Movie News

పూజా హెగ్డే చేతికి స్టార్ వారసుడి సినిమా

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డేకి టైం ఏ మాత్రం బాలేదు. 2023లో ఒక్కటంటే ఒక్కటి సౌత్ రిలీజ్ లేకపోవడం బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయి దుర్గ తేజ్ సరసన గాంజా శంకర్ లో ఛాన్స్ వచ్చిందనుకుంటే అది ఆగిందో ఉందో అర్థం కాని అయోమయం నెలకొంది. దీనికన్నా ముందు గుంటూరు కారం ఒక షెడ్యూల్ చేసి మరీ తప్పుకోవాల్సి రావడం ఇంకో ట్విస్టు. ఇవన్నీ పక్కన పెడితే ఇంత గ్యాప్ తర్వాత ఈ బుట్టబొమ్మకి స్టార్ వారసుడి సరసన ప్రాజెక్టు లాక్ అయ్యింది. కాకపోతే అది కూడా హిందీలోనే కావడం కొసమెరుపు.

వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి రెండేళ్ల క్రితం తడప్ తో డెబ్యూ చేశాడు. ఇక్కడ సంచలనం సృష్టించిన ఆరెక్స్ 100 రీమేక్ ఇది. ఏరికోరి హిట్టు సబ్జెక్టు తీసుకున్నాడు కానీ నార్త్ లో ఆడలేదు. ఫలితంగా తొలి అడుగే ఫ్లాప్ తో మొదలయ్యింది. ఇప్పుడు రెండోది సాజిద్ నడియాడ్ వాలా బ్యానర్ లో చేయబోతున్నాడు. ఇండియాతో పాటు విదేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి అద్నాన్ ఏ షేక్ – యాసిర్ ఝా జంట దర్శకత్వం వహించబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు రిలీజ్ చేయబోతున్నారు.

సంకీ టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. ముందు నుంచి ఉత్తరాదిలో పాగా వేయాలని చూస్తున్న పూజా హెగ్డేకు ఎటొచ్చి సక్సెస్ పలకరించడం లేదు. వయసు పట్టించుకోకుండా మరీ సల్మాన్ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసీకా జాన్ చేస్తే అది కాస్త ట్రోలింగ్ చేసుకునే స్థాయిలో డిజాస్టర్ అయ్యింది. 2022లో ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్, సర్కస్ ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టడం మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. ఈలోగా శ్రీలీల, రష్మిక మందన్నలు అనూహ్యంగా పికప్ కావడంతో పూజా హెగ్డే డిమాండ్ తగ్గిపోయింది. మరి సంకీ అయినా కోరుకున్న బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on March 9, 2024 12:59 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

10 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

1 hour ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

1 hour ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago