మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో, క్రేజీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే శివరాత్రి పండగ సందర్భంగా విడుదల చేశారు. అయితే కంటెంట్ రేంజ్ కు తగ్గట్టు కిక్ ఇవ్వలేదని, అనుకున్న స్థాయిలో ట్రెండింగ్ కాలేదని అభిమానులు ఫీలవుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. విష్ణుని పూర్తిగా రివీల్ చేయకపోవడం, ఇంత పెద్ద స్కేల్ లో రూపొందుతున్న గ్రాండియర్ కు కనీసం ఒక టీజర్ లాంటిది ఏదైనా వదలకపోవడం ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇంకొంచెం బెటర్ స్టిల్ వదిలి ఉండాల్సిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు లాంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నారు. ఎవరు ఏ పాత్ర చేస్తున్నారనే డీటెయిల్స్ బయటికి రాలేదు కానీ క్రమంగా ఒక్కొక్కరిని పరిచయం చేసేలా ప్రమోషనల్ ప్లానింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా అందరి కళ్ళు శివుడిగా కనిపించబోయే ప్రభాస్ గురించే ఎదురు చూస్తున్నాయి. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముందే ప్రకటించి ఆ మేరకు డేట్లు మార్చుకుంటూ ఒత్తిడి తీసుకోవడం కన్నా షూటింగ్ చివరి దశలో ప్రకటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో విష్ణు దాని గురించి ఓపెన్ కావడం లేదు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా డివోషనల్ మూవీలో కన్నప్పగా విష్ణు పెద్ద రిస్కే చేస్తున్నాడు. కృష్ణంరాజు తర్వాత మళ్ళీ ఏ హీరో ఆ పాత్ర చేసేందుకు సాహసం చేయలేదు. దశాబ్దాల తర్వాత విష్ణు దానికి పూనుకున్నాడు. కొన్నేళ్ల నుంచి ఇది తన డ్రీం ప్రాజెక్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మంచు ఫ్యామిలీకి ప్రతిష్టాత్మక సినిమా కావడంతో ఖర్చు విషయంలో వెనుకాడటం లేదు. హనుమాన్ లాగా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టి పడేలా చేయాలంటే మంచి పబ్లిసిటీ స్ట్రాటజీ అవసరం. స్టీఫెన్ సంగీతం సమకూరుస్తున్న కన్నప్పలో హీరోయిన్ ఎవరనేది అఫీషియల్ చేయలేదు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు. 2024లో కూడా మరోసారి మీరు తప్పు చేసి ఉంటే..…
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఈ రోజు భగీరథ్ కు…
తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత సంచలన డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఖాతాలో ప్రస్తుతం 1400…
ఒకప్పుడు వచ్చిన సినిమాలు నోస్టాల్జిక్ ఫీలింగ్ ఎలా ఇస్తాయో వాటి వెనుక సంగతులు అంతే ఆసక్తి కలిగిస్తాయి. కాకపోతే అవి…
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేసి మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి మెగా ఫ్యాన్స్ ని…
హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా కీలకమైన మూసీ నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రక్షాళన…