం లేదని టీమ్ చెబుతోంది. అయితే ఇంకా హడావిడి మొదలు కాకపోవడం ఫ్యాన్స్ లో అనుమానాలు రేపుతోంది. సాధారణంగా ప్రమోషన్ల విషయంలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ నెల రోజుల ముందు నుంచే తన రాక గురించి సౌండ్ చేసే సిద్దు సైలెంట్ గా ఉండటం వాళ్లకు అంతు చిక్కడం లేదు. కొంపతీసి వాయిదా ఉందాని ఆందోళన పడుతున్న వైనం కనిపిస్తోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒత్తిడిలో జరుగుతున్నందు వల్లే దర్శకుడు మల్లిక్ రామ్, హీరో సిద్దులు బిజీగా ఉన్నారట. దీని వల్ల ఇప్పటికిప్పుడు పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. ఫిబ్రవరి 18 తర్వాత సితార ట్విట్టర్ హ్యాండిల్ లో టిల్లు స్క్వేర్ కి సంబంధించి ఎలాంటి సాలిడ్ అప్డేట్ లేదు. పోనీ కౌంట్ డౌన్ పోస్టర్స్ లాంటివి వదిలారా అంటే అవీ లేవు. అసలే ఆ వారంలో పోటీ తీవ్రంగా ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్ ఆడు జీవితం, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ పోటీలో ఉన్నాయి. వారం తిరక్కుండా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తుంది.
సో వీలైనంత త్వరగా సిద్ధూ జొన్నలగడ్డ కెమెరా ముందుకొచ్చి కబుర్లు పంచుకోవడం మొదలుపెట్టాలి. రెండేళ్ల క్రితం వచ్చిన సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ డీజే టిల్లుకి కొనసాగింపుగా వస్తున్న టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ భారీ ఆకర్షణగా నిలుస్తోంది. అయితే నేపధ్య సంగీతం సమకూరుస్తున్న తమన్ కి ఇంకా ఫైనల్ కాపీ ఇవ్వలేదని, ఈ వారంలో ఇచ్చేస్తే బీజీఎమ్ కు సంబంధించిన ముఖ్యమైన పని అయిపోతుందని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. బిజినెస్ మాత్రం క్రేజీగా జరుగుతోంది. మొదటి భాగం కన్నా నాలుగు రెట్లు అధిక డిమాండ్ ఉన్నట్టు ట్రేడ్ రిపోర్ట్.
This post was last modified on March 10, 2024 9:48 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…